• Sree Geetham

    250.00
  • Thribhujapu Naalugo Konam

    విధ్వంస దృశ్యం

    ఇరుకిరుకు దారుల్లో నిప్పు కుంపట్ల మధ్య నడుస్తున్నట్టుగా ఉంది. ధరలు భగ్గుమనడమంటే ఏమో అనుకున్నావ్ ఇప్పుడర్థమౌతోంది కదూ! బాగా కమిలి మగ్గుతున్న, కుళ్ళి పులుస్తున్న, మోటారు ఇంధనం కాలుతున్న, శరీరాల చెమట కంపు కొడుతున్న ఘాటు వాసన గంధక ధూమంలా, చెదరని మేఘంలా ఒళ్ళంతా చిరచిరలాడిస్తూ… పండి పక్వానికొస్తున్న తియ్యటి వాసన కదిలీ కదలని పిల్ల తెమ్మెరలా లిప్తకాలం పాటు ముఖాన్ని స్పృశిస్తూ…

    గాలి వీచదు, చెమట ఆరదు. అయినా, ముదురుటెండలో మార్కెట్ కని బయల్దేరి పాలిస్టర్ చీర ఎందుకు కట్టుకున్నానా అని ఇప్పుడు వాపోవడం నిజంగా బుద్ధితక్కువ పనే. అదిగో ఆ బెంగాలీ అమ్మాయిని చూసైనా నేర్చుకోవాలి. నీలిపూల తెల్లని కాటన్ ప్రింటెడ్ – మైసూర్ కాటన్ లేదా యూపీ హ్యాండ్లూమ్ వెరైటీ… పెద్దపెద్ద పూలతలు డిజైన్ గా అద్దిన పొడవాటి చీరకొంగు దాదాపు నేలకు ఆనుతూ, ఒత్తయిన నల్లని కురచ జుట్టు పోనీటైల్ ముడి చిన్నగా చెదరుతూ, కొంగుచాటు నీలి జాకెట్ ఎగువ నున్నటి మెడ అక్కణ్నుంచి అవతలివైపు దిగువకు విస్తరించుకుపోయిన వీపు అందంగా బహిర్గతమౌతూ, స్లీవ్స్ జబ్బల దంతపు వర్ణం కాంతి మెడలోని సన్నని బంగారు గొలుసు తళతళలతో పోటీ పడుతూ… నాజూకుగా నడుస్తున్న ఆ సింపుల్బ్యూటీ ఆమె మోస్తున్న ప్లాస్టిక్ బుట్టలో నవనవలాడుతున్న కూరగాయల రాశిలాగే తాజాదనానికి నిలువెత్తు నిర్వచనం. పేరు హేమగాత్రి లేదా సుమగాత్రి అయి ఉండాలి. పాలతో స్నానం చేయించినట్లుగా తెల్లగా మెరుస్తున్న బుల్లికారులో స్టీరింగు ముందు కూర్చున్న యువకుడు డోర్ తెరిచి బుట్ట అందుకుంటూ నవ్వుతూ… దబ్బపండు రంగు నిండు బుగ్గల మీద క్లీన్ షేవింగ్ బాపతు పచ్చని చారలు చిత్రంగా సాగుతూ ఎర్రనినోట్లోని సూపర్వైట్ పలువరుస టి.వి. ప్రకటనల్లోలాగా ఫ్లాష్ ఫ్లాష్… నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్. జి.ఎం.గారి అబ్బాయో, చీఫ్ ఇంజనీర్ గారి అమ్మాయో అయి ఉండాలి. దేనికైనా పెట్టి పుట్టాలంటారు! ……………

    250.00
  • Yedu Tharalu

    “పరిశుభ్రమైన గాలి క్షణమాత్రం సోకితేనే గజగజలాడిపోయే ఊపిరితిత్తులు;;; వొంటి నిండా బట్టలుండవు – మలవిసర్జన జరిగిపోతుంటే శుభ్రం(గా)చేసుకోవటానికి కూడా వీలు లేకుండా కాళ్ళూ, చేతులకు సంకెళ్ళు – పండ్లతో, గాయాలతో, చీము నెత్తురులోడే భుజాలు, మోచేతులు, పిర్రలు;;; పిచ్చలు కోసేయ్యటం – మర్మాంగాలు నరికెయ్యటం – ఎముకలను కరుచుకున్న మాంసం వూడొచ్చేదాకా కొట్టటం, నిండు గర్భిణులను పొట్ట కింద గుంత తవ్వి, బోర్ల పడుకోబెట్టి, కొరడాలతో కొట్టటం, జంతువులను వేటాడాల్సిన వేట కుక్కల చేత మనుషులను వేటాడించటం;;; చర్మాన్నీ, నరాల్ని, కండల్నీ, ఎముకనూ, ఒక్క వేటుతో ఛేధిస్తూ, ఓ గొడ్డలి మొన మన కుడి కాలును మన శరీరం నుండీ వేరు చేస్తుంటే…;;; అవయవాలుండవు; ఉన్నా అవి దొరల కోసం! తోడు లేదు – బిడ్డలు లేరు – సంసారం లేదు – స్వజనం లేరు – స్వగ్రామం లేదు – స్వదేశం లేదు – గతం లేదు – భవిష్యత్తు లేదు;;;” నాగరికత, హక్కుల ముసుగు లో ఓ జాతి మరో జాతి మీద సాగించిన దాష్టీకాలను, ఆకృత్యాలను, అర్ధం చేసుకోవటానికి “ROOTS / ఏడు తరాలు” – (By Alex Haley) ని చదవండి. INDEPENDENCE DAY అంటే హాలిడే కదా ఆడుకోవచ్చు అని ఎదురు చూసే పిల్లల చేతా, లాంగ్ వీకెండ్ ఏమో అని క్యాలెండర్లు వెతికే పెద్ద వాళ్ళ చేతా, ఈ పుస్తకం చదివించండి! స్వాతంత్ర్యం, స్వేచ్ఛ ల విలువేంటో, దాని కోసం మన ముందు తరాల వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించారో, త్యాగాలు చేసుంటారో, ఎం కోల్పోయారో, కనీసం ఊహించనైనాగలరు !!

     

    Reviewed By Seshumadhav Chaturvedula

                    విజేతలే చరిత్రను రాస్తారన్న నిష్ఠుర సత్యాన్ని బద్దలుకొట్టి, చరిత్ర పట్ల మన దృక్పథాన్ని సమూలంగా మార్చివేసిన అద్భుత రచన. ఆరు తరాల వెనక అట్లాంటిక్ మహా సముద్రానికి ఆవల ఆఫ్రికా చీకటి ఖండంలో ఉన్న తన వంశం మూలాలు, దాని పుట్టుపూర్వోత్తరాలను వెతికి పట్టుకునేందుకు నల్లజాతి అమెరికన్ రచయిత ఎలెక్స్ హేలీ చేసిన అసాధారణ అన్వేషణ ఫలితమే ఈ పుస్తకం.

