Best Seller Items
Amma Dairylo Konni Pageelu
₹200.00THINK AND GROW RICH (Telugu)
₹199.0021 Va Sathabdhi Vyaparam
₹225.00Gelupu Sare. . . Batakadam Elaa?
₹120.00Telugu Sahitya Sameeksha 1
₹400.00Antarani Vasantham
₹250.00Yudha Kala
₹150.00Veeranjaneya Leelamrutham
₹300.00Vaktha (Telugu Edition)
Original price was: ₹200.00.₹180.00Current price is: ₹180.00.Ivee Mana Moolaalu
₹450.00Veellanemi Cheddam
₹120.00Vidvamsam
₹550.00Visva Katha Sathakam
₹400.00Mudu Darulu
₹395.00Sri Ramaraya Vastu Sastramu
₹200.00Asamardhuni Jeeva Yatra
₹150.00Parva
₹600.00Ukku Padam
₹180.00Nenu Hinduvu Netlayitha
₹250.00Vennelo Adapilla
₹100.00Banavathi
₹250.00Nenu Mee Bramhanandam
₹275.00Geetha Saram Navajevana Vedam
₹260.00Sampadha Rahasyam
₹250.00Telugu Sahitya Sameeksha 2
₹400.00Latkorsaab
₹120.00Anandanni Ponde Margam
₹225.00Featured Items
GET EPIC SHIT DONE (Telugu)
₹399.00Eppatiki Alane
₹350.00Komuram Bheemu
₹250.00Irani Cafe
₹150.00Andaala Natudu Harnath
₹250.00Veyipadagalu Nedu Chadivithe
₹225.00Pakudu Rallu
₹600.00Vyaktitva Deepam
₹150.00Vijayam Vaipu Payanam
₹70.00Viswa Vijetha
₹350.00Visva Katha Sathakam
₹400.00Veeranjaneya Leelamrutham
₹300.00Ramayanam
₹275.00Vaaduka Telugu Padakosam
₹200.00Bhagavatam
₹200.00Yudha Kala
₹150.00Parva
₹120.00 – ₹200.00-
Avunu Nenu Gelavalanukuntunnanu Kani Ela?
₹120.00సంతోషంగా ఉండండి (Be Happy)
ఎప్పుడు సంతోషంగా ఉండడం మన హక్కు, సంతోషమే సగం బలం. కానీ, ఎక్కువ మంది ఈ విషయం గుర్తించక ఎప్పుడు ఏదో నిరాశతో, బాధతో బ్రతుకుతూ ఉంటారు. బాధపడటం అనేది Negative Energy. దీని వలన మనకు అన్ని Negative ఫలితాలు ఉంటాయి కానీ Postive ఫలితాలు ఉండవు. ‘మనం బాధతో ఉంటే దానిని బ్రతకడం అంటారు. సంతోషంగా ఉంటే దానిని జీవించడం అంటారు. సంతోషం మరియు నవ్వుతో యవ్వనం తిరిగి వస్తుంది. ”
–షేక్స్పియర్
ఆనందానికి FORMULA :-
ఆనందం = ఆరోగ్యం +సంపద+మంచి మానవ సంబంధాలు
ఆరోగ్యం = వ్యాయామం + మంచి తిండి + సరిపడ నిద్ర
సమస్యలు అందరికీ ఉంటాయి :-
ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏదో ఒక సమస్య తప్పకుండా ఉంటుంది. ఆఖరికి సంపన్నుడు ముఖేష్ అంబానీ కైనా ఏదో ఒక సమస్య ఉంటుంది. చిన్న వాళ్ళకు చిన్న సమస్యలు ఉంటాయి. పెద్దవాళ్ళకు పెద్ద సమస్యలు ఉంటాయి. కానీ, సమస్యలు అనేవి Common
సమీపంలో ఏదో భవనం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నేను ప్రతిరోజూ సాయంత్రం వాకింగ్ చేస్తూ అక్కడ కాసేపు కూర్చుంటాను. చాలా మంది పేదకార్మికులు అక్కడ తాత్కాలికంగా గుడిసెలు వేసుకుని నివసిస్తూ పనిచేస్తుంటారు. వారి పిల్లలు ఒకరి చొక్కా మరొకరు పట్టుకొని “రైలు బండి రైలు” అనే ఆట ఆడుతుంటారు. ఎవరైనా ఒకరు ఇంజన్ అవుతారు, మిగిలినవారు బోగీలు అవుతారు. ప్రతిరోజు ఈ పిల్లలు మలుపులు తిరుగుతూ కేరింతలు కొడుతూ ఆడుతూ ఉండే ఈ ఆటను చూడడం నాకు ఇష్టమైన దినచర్యగా మారిపోయింది.
0 చాలా రోజులు వాళ్ళ ఆటలు గమనిస్తున్నాను. ఇంజన్గా ఉన్న పిల్లవాడు మరో రోజు బోగిగా, బోగీగా ఉన్న పిల్లలు ఇంజన్ గా ఇలా మారుతూనే ఉన్నారు కానీ, ఒక చిన్న బాలుడు, సగం నిక్కరు మాత్రమే ధరించి తన చేతిలో ఒక చిన్న ఆకుపచ్చ వస్త్రాన్ని పట్టుకుని రోజువారీ గార్డుగానే ఉంటున్నాడు………….
-
-
-
Christu Charitra (Gurram Jashuva Rachanalu)
₹100.00పద్మభూషణ్, కళాప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా (18951971) ఇరవయ్యవ శతాబ్ది తెలుగు కవుల్లోనే కాక, వెయ్యేళ్ళకు పైబడ్డ తెలుగు కవిత్వ చరిత్రలో విశిష్టస్థానం సముపార్జించుకున్న కవి. తన భావనాబలంలోనూ, కవిత్వ ధారలోనూ, సంస్కారయుతమైన పదప్రయోగంలోనూ, సౌష్ఠవపద్య శిల్పంలోనూ మహాకవుల సరసన నిలబడగలిగినవాడు. ముఖ్యంగా సామాజిక అన్యాయాన్ని, కులమతాల అడ్డుగోడలు వేళ్ళూనుకున్న అవ్యవస్థనీ ప్రశ్నించడంలోనూ, తెలుగు కవిత్వంలో అంతదాకా చోటు దొరకని దళిత జీవనాన్ని కావ్యవస్తువుగా స్వీకరించి, అభాగ్య సోదరుడి పక్షాన నిలబడడంలోనూ ఆయనే మొదటివాడు.