    ‘రూట్స్’ పేరుతో 1976 లో ప్రచురితమైన ఈ రచన అమెరికానూ, యావత్ ప్రపంచాన్నీ పట్టి కుదిపేసింది. నల్లజాతి అస్తిత్వాన్ని ఎలుగత్తి చాటడంలో, జాతి వివక్షపై తిరుగుబాటు జెండా ఎగరెయ్యటంలో కీలకపాత్ర పోషించింది. ప్రపంచ వ్యాప్తంగా 60 లక్షలకు పైగా కాపీలు అమ్ముడుపోయింది. 37 భాషల్లోకి అనువాదమైంది. స్వేచ్చ నుంచి సంకెళ్ళకు, సంకెళ్ళ నుంచి విముక్తికి సాగిన ఈ ప్రస్థానం సినిమాగా, టీవీ సీరియల్ గా కూడా గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది.

    250.00
  • Enugula Veeraswami Kasi Yatra

    ఏనుగుల వీరాస్వామి అనే ఒక తెలుగు మహానుభావుడు 19వ శతాబ్దంలో, 100 మంది తీర్థయాత్రికులను చెన్నపట్నం నుండి కాశీ పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్ళి, వారిని క్షేమంగా చెన్నపట్నానికి తీసుకొని రాగలిగాడు. 4 వేల కిలోమీటర్ల పాటు జరిగిన ఈ ప్రయాణంలో గంగానది మీద 1000 కిలో మీటర్ల పాటు పడవ ప్రయాణం కూడా చోటు చేసుకొంది. 15 నెలల, 10 నిమిషాలపాటు కొనసాగిన ఈ ప్రయాణం(1830 – 1831) ప్రపంచ తీర్థయాత్ర చరిత్రలో ఒక అరుదైన సంఘటన.

                                                                                                                 – డా. మచ్చ హరిదాసు

                  ఒకడు ధనము ఆర్జించి దాన్ని మంచి పనుల కోసం ఖర్చు పెట్టకుండా చనిపోవుట నిష్ఫలం.

                                                                                                            – ఏనుగుల వీరాస్వామి

               వీరాస్వామి యాత్రకి వెళ్ళేటప్పుడు నేను అక్కడి వినోదములను రాయించి పంపించాలని అడిగినందుకు ఆయన రాసి పంపుతూ వచ్చారు.

                                                                                                          – కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళ

                మా తాతగారి పేరు కిత్తయ్య పంతులు. వారికి తాతగారైన కిత్తయ్య గారు వీరాస్వామికి దివ్వెల గ్రామంలో ఆతిథ్యం ఇచ్చారు.

                                                                                                       – ఆరుద్ర (సమగ్ర ఆంధ్ర సాహిత్యం)

    250.00
  • Neeli Meghalu

    నీలిమేఘాలు – ఈ శతాబ్దపు రెండో గొప్ప కవితా సంకలనం

    – చేకూరి రామారావు

    పందొమ్మిది వందల తొంభై మూడు అక్టోబరు మూడు తెలుగు సాహిత్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన సుదినం. తెలుగు సాహిత్య చరిత్రలో ఒక నూతనాధ్యాయానికి అంకురార్పణ జరిగింది. స్త్రీ వాద కవిత్వం విజయదుందుభి మోగించిన దినం. ‘నీలిమేఘాలు’ అనే స్త్రీవాద కవితా సంపుటి హైదరాబాదు నగరంలో ఆవిష్కృతమైంది. ఇటువంటి సంపుటం తీసుకురావాలన్న సంకల్పం అంతకు ముందు సరిగ్గా ఏడాది కిందట ఏర్పడి, అనుకున్నట్టుగా సంవత్సరం తిరిగేటప్పటికి సంపుటం తయారయింది.

    నవ్య కవిత్వాన్ని ‘వైతాళికులు’గా సంకలనం చెయ్యటానికి ముద్దుకృష్ణకు ఎన్నాళ్లు పట్టిందో తెలీదు. ఇవాళ ఈ శతాబ్దపు పూర్వార్ధ భాగంలో తెలుగు కవిత్వంలో జరిగిన మార్పుల్ని గ్రహించటానికీ, అనుభవించటానికి ఆధారభూతమైన ఏకైక కవితా సంపుటి “వైతాళికులు”, అనాటి అనేక కవుల కవితా సంపుటులు ఈనాడు దొరకటం లేదు. చాలామంది కవితా ఖండికలు సంపుటాలుగా సంకలితం కానేలేదు. అయినా ‘వైతాళికులు తిరగేస్తుంటే ఆనాటి కవితా ధోరణులు మన అంతరంగాల్లో ఆహ్లాద తరంగాలను కదిలిస్తాయి.

    ఆ రోజుల్లో కూడా ఇప్పటిలాగే నవ్య కవిత్వాన్ని మనసారా ఆహ్వానించిన వాళ్ళతోపాటు వ్యతిరేకించినవాళ్లు కూడా గణనీయమైన సంఖ్యలో వుంటారు. ఒక తేడా వుంది. అప్పుడు వ్యతిరేకించినవారు దిగ్ధంతులైన పండితులు, అక్కిరాజు ఉమా కాంతంగారు, జయంతి రామయ్యగారు, అనంత పంతుల రామలింగస్వామి గారు ఇట్లాంటి గొప్ప గొప్ప పండితులు నవ్య కవిత్వ ధోరణులను నిరసించారు. తమ తర్క శక్తితో ఎదుర్కొన్నారు. అధిక్షేప కావ్యాలు రచించి హేళన చేశారు. ఎన్ని చేసినా కాలప్రవాహంలో అవి మరుగున పడిపోయాయి. దొరుకుతున్న కావ్య సంపుటాల ద్వారా దొరకని వారిని ‘వైతాళికులు’ సంకలనం ద్వారా ఈనాటికీ మనకు ఆనాటి

    250.00
  • Madi Vippina Charitra

    గురువుగా ద్రోణాచార్యుని ప్రతిభా కౌశలం గురించి, మంత్రిగా కౌటిల్యుని సామర్థ్యం గురించి
    చరిత్ర పుస్తకాలలో చదివే పిల్లలకు, ఆ ఇద్దరూ వాస్తవానికి ఏ నిర్వచనం ప్రకారం చూసినా మహా కపటులన్న విషయం తెలియజెప్పాలి.సత్యవర్తన, న్యాయం, సర్వజనుల సమానత్వ భావనలకు ప్రాతినిధ్యం వహించే హిందూమతం ఈ దేశపు ప్రత్యేకత అని చెప్పే సమయంలో అది కులం, పితృస్వామ్య వ్యవస్థలతో దళిత బహుజనులను, స్త్రీలను ఏవిధంగా అణచివేసిందో కూడా వివరించాలి.గాంధీ జీవిత చరిత్రను శ్లాఘించే రచనలు చేసినప్పుడు ఆయన కులవ్యవస్థను, బ్రాహ్మణతత్వాన్ని బలపరిచాడన్న వాస్తవాలను విస్మరించకూడదు.