‘క్రీస్తు చరిత్ర’ (1963) జాషువా గారి కావ్యాలన్నిటిలోనూ తలమానికమైనది. ఆ కావ్యానికి సాహిత్య అకాడెమీ పురస్కారం లభించడంలో ఆశ్చర్యం లేదు.
క్రీస్తు చరిత్రలో ప్రధానంగా మూడు అంశాలున్నాయి. మొదటిది, ఆయన సువార్తల ఆధారంగా క్రీస్తు చరిత్రని ఎంతో శ్రద్ధతో, భక్తితో, వినయంతో తిరిగి చెప్పారు.
రెండవది, ఈ కావ్యంలోని పద్యనిర్మాణంలో ఆయన ఎన్నోచోట్ల కవిత్రయాన్ని తలపించే ఎత్తులకు చేరుకోగలిగారు.మూడవది, చాలా ముఖ్యమైనది. అదేమంటే, తొలినుంచీ జాషువాలో ఈ లోకం పట్ల గొప్ప ఆనందం, ఈ సమాజం పట్ల తీవ్రమైన అసంతృప్తి ఒకదానితో ఒకటి పెనవేసుకునే వున్నాయి. కాని దయామయుడూ, పతితపావనుడూ అయిన యేసు కథ చెప్తున్నప్పుడు అంతదాకా తన అంతరంగంలో సంఘర్షిస్తూ వస్తున్న ఆ పరస్పర విరుద్ధ భావాల్ని ఆయన సమన్వయించుకోగలిగాడనీ, తనకై తాను ఒక సమాధానం పొందగలిగాడనీ అనిపిస్తుంది.
-
Ghost Murders
₹300.00ఘోస్ట్ మర్డర్స్ !
రాత్రి పదిదాటింది. ఇంకా భర్త రాజారావు ఇంటికి రాలేదు. విమల పరుపుమీద పడుకొంది. గదిలో జీరో వాట్ బల్బ్ వెలుగుతోంది. ఆమెకు నిద్రపట్టడంలేదు. క్లబ్బులో కూర్చుని చీట్లపేక ఆడుతూ భర్త ఇంటిని మర్చిపోయి వుంటాడు!
ఏదో చప్పుడయింది. ఉలిక్కిపడుతూ ఆమె లేచి కూర్చుంది. లోపల గదుల్లోంచి ఏదో చప్పుడు వినపడుతోంది. బాత్రూమ్ పక్కనున్న స్టోర్ రూమ్లోంచి ఆ చప్పుడు వస్తోందని ఆమె ఊహించింది. స్టోర్ రూమ్లో ఎంతో తుక్కుంది. ఆ గదిని బాగుచేయడానికి ఆమెకు టైము చిక్కడంలేదు. అప్పుడే ఈ ఇంటికొచ్చి మూడేళ్ళు దాటింది.
పక్కనే మరో పరుపుమీద పడుకున్న కూతురివైపు ఆమె చూసింది. సుందరి గాఢ నిద్రలోవుంది. ఆమె వయస్సు పదేళ్ళుంటుంది. విమల మళ్ళా పరుపుమీద వాలింది. ఏవేవో చప్పుళ్ళు వినపడుతున్నాయి పక్క ఇంట్లోంచి.
విమల ఆలోచిస్తోంది పక్కఇంట్లో ఎవ్వరూలేరు. ఇంటికి తాళంవేసి వుంటుంది. పదేళ్ళక్రితం ఎవరో అడ్వకేట్ అందులో వుండేవాడు. కొడుకు చనిపోయాక అడ్వకేట్ భార్యతోసహా కాశీకి వెళ్ళిపోయాడు. మళ్ళా తిరిగి రాలేదు. వాళ్ళిద్దరూ ఏమయ్యారో ఎవ్వరికీ తెలియదు. వాళ్ళు వెళ్ళిపోయిన కొద్దికాలానికి కూతురుకూడా మరణించింది. ఇదంతా ఊళ్ళోవాళ్ళు చెప్తూంటే విమల విన్నది. ఆమెకు బియ్యం అమ్మే మీరయ్య జ్ఞప్తికొచ్చాడు.
ఆ వీధిలో వాళ్ళందరికీ గత ఇరవై ఏళ్ళగా మీరయ్య బియ్యం అమ్ముతున్నాడు. అతడికి అందరిచరిత్రా తెలుసు.
“విమలమ్మగారూ, పక్కింట్లో అడ్వకేట్ మూర్తి వుండేవారు. మంచి ప్రాక్టీస్. ఆయనకూతురు డాక్టర్ చలంగార్ని పెళ్ళాడింది. కాని ఆమె చనిపోయింది. కొడుకు శేఖర్ ఈ ఇంట్లోవుండే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెపేరు పార్వతి. పార్వతి చాలా అందంగా వుండేది. పార్వతి ప్రేమ ఫలించలేదు. శేఖర్ చనిపోయాడు. పార్వతి తల్లీ తండ్రి ఈ ఇల్లువిడిచి వెళ్ళిపోయారు,” అన్నాడు మీరయ్య ఒకసారి………………..
-
Na Daivam N T R
₹250.00అది ఒక యోగం.
ఆయన ఒక దైవం!
ఇది నిజం.
ఈనాటి ఈ బంధం ఏనాటిదో…
ఉడతాభక్తిగా ఈ పొత్తం.
ఊహ తెలిసిన దగ్గర నుంచి అదే అభిమానం.
ఋషిని చూసాను ఆయనలో.
ౠకలకు కాదు ఇది.
ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఇది.
ఏనాటికీ చెక్కు చెదరని అభిమానం అది.
ఐరావతం ఎక్కినంత ఆనందం, ఆయన నా భుజం మీద చెయ్యి వేస్తే… ఒకింత అనుమానం వద్దు, ఆయన దీవిస్తే అంతే… ఓటమి ఉండదు. అంతా ముందడుగే. ఔత్సాహికుల్లారా నిద్రలేవగానే అంతఃకరణ శుద్ధితో ఆయన్ని స్మరించుకోండి. అంతా మంచే జరుగుతుంది.