    250.00
  • Regadivittulu

    రామనాథం గుంటూరు జిల్లా రేపల్లెకి చెందిన వ్యవసాయ కుటుంబంలోని వ్యక్తి. అతని అన్న రత్తయ్య ఊళ్ళో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. రామనాథం చదువుకుని గవర్నమెంటులో ఆడిటరు ఉద్యోగం చేస్తున్నా వ్యవసాయం మీద మక్కువ గలవాడు. మహబూబ్ నగర్ జిల్లా నడిగడ్డ లో బీడువారిన నల్లరేగడి నేలను చూసిన రామనాథం ఆ భూమిలో వ్యవసాయం చేయాలనుకుంటాడు. సరైన పద్ధతిలో చేస్తే, వ్యవసాయం లాభదాయకమే అని నిరూపించాలని అతని కోరిక. తల్లిని, అన్నని ఒప్పించి, ఉమ్మడి ఆస్తిలో కొంత భాగం అమ్మి, పిల్లల్ని అన్న దగ్గర వదిలి భార్యతో కలిసి నడిగడ్డకి వచ్చిన రామనాథం ఓ దొర దగ్గర పొలంకొని అక్కడ వ్యవసాయం మొదలుపెడతాడు. కొంత కాలానికి, చదువు మానేసి వ్యవసాయంలోకి దిగిన అతని అన్న కొడుకు శివుడు రామనాథానికి తోడుగా వస్తాడు. మరికొంత కాలానికి కుటుంబం మొత్తం నడిగడ్డకి వలస వస్తుంది.

    మంచి విత్తనం మాత్రమే మంచి పంటని ఇవ్వగలదని తెలుసుకున్న రామనాథం తన చదువుని, జ్ఞానాన్ని విత్తనాల తయారీలో ఉపయోగిస్తాడు. వ్యవసాయ శాస్త్రజ్ఞుల సలహాలతో కొత్త రకం పత్తి విత్తనాలు తయారు చేసి వాటికి ‘రేగడి విత్తులు’ అని పేరు పెడతాడు. పత్తి పంటకి గిరాకీ పెరగడంతో ఎక్కడెక్కడి వాళ్ళో నడిగడ్డ లో భూములు కొనడానికి డబ్బుతో వస్తారు. అతనున్న ప్రాంతం రాంనగర్ అవుతుంది.

    ప్రయోగాలు చేయడాన్ని ఇష్టపడే రామనాధం వ్యవసాయంలోనే కాదు జీవితాల తోనూ ప్రయోగాలు చేస్తాడు. తన ఇంటి ఆడపిల్లను ఓ తెలంగాణా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. కాలంతో పాటుగా, కొండొకచో కాలం కన్నా ముందుగా మారతాడు రామనాథం. ఆశావహ దృక్పథంతో ముగుస్తుంది కథ.

    250.00
  • 1984 George Orwell

    250.00
  • Out Of Stock
  • Out Of Stock

    Sampadha Rahasyam

    250.00
  • The Guide

    250.00
  • Palo Koyilo Alkmist Rachayitha Vilukadu

    • For kids
    • First published in 2014
    • Copyright by Wpbingo
    250.00
  • Out Of Stock

    Viswa Darshanam

    1 ఉపోద్ఘాతం

    శ్రీ రాముడు నూనూగు మీసాల నూత్న యౌవనంలో వున్నప్పటి ఆయన విద్యాభ్యాసం పూర్తి అయింది. దేశాలన్నీ తిరిగి, పుణ్యక్షేత్రాలన్నీ సేవించుకుని అయోధ్యకు మరలి వచ్చాడు.

    మరలి వచ్చిన నాటి నుంచి శ్రీరాముని మనస్సు ఎందుకో చింతాక్రాం తమైపోయింది. ఏ సుఖాలమీదికి మనస్సు పోవడంలేదు. ఏవేవో ఆలోచనలు ముసురుతున్నాయి. ఏదో అశాంతి, అసంతృప్తి ఆయనను నిలవనీయడంలేదు.

    రాముడి దిగులు చూసి, తండ్రి దశరథుడికి దిగులు పట్టుకుంది. “ఏమిటి నాయనా! ఎందుకిలా దిగులుగా వున్నావు?” అని అడిగాడు. రాముడు “ఏమీలేదు నాన్నగారూ!” అనడం తప్ప, ఎన్నిసారులు అడిగినా తన చింతా కారణం చెప్పలేదు. దశరథుడికి భయం వేసింది. కులగురువైన వశిష్ఠుడికి కబురు పెట్టాడు. ఆయన వచ్చి రాముడిని సంగతేమిటో చెప్పమని గుచ్చి గుచ్చి……………….

    249.00
  • Komuram Bheemu

    ప్రపంచ చరిత్రలో మొదటి నుంచి ఇప్పటిదాక శత్రువుతో సాయుధపోరాటం చేసిన, చేస్తున్న చరిత్ర ఆదివాసులది మాత్రమే. వాళ్ల జీవితాల్లో మార్కెట్టు లేదు. వ్యక్తిగత ఆస్తిభావన లేదు. మన కాలంలో మన కళ్ల ముందు కొమురం భీము ఆకారం చూస్తూ ఉండగానే ఆకాశమంత ఎత్తుకెదుగుతున్నది. ఏకకాలంలో విప్లవోద్యమానికి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి, ఆదివాసీపోరాటాలకి ప్రేరణ కాగలిగిన వ్యక్తిత్వాన్ని వ్యక్తం చేస్తున్నది. భీము అడవి కడుపున విత్తనమయ్యాడు. ‘విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది’ కొమురం భీము నవల ‘దండకారణ్య పర్స్‌పెక్టివ్’లో వచ్చింది. జగిత్యాల జైత్రయాత్రకి కొనసాగింపుగా వచ్చింది. ఇంద్రవెల్లి సంఘటన లేకపోతే, కొమురం భీము నవల లేదు. ఈ నవల రాసి సాహు, రాజయ్యలు కొమురం భీము పోరాటానికి, ఇంద్రవెల్లి పోరాటానికి ఒక గత వర్తమనాల చారిత్రక వారధిని నిర్మించే కృషి చేశారు. అందుకే ఈ నవల వర్తమానంతో జరుపుతున్న సంభాషణ. – వరవరరావు