అ నుంచి అః వరకు ఇది నా దైవానికి సమర్పించిన అక్షరమాల.
ఎక్కడో మేడూరు అనే గ్రామంలో పరుచూరి రాఘవయ్య, హైమావతమ్మల కడుపున నాల్గవ సంతానంగా జన్మించిన ఈ పరుచూరి గోపాలకృష్ణ గుండెల్లో దైవంగా నందమూరి తారకరామారావు గారు ఎలా వెలిశారు, ఆ దైవం ఆశీస్సులు………..
-
Raaga Saadhika
₹100.00స్వర్గ నరకముల ఛాయా దేహళి
చిన్నప్పుడు, ఏ తరగతి పుస్తకంలోనో గుర్తు లేదు కానీ గౌతమబుద్ధుని పాఠం ఉండేది. సిద్ధార్థుడు బుద్ధునిగా మారిన ప్రయాణం చాలా కలవరపెట్టింది. ముఖ్యంగా సిద్ధార్థుడు జర, రుజు, మరణాలను చూసి అశాంతికి లోనై, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం నా మనసు మీద చెరపలేని ముద్ర వేసింది.
చిన్నవయసులో ఇ అనేది పిల్లలకి సురక్షిత స్థలం. మేడ అయినా గుడిసె అయినా అది తమని పొదువుకునే చోటు, తమవారుండే చోటు.
ఒక యువకుడు, తల్లిదండ్రులను, భార్యాబిడ్డలను, సురక్షిత స్థలాన్ని వదిలి అసలు ఎందుకు వెళ్ళాడు, ఏమి సాధించాడన్నది నన్ను ఆకర్షించలేదు. ఎలా వెళ్ళగలిగాడన్నదే బాధించింది. అలా వెళ్ళిపోవడానికి కారణమైన వార్ధక్య, అనారోగ్య, మరణాలు సిద్ధార్థుడిని ఏమో గానీ నన్ను చాలా భయపెట్టాయి.
ఒక బొమ్మ వేస్తేనో, ఒక కవిత రాస్తేనో నలుగురికీ చూపడానికి సిగ్గుపడే రోజులవి. ఇక మనసులోని ఆలోచనలు, భయాలు, సంఘర్షణలని బైటకి చెప్పుకోవడానికి ఆస్కారమే లేదు. అసలు చెప్పుకోవచ్చని కూడా తెలీదు.
ముసలితనం వల్ల అనారోగ్యం వస్తుంది, అనారోగ్యం వల్ల చనిపోతారు. ఈ మూడింటికి మనిషి ఉనికి అతుక్కుని ఉంటుంది. ఈ గొలుసుకట్టులో ఎపుడు, ఎవరికి ఏది ఎదురైనా నాకు గుబులుగా ఉండేది.
మనుషులు చావు గురించి మా ఊళ్ళో ఒక వదంతి ఉండేది. ఒక శవం లేస్తే వెంటనే మరి మూడు శవాలు తోడు బోతాయని చెప్పుకునేవారు. పిల్లకాయలంతా శవం ఊరేగింపు చూడటానికి ఎగబడితే నేను లోపలి గదిలోకి పారిపోయేదాన్ని.
ఆ నలుగురు దాటిపోయేకాలంలో ‘అస్తి నాస్తి విచికిత్స’తో మనసు నిండిపోయేది. తచిన్నవయసుకి అన్ని బరువైన ఆలోచనలు ఎలా మోసానో ఇప్పటికీ ఆశ్చర్యమే.
మరణం పెద్ద ప్రశ్నలా చాలా జీవితాన్ని ఆక్రమించింది………………..
-
Sradhdhaagni Jwaala
₹175.00మొదటి ప్రసంగం
మనం ఏదో ఆదర్శం గురించో, విశ్వాసం గురించో, ఏదో సంస్థ కోసమో ఏ రకమైన ప్రచారమూ చెయ్యడం లేదని ముందుగా నేను చెప్పదల్చుకున్నాను. బాహ్య ప్రపంచంలో ఏమి జరుగుతున్నదనేదాన్ని మనం కలిసి పరిశీలిస్తున్నాం. దీన్ని మనం భారతీయ లేక అమెరికన్ లేదా యూరోపియన్ దృక్పథాల ద్వారానో, ఏదో ఒక నిర్దిష్ట జాతీయ ప్రయోజనం దృష్ట్యానో చూడటం లేదు. ప్రపంచంలో నిజంగా ఏం జరుగుతోంది అన్న దానిని మనం కలిసి గమనిస్తున్నాం.
మనం కలిసి ఆలోచిస్తున్నాం. అయితే ఒకే మనసుతో లేక ఒకే మానసిక ధోరణితో కాదు. కలిసి ఆలోచించడానికీ, ఒకే మనసుతో ఆలోచించడానికీ తేడా ఉంది. ఏకచిత్తం ఉండటం అంటే మనం ఏవో విశ్వాసాలకు, భావనలకు చేరుకున్నట్లు. ఒక నిశ్చయానికి వచ్చేసినట్లు. కాని కలిసి ఆలోచించడం అనేది చాలా విభిన్నమైనది. జరుగుతున్న విషయాలని నిరపేక్షంగా, నిష్పక్షపాతంగా చూసే…………….
-
-
Susrutha Samhita
₹600.00సుశ్రుతసంహిత – చికిత్సాస్థానము
ప్రథమాధ్యాయము
అవతారిక :- ఆయుర్వేదము యొక్క ప్రయోజనములు రెండు విధములు. వ్యాధులచే బీడింపబడువారికి వ్యాధులను బోగొట్టు టొకటి, స్వసులుగా నుండు వారి ఆరోగ్యమును కాపాడుకొను విధులను బోధించు టింకొకటి. ఈ రెండును నెరవేర్చ వలె ననిన వ్యాధితుల కుపకరించు నౌషధాది పరికరములు, దేశ కాలాది స్వరూపములు
మొదలగువాని జ్ఞానమును, ఆయా ప్రత్యేక వ్యాధుల యొక్క నిదాన – పూర్వరూప – సంపాప్యుపర యాదుల జ్ఞానమును, చికిత్సకును నిదానమునకును గూడ విశేషోపశార మును జేయు శారీరజ్ఞానమును అత్యంతావశ్యకములై యున్నవి. ఆ మూడు విధము లను జ్ఞానములను గలుగ జేయుటకు వరుసగా సూత్ర- నిదాన – శారీర స్థానములు. ఇది వజలో చెప్పబడినవి.