    230.00
  • Meka Bathuku

    225.00
  • Veyipadagalu Nedu Chadivithe

    వేయిపడగల గురించి ఇప్పుడెందుకంటే…
    ‘కాలచక్రం’ అని చెప్పి, కాలాన్ని చక్రంతో పోలుస్తాం. తిరిగే చక్రం మళ్ళీ మళ్ళీ బయలుదేరే చోటికే వస్తుంటుంది. భారతీయతకు చెందినవాటికి అన్నింటికీ ఈ చక్రస్వభావమే ఉందని నాకు గట్టిగా అనిపిస్తుంది. మిగతా దేశాలు, సమాజాల పరిస్థితి కూడా దాదాపు ఇలాంటిదే కావచ్చు, కొన్ని తేడాలూ ఉండవచ్చు. ఇప్పుడు వాటిల్లోకి వెళ్లకుండా మన విషయానికి పరిమిత మవుతాను.
    భారతీయసమాజ, రాజకీయ, సాంస్కృతికచక్రం మరోసారి బయలుదేరిన చోటికి వచ్చిన దశ ఒకటి ఇప్పుడు నడుస్తోంది. ముస్లింలు, ఆంగ్లేయుల పాలనకాలం నుంచి, మరీ ముఖ్యంగా గత వందేళ్ల కాలం నుంచి తన వైభవ ప్రాభవాలను కోల్పోయాననుకుని దుఃఖానికీ, నిరాశా, నిస్పృహలకు లోనవుతూ వచ్చిన భారతీయసమాజంలోని ఒక ప్రాబల్యవర్గం- ఇప్పుడు వాటినుంచి బయటపడి కొత్త ఊపిరినీ ఉత్సాహాన్నీ పుంజుకోవడం చూస్తున్నాం. ఈ వర్గం ఇప్పుడున్నంత సంబరంగా, సంతోషంగా, గెలుపు గర్వంతో ప్రత్యేకించి, గత నూరేళ్ళలోనూ ఎప్పుడూ లేదు.
    విశ్వనాథ సత్యనారాయణగారి ‘వేయిపడగలు’- దుఃఖం, నిరాశ, నిస్పృహ నిండిన ఈ వర్గపు కృష్ణపక్షదశకు అద్దం పట్టింది. ఇప్పుడు నడుస్తున్న తన శుక్లపక్షదశలో ఈ బృహన్నవలను చదవితే ఏమనిపిస్తుంది? లౌకికంగా నిష్క్రియునిగా నిర్లిప్తునిగా కనిపించే ధర్మారావు ముఖంలోని నైరాశ్యపు చీకట్ల……………

    225.00
  • Manasikamgaa Balavanthulu Cheyani 13 Panulu

      నా ఇరవై మూడవ యేట, మా తల్లి మెదడువాపుతో హఠాత్తుగా మరణించింది. ఆమె ఎల్లప్పుడూ ఆరోగ్యవంతంగా, ఉత్సాహంగా పనిచేసుకుంటూ, ఈ భూమి మీదా చివరి నిమిషం వరకు జీవితాన్ని ప్రేమించిన మహిళా. నిజానికి, మరణించిన ముందురోజు రాత్రి కూడా ఆమెను చూశాను. హైస్కూల్ బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ను చూడడానికి వెళ్ళిన ఆడిటోరియంలో కలుసుకున్నాం. ఆమె ఎప్పటిలాగే నవ్వుతు, మాట్లాడుతూ జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తూ కనిపించింది. అయితే, మరో ఇరవై నాలుగుగంటల్లో వెళ్ళిపోయింది. మా తల్లిని కోల్పోవడం నన్నెంతగానో బాధించింది. ఆమె సలహాలు, నవ్వులు, ప్రేమ లేకుండా మిగిలిన జీవితమంతా నెట్ట్టుకు రావాలని ఊహించలేక పోయాను. ఆ సమయంలో నేను ఒక కమ్యూనిటీ మెంటల్ హెల్త్ సెంటర్లో థెరపిస్టుగా పనిచేస్తున్నాను. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

                                                                                            -ఏమి మౌరీన్.

                                                                                            -ఏ.ఆర్.బాలసుబ్రహ్మణ్యం.

    225.00
  • పల్నాడు కథలు

    తెలుగునాట పల్నాడు సీమకు ఒక ప్రత్యేకత వుంది. తనదైన ఒక వీర చరిత్ర వుంది. పల్నాటి నేల పచ్చి వాసనను పట్టి చూపే ప్రయత్నంగా రచయిత్రి సుజాత వేల్పూరి రాసిన కథలే ఈ ‘పల్నాడు కథలు’ సంకలనం. చదివితే కచ్చితంగా పల్నాటి గడ్డపైన తిరుగాడిన అనుభవాన్ని ఇచ్చే కథలివి.

    225.00
  • Rafi

    టు విద్యా రంగంలో, ఇటు సాహిత్య రంగంలో విశేష కృషి సాగిస్తున్న కొద్దిమంది ఆధునిక తెలుగు రచయిత్రులలో సి. మృణాళిని స్థానం ప్రత్యేకం. పాత్రికేయురాలిగా, రేడియో వ్యాఖ్యాతగా, బుల్లితెర కార్యక్రమాల నిర్వాహకురాలిగా, విమర్శకురాలిగా, కథకురాలిగా, అనువాదకురాలిగా, తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యురాలిగా బహుముఖ ప్రతిభను చాటిన మృదుభాషి మృణాళిని. తన ప్రతిభను గౌరవిస్తూ ఇప్పటివరకు 23 పురస్కారాలను వివిధ సంస్థలు ఆమెకు అందజేశాయి.
    – సి. మృణాళిని

    225.00
  • Rayalaseemalo Aadhunika Saahityam

    విద్వాన్ విశ్వం గారన్నట్టు రాయలసీమ సాహిత్యంలో “శుకపిక శారికావ రుచుల్ వినిపించవు”. అందులో ఆత్మాశ్రయ వాదాలకూ, ఆత్మాన్వేషణా సిద్ధాంతాలకూ చోటు లేదు.రాయలసీమ సాహిత్యం రాయలసీమ బతుకు నీడ.రాయలసీమ సాహిత్యం అలా ఎందుకుందో అర్థం కావాలంటే రాయలసీమ జీవితం ఎందుకు అలా ఉందో తెలియాలి. దాని చలన సూత్రాలను వెదికి పట్టుకొని జీవితాన్ని, సాహిత్యాన్ని సమన్వయం చేయాలి. అలాంటి అరుదైన ప్రయత్నమే ఈ గ్రంథం. ఇది సుదీర్ఘ అధ్యయన ఫలితం.
    225.00
  • Russian Classics