ఇప్పు డాయుర్వేద ప్రయోజనములగు వ్యాధి చికిత్సా – స్వస్థపరిరక్షణములను వివరింపవలసిన అవసరము కలిగెను. అందు మొదట జెప్పబడిన వ్యాధి చికిత్సాస్వరూప మును విపులముగా నిరూపించి పిమ్మట స్వస్థపరిరక్షణోపాయములను నిరూపింప సమ | కటి ఆ భగవంతుడగు దివోదాస ధన్వంతరి సుశ్రుతాదులను గురించి చెప్పుచున్నారు…
ఈ సుశ్రుత తంత్రమును గ్రంథము శల్యతంత్ర ప్రధానముగా చెప్పబడుట చేత ము నుందు అణచికిత్సలను వివరింపవలసియుండుటచేత ద్వివ్రణీ యమును చికిత్సను చెప్పుట శారంభించుచున్నారు, మూ!! అథాతో ద్వివ్రణీయం చికిత్సతం వ్యాఖ్యాస్యామః.
“యథోవాచ భగవా? ధన్వ నరః సుశ్రుతాయ.
చికిత్స కవసర మైన పూర్వాంగములు బాగుగా వివరించిన పైని ప్రసక్తమగు వ్యాధి చికిత్సను వివరింపవలసియుండుట చేత ద్విశ్రణీయ మను చికిత్స నీయధ్యాయ మునందు వివరించెద మని శ్రీ భగవద్ధన్వంతరి సుశ్రుతుని కొతు విధముగా జెప్పసాగెనట. మూ|| ద్వౌ వ శోభనతః – శారీర ఆగనుక చేతి. తయోః శారీరః పవన
పిత్త కఫ శోణిత సన్ని పాత నిమిత్తు, ఆగస్తురది పురుష – పశు …………
-
Ivee Mana Moolaalu
₹450.00సాహసం, కానీ ఎంతో అవసరం
కల్లూరి భాస్కరం ప్రసిద్ధ పాత్రికేయులని అందరికీ తెలుసు. కాని 1980 తర్వాత తెలుగు కవిత్వంలో వచ్చిన మార్పుని ముందే పసిగట్టిన కవి అని చాలామందికి తెలియకపోవచ్చు. ‘మౌనం నా సందేశం'(1980) పేరిట ఆయన వెలువరించిన కవితాసంపుటి సమకాలిక తెలుగు కవిత్వంలో ఒక వేకువ పాట.
ఆయన చేయి తిరిగిన అనువాదకుడని కూడా కొందరికి తెలియకపోవచ్చు. పి.వి. నరసింహారావుగారి ‘ఇన్సైడర్’కు ‘లోపల మనిషి'(2002) పేరుతో ఆయన చేసిన తెలుగు అనువాదం ప్రశస్తమైన కృషి. అలాగే రామ్మోహన్ గాంధీ రచన ‘మోహన్ దాస్’కు చేసిన అనువాదం(2011) కూడా ప్రశంసనీయమైన పుస్తకం. ఆయన రాసిన ‘కౌంటర్ వ్యూ’ చదివినవాళ్ళకి ఆయన సిద్ధహస్తుడైన కాలమిస్టు అనీ, ‘వేయిపడగలు నేడు చదివితే’ చదివినవాళ్ళకి ఎంతో ప్రతిభ కలిగిన సాహిత్య విమర్శకుడనీ తెలుస్తుంది. తెలుగు కవిత్వంలో కాలికస్పృహ పేరిట ఆయన చేసిన ప్రతిపాదన ఎంతో మౌలికమైనదని చేరాలాంటి వాడే ప్రస్తుతించాడు. ఇక ‘మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే'(2019) పేరిట ఆయన వెలువరించిన ఉద్గ్రంథం ఆయన్ని సమకాలిక తెలుగు జిజ్ఞాసువుల్లో, పరిశోధకుల్లో అగ్రశ్రేణిలో నిలబెట్టింది.
ఈ బృహధ్రంథాలన్నీ ఒక ఎత్తూ, ఇప్పుడు ‘ఇవీ మన మూలాలు’ పేరిట మీ చేతుల్లో ఉన్న ఈ పుస్తకం ఒక ఎత్తు. ఇది ఒక మల్టి-డిసిప్లినరి అధ్యయనం.
—-ఇవీ మన మూలాలు 7
-
Nenu Mee Bramhanandam
₹275.00ఈ పుస్తకం ఎందుకు చదవాలి?
నేనేంటో నా సినిమాలు చెప్తాయి…
నేనేంటో మీ హృదయాలు చెప్తాయి…
నేనేంటో నా అవార్డులు చెప్తాయి…
నేనేంటో నా బిరుదులు చెప్తాయి…
కానీ ఈ నేను నేనుగా మీ ముందుకొచ్చే ముందు…
నేనెంత సంఘర్షణ అనుభవించానో, ఎన్ని సమస్యలు అధిగమించానో,
ఎన్ని పరిస్థితులను ఎదుర్కున్నానో, ఎన్ని సమస్యల నుండి గట్టెక్కి వచ్చానో మీకు తెలీదు.
మీకు తెలిసిన బ్రహ్మానందం నాణేనికి ఒక వైపు మాత్రమే.
ఆ రెండోవైపే ఈ పుస్తకం!
ఇందులో నా జీవితం యథాతథం!!
***
ఒకరి అనుభవం – ఒకరికి పాఠ్యాంశం కావొచ్చు.
ఒకరి అనుభవం – ఒకరికి మార్గదర్శకం కావొచ్చు.
ఆ ఒకరు మీరు కావొచ్చు!
మీలో ఒకరైనా కావొచ్చు!