    రష్యన్ విప్లవం జరిగిన వంద సంవత్సరాలు గడిపోయాయి. ఈ విప్లవానికి ముందే “జార్” రాజు పరిపాలించే రష్యాలో నూతన ఆలోచనా ధోరణుల పెల్లుబికాయి. పట్టణాలలో డిసెంబరీష్ట్ తిరుగుబాటు, గ్రామాలలో రాచరిక భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, బానిసల, అర్ధబానిస రైతులలో అసంతృప్తి జ్వాలలు పెల్లుబికాయి. వాటి ప్రభావం వల్ల మేధో, మధ్యతరగతి వర్గాలలో ఓ చైతన్యపూరితమైన కదలిక ప్రాభవం అయ్యింది. దీని ప్రబింబమే రష్యన్ మహారచయితల ఆవిర్భావం.

                           రష్యన్ ఆకాశం పై వెలిసిన వేగుచుక్కలు, పుష్కిన్ , గోగోల్, తుర్గెనోవ్,, కుప్రిస్, చేవోహ్, గోర్కీలు . వీరి రచనలు అనువాదాలు కొన్ని తెలుగులో వచ్చినప్పటికీ, రెండో ప్రపంచ యుద్ధం తరువాత అప్పటి సోవియట్ ప్రభుత్వం సాహిత్యాన్ని చాలా ప్రపంచ బాషలలో అనువదించి ప్రపంచమంతా పంచింది. 1945 నుంచి 1985 వరకు అనేక తెలుగు ప్రజలకు పరిచయం అయ్యాయి. సోవియట్ పతనం అనంతరం ఈ సాహితిధార ఆగిపోయింది.

    225.00
  • Sangati 2

    225.00
  • Kliyo Pathra

    225.00
  • Sangati

    225.00
  • Rendu Kommula Rushi

     

    225.00
  • Anandanni Ponde Margam

    • For kids
    • First published in 2014
    • Copyright by Wpbingo
    225.00
  • AANIMUTYALU

    220.00
  • -12%

    Chick Lit (Telugu)

    Original price was: ₹250.00.Current price is: ₹220.00.
  • Amma Dairylo Konni Pageelu

    Amma Dairylo Konni Pageelu – This book orderd customers will get Rs. 30 CASH BACK OFFER
    (APPLY FOR ONLY ADVANCE PAYMENT MADE TO PHONE PAY NUMBER 6281596253)

    220.00
  • Kaala Padalu

    220.00
  • Maa Badi

    బడిపై నాకలవడిన భక్తిరసమే ప్రధానంగా, విద్యార్థి జీవిత స్మృతులు నింపే ఆనందమే నిధానంగా, నాట్యకళాభిమానమే ఆసరాగా, నా అనుభూతులను నివేదించా. తదాశ్రమ దినాలుస్మృతిపథంలోకి వస్తే, తీగకు లేజిగురుదయించినట్టు, మనసు పునర్వికాసం చెందే, సౌరభ్యం సంస్కారవాసనలు ఉడుగని సహృదయ సంపన్నులు పఠీత్రులోకంలో గుప్పెడున్నా, వారే నాకు పదికోట్లు. వారివారి వృత్త్యుద్యోగవిహిత కృత్యనిర్వహణానంతర సమయాల్లో, వారికీ బాలవ్యాసాంగం, ఏ పదినిమిషాల పాటు, విశ్రామ సమయ పఠనోపయుక్తమైనా నాయీ కృషి సత్ప్రయోజనకారి అయినట్టే భావిస్తా. మరి విద్యాజగత్తులో, ఏ పదిమంది విద్యార్థులకీ రచన, క్రమనిష్టాభినివేశ చిత్తత, సోదర విద్యార్థుల పట్ల సహృద్భావం, ఆచార్యుల పట్ల సద్వినయ సౌశీల్యం, బడిపట్ల భక్తీప్రపత్తులు ఉద్భోధించగల్గిన నేను సార్థకజనుణ్ణి అయితినని సంతసిస్తా.

    220.00
  • By : Sri Sri

    Khadga Srushti

    220.00
  • Rocket Katha

    200.00
  • Okkate Jeevitam

    200.00
  • Dabbu Ammabadunu

    200.00
  • -18%

    Deepavali Pratyeka Kathalu 2024

    Original price was: ₹245.00.Current price is: ₹200.00.
  • Deepika By Penugonda Lakshminarayana

    Progressive writer and advocate Penugonda Lakshminarayana of Andhra Pradesh bagged the prestigious Kendra Sahitya Academy award for 2024

    200.00
  • -20%

    Vartamaname Bahuamanam

    Original price was: ₹250.00.Current price is: ₹200.00.
  • Nalo Unna Prema

    200.00
  • Padileche Keratam

    పుట్టుకతోనే అంగవైకల్యంతో పుట్టిన సాగర్ ఘోష ఈ నవల। అంగవైకల్యంతో పాటు పేదరికంతో కూడా పోరాడి గెలిచిన సాగర్ తనలోని అంతర్ బహిర్ లోకాన్ని ఆవిష్కరిస్తూ, తన ఆంతరంగ కల్లోలాల్ని అక్షరబద్దం చేస్తూ రాసుకున్న ఆత్మ కథే “పడిలేచే కెరటం”। అంగవైకల్యం ఉన్న వ్యక్తుల్లో పోరాట పటిమను, స్ఫూర్తిని నింపే నవల ఇది।
                      అంగవైకల్యంతో బాధపడేవాళ్ళలో సున్నితంగా వ్యవహరించాలని తెల్సినా కొంతమంది , తెలియకుండా చాలామంది వాళ్ళని మానసికంగా హింస పెడుతుంటారు। అంగవైకల్యం ఉన్న వ్యక్తుల విషయంలో మన సమాజంలో ఉన్నంత ఇన్సెన్సిటివ్ గా మారె దేశంలోనూ ఉండరేమో, వాళ్ళని తమ చూపుల్తో, మాటల్తో చేతలతోగాయాపారిచేవాళ్ళెందరో। చదువులేని జులాయి మనుషులు మాత్రమే వీళ్ళని ఎగతాళి చేసి బాధపెడతారనుకోవడం అపోహ మాత్రమే। ఉన్నత విద్యావంతులు, ఉన్నత హోదాల్లో ఉన్నవాళ్ళు కూడా సంస్కారహీనంగా వాళ్ళని అవహేళన చేసి అవమానపరుస్తుంటారు। ” ఈ నవల హృదయంతో చదవండి। వాళ్ళ హృదయ ఘోష విన్పిస్తుంది। మీకళ్ళకు కొందరి జీవితాల్లో మనుషులు అనాలోచితంగానో, అహంకారంతోనో చేసే గాయాలు కన్పిస్తాయి।।

    200.00
  • Karma

    అడవి దారిలో ఇద్దరు యువకులు నడిచిపోతున్నారు. ఒకడు పొడుగు, ఒకడు పొట్టి.పొడవుగా వున్న యువకుడి పేరు యతీంద్ర. ఆరడుగుల ఆజానుబాహుడు. వయసు ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిది మించదు. స్ఫురద్రూపి అని చెప్పలేం కాని నిమ్మపండు రంగులో వున్న అతడి వర్ఛస్సు చూస్తే ఉన్నత కుటుంబానికి చెందినవాడని అర్ధమవుతుంది.”
    వంకీల జుత్తు, కోల ముఖం, పెద్ద పెద్ద కళ్ళు, విశాల ఫాలభాగం, చప్పిడి బుగ్గలు. ముఖ్యంగా అతడి ముక్కు గ్రద్దముక్కులా వంపు తిరిగి ఇట్టే ఆకర్షిస్తుంది. పొడవు మెడ, గొంతుముడి ఏడు ఎత్తుగా తెలుస్తోంది. విశాలమైన ఛాతీ, సన్నటి నడుం, ఎక్సర్సైజ్బాడీ గావటంతో కండలు తిరిగిన దండలు బలిష్టుడని చాటు తున్నాయి.
    200.00
  • Periyar Reader

    పెరియార్ జీవిత సంగ్రహం

    1879 సెప్టెంబర్ 17 : – చిన్న తాయమ్మాళ్, వెంకట నాయకర్ దంపతులకు రెండవ సంతానంగా ‘ఈ రోడ్’లో ఇ.వి. రామస్వామి జన్మించారు. వెంకట నాయకర్ సంపన్న వ్యాపారి. వారిది సంప్రదాయ వైష్ణవ కుటుంబం.

    1885 (ఆరేళ్ళ వయసు) : –  ప్రాథమిక విద్యాభ్యాసం ప్రారంభం
    1889  పదేళ్ళ వయస్సు : – ప్రాథమిక విద్య పూర్తయింది.

    1891 (12 ఏళ్ళు) : – అతను తండ్రి వ్యాపారంలోకి ప్రవేశించాడు.

    1895   ; – తన తల్లిదండ్రులు ఆతిథ్యమిస్తున్న వైష్ణవ గురువులు చెప్పే పురాణ ప్రవచనాలను అతను శ్రద్ధగా వింటూ, వాటిలోని వైరుధ్యాలనూ, అసంబంధతనూ ఆ లేత వయసులోనే ప్రశ్నించేవాడు. హేతువాదం, నాస్తికత అతని మనసులో పొడచూపాయి.
    1898 ; – అతను నాగమ్మాన్ని వివాహమాడాడు. అతను ఆమెను మార్చి ఆమెలో హేతువాద భావనలు నాటేడు.
    1900 : – అతనికి ఒక ఆడపిల్ల పుట్టి అయిదు నెలల వయసులో మరణించింది. తరువాత అతనికి సంతానం లేదు.
    1904  : – తండ్రి మందలించిన కారణంగా అతను సంసార జీవితాన్ని విడిచిపెట్టాడు. ముందు అతను

    విజయవాడ వెళ్ళి, అక్కడ నుంచి హైదరాబాదు, అక్కడ నుంచి కోల్కత్తా వెళ్ళాడు.

    చివరకు అతను గంగానది ఒడ్డున ఉన్న కాశీ పట్టణాన్ని చేరుకున్నాడు. అక్కడి బ్రాహ్మణ సత్రాలలో అతనికి ఉచిత భోజనం దొరకలేదు. రోజుల తరబడి పస్తులున్న రామస్వామి “యజ్ఞోపవీతం” ధరించి బ్రాహ్మణ వేషంలో సత్రంలో ప్రవేశించ ప్రయత్నించాడు. కానీ అతని మీసం అతనికి అడ్డుగా మారింది. కావలివాడు రోడ్డు మీదకు తోసేసాడు. అదే సమయంలో భోజనాలు ముగియడంతో సత్రంలోంచి ఎంగిలాకులను వీధిలోకి విసిరేసారు. గత కొన్ని రోజులుగా తిండి లేక పస్తులున్న రామస్వామి ఆకలికి తాళలేక వీధి కుక్కలతో కలిసి ఎంగిలాకులలోని తిండి తిన్నాడు. అలా తింటూ పైకి చూసిన అతనికి సత్రం ప్రవేశ ద్వారం కనిపించింది. ఆ సత్రాన్ని సంపన్నుడైన ద్రావిడ………..
    200.00
  • Spartacus

    200.00
  • Vanavasi

     భారతీయ సాహిత్యంలో అజరామరంగా నిలబడే గొప్ప బెంగాలీ నవల ఇది. ‘పథేర్ పాంచాలీ’ నవలాకర్తగా విఖ్యాతినొందిన బిభూతిభూషన్ బంధోపాధ్యాయ కలం నుంచి జాలు వారిన మరో అపురూప రచన ఇది. ‘పథేర్ పాంచాలీ’తో సమానమైన ప్రాచుర్యం దీనికి లభించనప్పటికీ ఇది కూడా అంతటి (లేదా అంతకంటే ఎక్కువే) విశిష్ట రచన అన్నది వివేచన పరులైన విమర్శకుల అభిప్రాయం.
                                              నానాటికీ అంతరించిపోతున్న అరణ్యాలు, కనుమరుగైపోతున్న మన జీవనం గురించి ఇంతటి హృద్యమైన అనుభూత్యాత్మక రచన మరోటి మన సాహిత్యంలో అరుదనే చెప్పవచ్చు.
     
    200.00
  • NUDI-NANUDI | నుడి-నానుడి

    సంపాదకులు: జయధీర్ తిరుమల రావు

    మతభావన ఆధిపత్య భవనాలే తప్ప భాషకి తత్వ శాస్త్రం ఉంటుందనే ఆలోచన చాలామందికి లేదు. మనకి విద్యాత్మక బాషా పండితులు. బాషా శాస్త్రవేత్తలు ఉన్నారే తప్ప బాషా తాత్వికులు లేరు. ఆ కొరత తెలుగా ఆంధ్రమా? రచయిత వాగరి వాగరి పేరు పెట్టుకున్న బి. స. బంగారయ్య గారు తీర్చారు.

    ఇంటి పోకడ బడి పోకడ సమాజం పోకడలని బాషా దృక్పథంతో లోతుగా అర్థం చేసుకున్న ఏకైక రచయిత బంగారయ్య.