అందుకే నేను – నన్ను ఈ పుస్తకంగా మలచుకున్నాను………
-
Okka Karachaalanam Chey
₹100.00చలిని జయిద్దాం
కిటికీ అద్దాల్ని
అలుముకున్న చలి
తలుపుల సందులోంచి
ఇళ్లలోకి దౌర్జన్యంగా
దూసుకువస్తోందికాళ్లను చుట్టుకుని
గోళ్ల నుంచి పాకి
వేళ్లను మొద్దుబారిస్తోంది
కనురెప్పలపై పొడిపొడిగా పేరుకుని
చూపుల్నిమంచుగా మారుస్తోంది
చలి శరీరాన్ని గడ్డకట్టిస్తోంది
జీవితాన్ని నిస్తేజం చేస్తోంది.మాటలపైనా, పలకరింపులపైనా
చిరునవ్వుల పైనా
పొగమంచు క్రమ్ముకుంటోంది
చలి చర్మాన్ని వేడెక్కకుండా
అడ్డుకుంటూ
మెదడులోకి ప్రవేశించి
ఆలోచనలను
మృత్యువాయువై చుట్టుకుంటోంది
చలి నిటారుగా ఉన్న
వెన్నెముకల్ని పరిహాసమాడుతూ
కర్కశ స్పర్శతో జలదరింపజేస్తోంది………….. -
Shikari
₹300.00శికారి
కొట్లాట కొంచెం తెరిపిచ్చె.
‘నానా’కు సారాయి మత్తు దిగిందో. ఎక్కిందో తెలేదు. సుంకులమ్మ కట్ట మీద కాల్లు బారజాపుకొని కూచోనుండాడు. కె.సి. కెనాలుకు వొక వారెంబడి కొట్టాలు, మట్టిమిద్దెలు ఉండాయి. వాటిల్లో ఉండే ఆడోల్లు, మొగోల్లు తాగినకాడికి తాగినారు.
అరిసినకాడికి అరుసుకుండారు.
గేరి మొగదాల రోడ్డువారగ, రెండు మూడు సాట్ల కొంతమంది ఆడోల్లు సారాయి అమ్ముకుంటా ఉండారు. సన్న సన్న క్యాన్లల్లో, సీసాల్లో సారాయి పోసుకుని కాలువ మీదేసిన రాళ్ల కింద సందుల్లో దాపెట్టినారు. అయిదు రూపాయలకు చిన్న లోటా, పది రూపాయలకు పెద్ద లోటా లెక్కన పోసిస్తుంటారు. దావన బోయేటోలను కూడా తాగేకి రామ్మని పిలుస్తా ఉండారు.
తాగనీక వచ్చినోల్లు అరుసుకుంటా, గప్పాలు కొడతా ఉండారు.
కెనాలు గట్టు మీద నుండి బంగారుపేట మెయిను రోడ్డు దాక సారాయి వాసన గాల్లో తేల్తా ఉంది. అది మామూలు సారాయి వాసన గాదు. ఏదేదో కలిసి కుళ్లి మురిగిపోయిన వాసన. ఆడంతా సుళ్లు తిరుగుతుండాది.
అంతలో ముందు నానా కూతురు ‘గుడ్ల’ బొంగురు గొంతు పెట్టుకోని శికారి గేరంతా ఏకం జేసింది. ‘డొక్కోని’ మీదికిపోయి బండబూతులు తిట్టింది. కీకరక అరిసి మీదబడి కొట్టింది.
ఆ టయాన ఆమె తాగిందో లేదో గాని, అప్పటికే తాగినోల్లు రయ్యరయ్య సుంకులమ్మ కట్ట మీదికి వచ్చినారు.
డొక్కో సంగతి మ చెప్పనీక లేదు.
వాడు కుండ ఉన్నది ఎవరైనా యా పొద్దయినా చూసి ఉంటే గదా.
పెళ్లాం మీదికి బాణం పోయినట్లే పోయినాడు. జుట్టుపట్టుకోని కిందపడనూకి కొట్టినాడు. గుమి ఎట్ల లేచెనో గాని లేచె. ఒక్క దొబ్బు దొబ్బితే డొక్కోడు యిరుసుకోని ఆంత దూరాన పోయి పడ్నాడు……….
-
Hamsa Vimshati Vignana Sarvasvamu By Dr Gunji Venkataratnam
₹500.00హంసవింశతి: కావ్యము- కవి
కథా కావ్యము
సంస్కృత, ప్రాకృత వాఙ్మయ చరిత్రను పరిశీలిస్తే దాదాపు రెండు వేల సంవత్సరాలకు పూర్వమే కథా కావ్యాలు వెలిసియున్నట్లు తెలుస్తున్నది. గుణాఢ్యుడు పైశాచీ ప్రాకృతంలో రచించిన బృహత్కథ రెండు వేల సంవత్సరాల నాటిదని పండితుల అభిప్రాయం. బృహత్కథ ఆధారంగా సోమదేవుడు కథా సరిత్సాగరాన్ని, క్షేమేంద్రుడు బృహత్కథా మంజరిని రచించి యున్నారు. ఇవి గాక పంచతంత్ర హితోపదేశాలు, బుద్ధుని జాతక కథలు, కాదంబరి, దశకుమార చరిత్ర మొదలైన కథా కావ్యాలెన్నో, ఏనాడో సంస్కృత ప్రాకృతాలందు వెలసి యున్నవి. ‘కొన్ని పద్యకథా కావ్యాలు కాగా, మరికొన్ని వచన రచనలు.
కానీ ప్రాచీన కాలమున తెలుగులో వచన కథా కావ్యాలు కనిపించుట లేదు. దండి దశకుమార చరిత్రను సంస్కృత వచనంలో వ్రాసి యుండగ, దానినాంధ్రీకరించిన కేతన తెలుగులో పద్య కథా కావ్యంగా తీర్చి దిద్దారు. తిక్కన ఉత్తర రామాయణాన్ని నిర్వచనంగా వ్రాశాడు. కథాకావ్యాలే గాక వ్యాకరణాలు, నిఘంటువులు, శాస్త్ర గ్రంథాలు మొదలైనవన్నీ ఆ కాలంలో పద్య రూపంలోనే రచించుట గమనించ దగ్గ విషయం. ఇది కారణంగా మన ప్రాచీన కథాకావ్యాలన్ని పద్య రూపంలోనే వెలువడి ఉన్నాయి.
తెలుగు సాహిత్యం దాదాపు వెయ్యేండ్లుగా సాగుతూ వస్తున్నది. ఇందులో ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు, ప్రబంధాలు, నాటకాలు మొదలైన సాహిత్య ప్రక్రియలెన్నో వెలసి ఉన్నాయి. వాటిలో కథా కావ్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ కథా కావ్యాల్లో కొన్ని అనువాదాలు, అనుకరణలు కాగా మరికొన్ని స్వతంత్ర రచనలై ఉన్నాయి.