    భార్యకు బదులు పెళ్ళాం భర్తకు బదులు మొగుడు రక్తము బదులు నెత్తురు స్తనం బదులు చన్ను అనే తెలుగు మాటలు వాడలేమా? సంస్కృత పదాలు వాడీ వాడీ అసలు సిసలు తెలుగు మాటలను మనం మరిచిపోతున్నాం. తెలుగు మాటలను నేటికీ చదువురాని గ్రామసీమల ప్రజలే వాడుతున్నారు. అలాంటి తెలుగు పలుకులు పండితులకి పామరులకు అనేకమందికి అర్ధమవుతుంటే దానిని పక్కన పెట్టడం ఎందుకు? ఇంత చిన్న విషయం గురించి పెద్ద పెద్ద పండితులు ఎందుకు ఆలోచించరు. ఇది ఈ పుస్తకంలో రచయిత ఆవేదన.

    200.00
  • Out Of Stock

    నామిని ఇస్కూలు పుస్తకం

    ఇస్కోలు పిలకాయల కత పిల్లల భాషలో Algebra చదువులా? చావులా?? మా అమ్మ చెప్పిన కతలు పిల్లల్తో మాట్లాడాల్సిన మాటలు.

    ఈ పుస్తకం గురించి ఎంతచెప్పిన తక్కువే? ఎంతవ్రాసిన కొరతే. ఇస్కూలులో పాఠాలు చెప్పే ప్రతి లెక్కల అయ్యవార్లు కొని చదువవలసిన పుస్తకమిది. ఇస్కూలను నడిపే యాజమానులు తమ అయ్యవాళ్ళచే చదించవలసిన పుస్తకమిది. ఇస్కూలు కెల్లే పిల్లలున్న ప్రతి అమ్మ, నాయిన ఈ బుక్కును కొని మరీ చదవాలబ్బా!!. ఇస్కూల్లకెల్లి చదువుకునే పిల్లలున్న స్నేహితులకు, హితులకు, చుట్టాలకు, పక్కాలకు, ఇరుగుపొరుగు అమ్మలక్కలకు, అన్నయ్యలకు బహుమతిగా ఇవ్వతగ్గ పుస్తకం. లక్షలకు లక్షలు డొనేసన్ను ఇచ్చాం. వేలకు వేలు ఫీజులు కట్తున్నాం..”బాగా చదవాలి, మంచి ర్యాంకుల పంట పండించాలి. ఇంజనీరో, డాక్టరో అవ్వాలని” పిల్లలను సతపోరే అమ్మనాన్నలు, అయ్యవార్లు స్కూల్లో పిల్లలకు లెక్కలంటే, ఇంగ్లీసంటే భయంలేని విధంగా చెప్తున్నారా? లేదా గుత్తంగా బట్టి పెట్టిస్తున్నారో, గమనించడం లేదు. నామిని ఈ పుస్తకంలో చెప్పిన విషయాలు ఉహించి రాసినది కాదు. ఆయన అనుభవం నుండి, ఆలోచన నుండి, ఆచరణ నుండి పుట్టు కొచ్చినదీ పుస్తకము. తన అక్కకూతురు తులసి, – తన పిల్లలకు, కొన్నిరోజులు స్కూలు పిల్లలకు టిచరుగా పాఠాలు చెప్పిన అనుభవం నుండి, స్కూలుకెళ్ళె ప్రతి పిల్లాడికి లెక్కలన్నా, ఇంగ్లీసన్నా భయం పోవాలన్న తపనకు ప్రతిఫలమే ఈ పుస్తకము. ఈ మధ్య వార్తాపత్రికల్లో చూస్తున్నాం, చదువువత్తిడికి తట్టుకునే మానసికస్ధితి కోల్పొయి ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల గురించి. వాటికి సమాధానం ఈ పుస్తకంలోని “చదువులా? చావులా”

    200.00
  • పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా

    “వివిధ పాత్రల మనోగతాల్ని ఆవిష్కరించే క్రమంలో వాటిని వారి వారి కథలుగా ‘చెప్పించడం’ ద్వారా నవల రాయడంలో ఒక నూతన మార్గాన్ని సూచించిన గోపీచంద్ సాహిత్య చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు.”

    “ఏ నాటికీ నిలిచే నవల. మనిషి ఎలా ఉంటే సంపూర్ణ జీవితం గడపగలడో వివరించిన విశిష్ట నవల. ఆనాటి ప్రథమ తెలుగు నవల గుణగణాల్ని గుర్తుంచుకునేలా ఈనాటి పాఠకులకు అందజేసిన ప్రచురణకర్తలు అభినందనీయులు.”

    “సాంఘిక జీవితం బ్రతుకుదెరువుకూ అనుభవాలకీ ఉపయోగపడుతుంది. ఒంటరితనం అనుభవాలను జీర్ణించుకోడానికి వ్యక్తిగతాభివృద్ధికీ ఉపయోగపడుతుంది అంటారు గోపీచంద్. కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన ఈ తొలి తెలుగు నవల (1963)ను పునర్ముద్రించి ‘అలకనంద’ మంచి పనే చేసింది.”

    “తెలుగుదేశంలో రచయితల చుట్టూ అల్లుకున్న రాజకీయాలను ప్రతిభావంతంగా చిత్రీకరించిన నవల ‘గోపీచంద్’ రాసిన ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’. “

    200.00
  • Suputrika Praptirastu

    సుపుత్రికా ప్రాప్తిరస్తు

    “తిరుమల ఎందుకండీ”

    అతడేమీ మాట్లాలేదు. ఆమెవైపు తిరిగి నవ్వి వార్డ్ రోబ్ తెరచి ఆమె చీరలు రెండు, నాలుగు చుడీదార్ లు తీసి బెడ్ పై ఉంచాడు. అప్పటికే అక్కడ అతని కొన్ని బట్టలు ఉన్నాయి.

    “దేవుడు ఉండేచోటు కదండీ…” మాటలు పూర్తికాకముందే ఆమెను గాఢంగా కౌగిలించుకుంటూ పెదవుల్ని గట్టిగా చుంబించాడు. “అప్పుడే మొదలెట్టారా” అంది.

    “ఇందుగలడందులేడని సందేహము వలదు. లేనిచోటు వెదకదలచిన ముల్లోకములందూ దొరకదు” అన్నాడు పొయెటిగ్గా.

    మళ్లీ తనే “పాపం ఎలా అవుతుందోయ్. ముందు తయారవు. డ్రెస్ మార్చుకో. దీనికోసం దేవుడు లేని చోటు వెతికి పట్టుకోవాలంటే ఈ జన్మకు అది సాధ్యంకాదు” అన్నాడు.