కేతన కృతమగు దశకుమార చరిత్ర, వేంకటనాథుడు రచించిన పంచతంత్రం (దీనినే నారాయణకవి, భావయ కవి వేర్వేరుగా రచించి యున్నారు). కొఱవి గోపరాజు నిర్మించిన సింహాసన ద్వాత్రింశిక, మంచన వ్రాసిన కేయూర బాహు చరిత్ర, వెన్నెలకంటి అన్నయామాత్యుని షోడశకుమార చరిత్ర, జక్కన కృతమగు విక్రమార్కు చరిత్ర, అనంతామాత్యుని భోజరాజీయము, కూచిరాజు ఎఱ్ఱన విరచించిన సకల కథా నిధానము, పుత్తేటి రామభద్రుని కథాసార సంగ్రహము, చింతలపూడి ఎల్లనార్యుని (రాధా మాధవకవి) విష్ణుమాయా నాటకము, పాలవేకరి కదిరీపతి రచించిన శుకసప్తతి, అయ్యలరాజు నారాయణా మాత్యుని హంస వింశతి మొదలైనవి తెలుగు పద్య కథా కావ్యాల్లో పేర్కొనదగినవి. అందులోను శుకసప్తతి, హంస వింశతి జారశృంగార కథలు వస్తువుగా ఒకే కోవకు చెందిన శృంగార ప్రబంధాలుగా వన్నెకెక్కినవి. శుక సప్తతి, నాటి సమాజానికి నిలువుటద్దము నెత్తగా, హంసవింశతి. నాటి సమాజంలోని శాస్త్రాద్యనేక విషయాలు ప్రస్తావించి విజ్ఞాన సర్వస్వ లక్షణాలు గల కథా ప్రబంధంగా పరిగణింపబడుచున్నది………………
-
-
Aharam Manchi- Chedu
₹100.00నిత్య జీవితావసరాల కోసం రోజూ ఎంతో శ్రమిస్తూ మనం సంపాదించుకున్న విలువైన డబ్బును వెచ్చించి పౌష్టికాహారం పేరుతో విషాన్ని తినాల్సి/ తాగాల్సి రావడం ఈ శతాబ్దపు గొప్ప విషాదం. ఏ ఆహారం తింటే ఆరోగ్యం చేకూరుతుందో మనకు చెప్పాల్సిన బాధ్యతలున్న ప్రభుత్వ, ప్రజారోగ్య, వైద్య పత్రికా వ్యవస్థలన్నీ కేవలం తమ స్వార్ధం కోసం ఆహార రంగంలోని బహుళ జాతి కంపెనీల ప్రలోభాలకు లొంగి తినకూడనిది తినమని ప్రచారం చేస్తూ ప్రజల ఆరోగ్యానికి కీడు చేస్తున్నాయి. వీరందరూ కలిసి శాస్త్రీయత మాటున అశాస్త్రీయతను ప్రచారం చేస్తున్న ఫలితంగా సామాన్యులు రోగగ్రస్తం అవుతున్నారు. లాభార్జనే ధ్యేయంగా నడుస్తున్న వైద్య , ఆరోగ్య శాఖలూ/వ్యక్తులూ/ప్రజల రోగాలను, మరణాలను కూడా సొమ్ము చేసుకునే ఒక క్రూరమైన వ్వవస్థను ఆవిష్కరించారు.
-
Yedu Tharalu
₹250.00“పరిశుభ్రమైన గాలి క్షణమాత్రం సోకితేనే గజగజలాడిపోయే ఊపిరితిత్తులు;;; వొంటి నిండా బట్టలుండవు – మలవిసర్జన జరిగిపోతుంటే శుభ్రం(గా)చేసుకోవటానికి కూడా వీలు లేకుండా కాళ్ళూ, చేతులకు సంకెళ్ళు – పండ్లతో, గాయాలతో, చీము నెత్తురులోడే భుజాలు, మోచేతులు, పిర్రలు;;; పిచ్చలు కోసేయ్యటం – మర్మాంగాలు నరికెయ్యటం – ఎముకలను కరుచుకున్న మాంసం వూడొచ్చేదాకా కొట్టటం, నిండు గర్భిణులను పొట్ట కింద గుంత తవ్వి, బోర్ల పడుకోబెట్టి, కొరడాలతో కొట్టటం, జంతువులను వేటాడాల్సిన వేట కుక్కల చేత మనుషులను వేటాడించటం;;; చర్మాన్నీ, నరాల్ని, కండల్నీ, ఎముకనూ, ఒక్క వేటుతో ఛేధిస్తూ, ఓ గొడ్డలి మొన మన కుడి కాలును మన శరీరం నుండీ వేరు చేస్తుంటే…;;; అవయవాలుండవు; ఉన్నా అవి దొరల కోసం! తోడు లేదు – బిడ్డలు లేరు – సంసారం లేదు – స్వజనం లేరు – స్వగ్రామం లేదు – స్వదేశం లేదు – గతం లేదు – భవిష్యత్తు లేదు;;;” నాగరికత, హక్కుల ముసుగు లో ఓ జాతి మరో జాతి మీద సాగించిన దాష్టీకాలను, ఆకృత్యాలను, అర్ధం చేసుకోవటానికి “ROOTS / ఏడు తరాలు” – (By Alex Haley) ని చదవండి. INDEPENDENCE DAY అంటే హాలిడే కదా ఆడుకోవచ్చు అని ఎదురు చూసే పిల్లల చేతా, లాంగ్ వీకెండ్ ఏమో అని క్యాలెండర్లు వెతికే పెద్ద వాళ్ళ చేతా, ఈ పుస్తకం చదివించండి! స్వాతంత్ర్యం, స్వేచ్ఛ ల విలువేంటో, దాని కోసం మన ముందు తరాల వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించారో, త్యాగాలు చేసుంటారో, ఎం కోల్పోయారో, కనీసం ఊహించనైనాగలరు !!
Reviewed By Seshumadhav Chaturvedula
విజేతలే చరిత్రను రాస్తారన్న నిష్ఠుర సత్యాన్ని బద్దలుకొట్టి, చరిత్ర పట్ల మన దృక్పథాన్ని సమూలంగా మార్చివేసిన అద్భుత రచన. ఆరు తరాల వెనక అట్లాంటిక్ మహా సముద్రానికి ఆవల ఆఫ్రికా చీకటి ఖండంలో ఉన్న తన వంశం మూలాలు, దాని పుట్టుపూర్వోత్తరాలను వెతికి పట్టుకునేందుకు నల్లజాతి అమెరికన్ రచయిత ఎలెక్స్ హేలీ చేసిన అసాధారణ అన్వేషణ ఫలితమే ఈ పుస్తకం.
‘రూట్స్’ పేరుతో 1976 లో ప్రచురితమైన ఈ రచన అమెరికానూ, యావత్ ప్రపంచాన్నీ పట్టి కుదిపేసింది. నల్లజాతి అస్తిత్వాన్ని ఎలుగత్తి చాటడంలో, జాతి వివక్షపై తిరుగుబాటు జెండా ఎగరెయ్యటంలో కీలకపాత్ర పోషించింది. ప్రపంచ వ్యాప్తంగా 60 లక్షలకు పైగా కాపీలు అమ్ముడుపోయింది. 37 భాషల్లోకి అనువాదమైంది. స్వేచ్చ నుంచి సంకెళ్ళకు, సంకెళ్ళ నుంచి విముక్తికి సాగిన ఈ ప్రస్థానం సినిమాగా, టీవీ సీరియల్ గా కూడా గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది.
-
Enugula Veeraswami Kasi Yatra
₹250.00ఏనుగుల వీరాస్వామి అనే ఒక తెలుగు మహానుభావుడు 19వ శతాబ్దంలో, 100 మంది తీర్థయాత్రికులను చెన్నపట్నం నుండి కాశీ పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్ళి, వారిని క్షేమంగా చెన్నపట్నానికి తీసుకొని రాగలిగాడు. 4 వేల కిలోమీటర్ల పాటు జరిగిన ఈ ప్రయాణంలో గంగానది మీద 1000 కిలో మీటర్ల పాటు పడవ ప్రయాణం కూడా చోటు చేసుకొంది. 15 నెలల, 10 నిమిషాలపాటు కొనసాగిన ఈ ప్రయాణం(1830 – 1831) ప్రపంచ తీర్థయాత్ర చరిత్రలో ఒక అరుదైన సంఘటన.
– డా. మచ్చ హరిదాసు
ఒకడు ధనము ఆర్జించి దాన్ని మంచి పనుల కోసం ఖర్చు పెట్టకుండా చనిపోవుట నిష్ఫలం.
– ఏనుగుల వీరాస్వామి
వీరాస్వామి యాత్రకి వెళ్ళేటప్పుడు నేను అక్కడి వినోదములను రాయించి పంపించాలని అడిగినందుకు ఆయన రాసి పంపుతూ వచ్చారు.
– కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళ
మా తాతగారి పేరు కిత్తయ్య పంతులు. వారికి తాతగారైన కిత్తయ్య గారు వీరాస్వామికి దివ్వెల గ్రామంలో ఆతిథ్యం ఇచ్చారు.
– ఆరుద్ర (సమగ్ర ఆంధ్ర సాహిత్యం)
-
Gaddi Parakatho Viplavam
₹200.00దక్షిణ జపానులోని షికోకు దీవిలోని ఓ చిన్న గ్రామంలో ఫుకుఓకా పుట్టాడు. మైక్రోబయాలజీలో శిక్షణ పొంది పంటల తెగుళ్ళ నిపుణుడయ్యాడు. యోకోహామా లో కస్టమ్స్ ఇన్ స్పెక్టర్ గా ఉద్యోగంలో చేరాడు. జీవితం సాఫీగా, ఖుషీగా గడిచిపోతుందను కొంటున్న సమయం లో ఎన్నో ప్రశ్నలు అతన్ని పీడిం చాయి. 25 ఏళ్ళ ప్రాయంలో పొందిన అనుభవం అతని జీవితాన్ని మార్చివేసింది. మానవ ప్రయత్నమంతా వృథా అని అతనికి బోధపడింది. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి పల్లెకు చేరాడు. ఆధునిక వ్యవసాయాన్ని సవాలు చేస్తూ పొలాన్ని దున్నకుండా, ఎరువులు, పురుగుల మందులూ, కలుపునాశిని మందులూ, యంత్రాలూ లేకుండా వ్యవసాయం చేయసాగాడు. ప్రకృతిని సాధ్యమయి నంతగా అనుసరిస్తూ ‘ఏమీ చెయ్యనవసరం లేని’ వ్యవసాయ విధానాన్ని రూపొందించాడు. అతను అవలంబించిన పద్దతుల పల్ల నేల ఏ ఏటికాపడు సారవంతం అవుతూ వచ్చింది. జపానులో మరే ప్రాంతానికీ తీసిపోని దిగుబడులు పొందుతున్నాడు. తన అనుభవసారాన్నంతా ఈ పుస్తకంలో నింపాడు.
ఆహార సంస్కృతి గురించి, ప్రకృతి జీవనం గురించి ఇందులో వివరించాడు. ఇది జపనీస్ భాషలో 1975లో ప్రచురితమయ్యింది. 1976లో ఇంగ్లీషులోకి అనువాదమయ్యింది. ఆ తరువాత దేశ విదేశాల్లో ఎన్నో భాషల్లోకి అనువాదం అయ్యి, ఎన్నో ముద్రణలను పొందింది. వ్యవసాయానికీ, జీవితానికీ, సంస్కృతికీ, మధ్య విడదీయరాని సంబంధం ఉందని ఫుకుఓకా విశ్వాసం ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకోవాలని ఉన్న ప్రతి ఒక్కరూ చదవదగిన పుస్తకమిది.
రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయం మసనోబు ఫుకుఓకాకు 1988లో ‘దేశికోత్తమ’ బిరుదునిచ్చి గౌరవించింది. ఆ సందర్భంలో ఆయన హైదరాబాదు కూడా సందర్శించారు. వ్యవసాయం వ్యాపారం కాదు జీవిత విధానమన్న భారతీయ సంప్రదాయానికి జీవం పోసే పుస్తకమిది.