    “మొండిఘటం…”అని సణుగుతూ, టవల్ భుజంపై వేసుకుని బాత్రూంలోదూరింది

    మొహం కడిగేందుకు బాత్రూంలోకి వెళ్లింది కానీ, చల్లటి నీళ్లు తగిలేసరికి స్నానం చేయాలని అనిపించింది. లో దుస్తులు మాత్రం ఉంచుకుని షవర్ ఆన్ చేసింది. స్నానం కాగానే టవలు తీసుకుంటూ కెవ్వున అరవబోయి, అంతలోనే తమాయించుకుని “ఏమిటిది?” అంది.

    భయపడుతున్నట్ల ఆమె భంగిమచూసి “అలవాటు కావాలి డార్లింగ్. బాత్రూంలో ఎంటరయినందుకే అలా అయితే ఎలా…” అని బుగ్గన ఓ చిటికెవేసి, మొహం కడుక్కుని బయటికెళ్లిపోయాడు.

    తను టవల్ చుట్టుకుని బాత్రూంలోంచి బయటకు వచ్చేసరికి అతను గదిలోలేడు. డ్రెస్ మార్చుకుంది. బెడ్ పై ఉంచిన బట్టల్ని లెదర్ బ్యాగ్ లో సర్దసాగింది. లోపలికొచ్చి అతనితో “బ్యాగు చాలడం లేదండీ” అంది……..

    200.00
  • Rathi Tayaree

    200.00
  • Gaddi Parakatho Viplavam

    దక్షిణ జపానులోని షికోకు దీవిలోని ఓ చిన్న గ్రామంలో ఫుకుఓకా పుట్టాడు. మైక్రోబయాలజీలో శిక్షణ పొంది పంటల తెగుళ్ళ నిపుణుడయ్యాడు. యోకోహామా లో కస్టమ్స్ ఇన్ స్పెక్టర్ గా ఉద్యోగంలో చేరాడు. జీవితం సాఫీగా, ఖుషీగా గడిచిపోతుందను కొంటున్న సమయం లో ఎన్నో ప్రశ్నలు అతన్ని పీడిం చాయి. 25 ఏళ్ళ ప్రాయంలో పొందిన అనుభవం అతని జీవితాన్ని మార్చివేసింది. మానవ ప్రయత్నమంతా వృథా అని అతనికి బోధపడింది. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి పల్లెకు చేరాడు. ఆధునిక వ్యవసాయాన్ని సవాలు చేస్తూ పొలాన్ని దున్నకుండా, ఎరువులు, పురుగుల మందులూ, కలుపునాశిని మందులూ, యంత్రాలూ లేకుండా వ్యవసాయం చేయసాగాడు. ప్రకృతిని సాధ్యమయి నంతగా అనుసరిస్తూ ‘ఏమీ చెయ్యనవసరం లేని’ వ్యవసాయ విధానాన్ని రూపొందించాడు. అతను అవలంబించిన పద్దతుల పల్ల నేల ఏ ఏటికాపడు సారవంతం అవుతూ వచ్చింది. జపానులో మరే ప్రాంతానికీ తీసిపోని దిగుబడులు పొందుతున్నాడు. తన అనుభవసారాన్నంతా ఈ పుస్తకంలో నింపాడు.

    ఆహార సంస్కృతి గురించి, ప్రకృతి జీవనం గురించి ఇందులో వివరించాడు. ఇది జపనీస్ భాషలో 1975లో ప్రచురితమయ్యింది. 1976లో ఇంగ్లీషులోకి అనువాదమయ్యింది. ఆ తరువాత దేశ విదేశాల్లో ఎన్నో భాషల్లోకి అనువాదం అయ్యి, ఎన్నో ముద్రణలను పొందింది. వ్యవసాయానికీ, జీవితానికీ, సంస్కృతికీ, మధ్య విడదీయరాని సంబంధం ఉందని ఫుకుఓకా విశ్వాసం ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకోవాలని ఉన్న ప్రతి ఒక్కరూ చదవదగిన పుస్తకమిది.

                                రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయం మసనోబు ఫుకుఓకాకు 1988లో ‘దేశికోత్తమ’ బిరుదునిచ్చి గౌరవించింది. ఆ సందర్భంలో ఆయన హైదరాబాదు కూడా సందర్శించారు. వ్యవసాయం వ్యాపారం కాదు జీవిత విధానమన్న భారతీయ సంప్రదాయానికి జీవం పోసే పుస్తకమిది.

    200.00
  • Pravahinche Uttejam Che Guevara By Katyayani

    “చేగెవేరాని ” క్యూబా విప్లవానికో, బొలివియా పోరాటానికో పరిమితం చేసి చూడలేము. తను విప్లవ స్వప్నాల్ని ప్రపంచరీకరించిన భావుకుడు, విప్లవకారుడు. గెరిల్ల యోధుడు, అరుదైన నాయకుడు.. జీవన్మరణాలు రెంటికి సార్ధకత ఉండాలని తపించిన మనిషి.. అతని జీవితం లోని సమకాలీన ప్రాధాన్యతను మళ్లీ మన ముందుకు తెచ్చేదే ఈ రచన.

    200.00
  • Kishan Chander Enika Chesina Kathanikalu By R Chandrasekhara Reddy , Jai Ratan

     కిషన్ చందర్ కథలను అనువాదం చెయ్యడం నాకు గొప్ప అనుభూతి. మనకు తెలియని జీవిత పార్శ్వలను కొన్ని ఆవిష్కరిస్తే మరికొన్ని మనకు తెలిసిన విషయాలనే కొత్తగా ప్రదర్శిస్తాయి. వాస్తవికత కళాత్మకతల కలనేత కిషన్ చందర్ కథానికా సాహిత్యం. దేశ విభజన నాటి విషాదాలను, యుద్ధానుభవాలను, అరుదైన మానవ సంబంధాలను మనం కిషన్ చందర్ కథలలో చూడవచ్చు . అంతేకాదు మనిషి విలువలను విస్మరించిన మనకార్య నిర్వహణ వ్యవస్థ నగ్నరూపాన్ని కూడా కొన్ని కథలలో చదివి నిబిడాశ్చర్యంలో మునిగిపోతాం. మౌఢ్యం మన జాతిని ఎలా వెర్రిదానిని చేస్తుందో తెలుసుకుంటాం.

                                                                                                 – జై రతన్, రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

    200.00
  • ALgorithm

    200.00
  • Loka Charitra

    200.00
  • Inner Engineering

    200.00
  • Munniti Gitalu

    200.00
  • Aavarana

    200.00
  • Out Of Stock
  • Shivangi

    200.00
  • Arugu

    200.00