-
Gulamgiri
₹100.00భారతదేశంలో కులం గురించిన సిద్దాంతాన్ని శాస్త్రీయంగా రూపొందించిన తోలి దార్శనికుడు జ్యోతిరావు ఫులే. (1827-1890). దుర్మార్గమైన కులవ్యవస్థ సమూలంగా నిర్మూలించబడాలని అయన కోరుకున్నారు. ఫులే ఆలోచనలకీ, విశ్లేషణకీ ‘గులాంగిరీ’ అడ్డం పడుతుంది.1873 లో మొదటి సరిగా ప్రచురించబడిన ఈ పుస్తకం ఇప్పటికి ఆదరణ పొందుతూనే ఉంది.
ఈ పుస్తకం అంతా జ్యోతిరావు ఫులే, దోండిబా( వాసుదేవ్ ఖుంబార్) మధ్య సంవాదం లా సాగుతుంది.
ఏ రోజునైతే మనిషి బానిసగా మారిపోతాడో, ఆ రోజునే అతడి సద్గుణాల్లో సగభాగం నశిస్తుంది.
– హొమర్
-
Mahatma Jyothirao Pule
₹150.00శ్రీ ధనంజయకీర్ గారు ఇంగ్లిష్ లో రాసిన Mahatma Joti Rao Phooley; Father of The Indian Social Revolution అనే గ్రంధానికి ఇది స్వేచ్చానువాదం.
నిమ్న కులాలవారి కోసం, స్త్రీల కోసం దేశంలోనే ప్రప్రథమంగా పాఠశాలలు స్థాపించి, విద్యావ్యాప్తి ద్వారా వారిని దాస్య విముక్తుల్ని చేసేందుకు; కులవివక్షనూ, సాంఘిక దోపిడీనీ, మూఢనమ్మకాలనూ … వాటికి కేంద్ర బిందువైన బ్రాహ్మణాధిపత్యాన్ని బద్దలు కొట్టేందుకు తిరుగుబాటు బావుటాను ఎగురవేసిన తొలితరం సామాజిక విప్లవకారుడు జోతిరావు ఫూలే (1827-1890). ఆయన సమగ్ర జీవిత సంగ్రామ చరిత్రే ఈ పుస్తకం.
నిన్న మొన్నటి వరకూ మన దేశంలో విద్య అగ్రవర్ణాల గుత్తసొత్తుగా వుండేది.
స్త్రీలైతే ఏ కులానికి చెందినవారైనా నాలుగు గోడల మధ్య బందీలుగా పడివుండాల్సిందే.
విద్య మీదా, రాజ్యం మీదా, మతం మీదా బ్రాహ్మణులదే తిరుగులేని పెత్తనం.
ఆచారాలు, సంప్రదాయాలు, ధర్మం న్యాయం అంటూ వారు బోధించే నీతులన్నీ వారి ఆధిపత్యం కొరకే అన్నట్టు నడిచిన కష్టమైన ఆనాటి కాలంలోనే సమానమైన మరో సమాజం కోసం నడుంబిగించాడు ఫూలే.ఎంతో సాహసోపేతంగా నిమ్న కులాల కోసం, స్త్రీల కోసం పాఠశాలల్ని నెలకొల్పి, వారి కొరకు తన భార్య సావిత్రీబాయికి చదువు చెప్పి ఆమెను టీచర్గా తీర్చిదిద్దాడు.
అంతేకాక సతీ సహగమనాన్ని, అంటరానితనాన్ని, పురోహిత వ్యవస్థను నిర్మూలించేందుకు ఉద్యమించాడు.
వితంతు వివాహాలను ప్రోత్సహించాడు.
కార్మిక కర్షకుల హక్కులకోసం, సంఘ సంస్కరణ కోసం దళితులపై తరతరాలుగా సాగుతున్న బ్రాహ్మణీయ దోపిడీని ఎదిరిస్తూ తుదివరకు నిలబడ్డ ఫూలే జీవితం, పోరాటం తదనంతర కాలంలో డాక్టర్ అంబేడ్కర్ వంటి ఎందరో మహనీయులకు స్ఫూర్తినిచ్చింది.
హిందూమతోన్మాదం ఇవాళ …మతభక్తే … దేశభక్తి … అనే కొత్త వాదనతో తిరిగి పడగ విప్పేందుకు ప్రయత్నిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇ లాంటి పుస్తకాల ఆవశ్యకత ఎంతో వుంది.
రచయిత ధనంజయ్ కీర్ మహారాష్ట్రకు చెందిన వారు. డాక్టర్ అంబేడ్కర్ మిత్రుడు. 1969లో వెలువడిన మహాత్మా ఫూలే సమగ్ర వాజ్మయ్ పుస్తకానికి సంపాదకులు. ఆయన మహాత్మా జోతిరావ్ ఫూలే జీవితం గురించి చాలాకాలం పరిశోధించి ఈ పుస్తకాన్ని రాశారు.
ఈ పుస్తక స్వేచ్ఛానువాదకురాలైన డా. విజయ భారతి తెలుగు అకాడమీ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు. వారు అనేక పుస్తకాలు రాశారు. వాటిలో అంబేడ్కర్, పురాణాలు-కులవ్యవస్థ పేరుతో రాసిన సత్యహరిశ్చంద్రుడు, దశావతారాలు, షట్చక్రవర్తులు ముఖ్యమైనవి.
-
Neeli Meghalu
₹250.00నీలిమేఘాలు – ఈ శతాబ్దపు రెండో గొప్ప కవితా సంకలనం
– చేకూరి రామారావు
పందొమ్మిది వందల తొంభై మూడు అక్టోబరు మూడు తెలుగు సాహిత్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన సుదినం. తెలుగు సాహిత్య చరిత్రలో ఒక నూతనాధ్యాయానికి అంకురార్పణ జరిగింది. స్త్రీ వాద కవిత్వం విజయదుందుభి మోగించిన దినం. ‘నీలిమేఘాలు’ అనే స్త్రీవాద కవితా సంపుటి హైదరాబాదు నగరంలో ఆవిష్కృతమైంది. ఇటువంటి సంపుటం తీసుకురావాలన్న సంకల్పం అంతకు ముందు సరిగ్గా ఏడాది కిందట ఏర్పడి, అనుకున్నట్టుగా సంవత్సరం తిరిగేటప్పటికి సంపుటం తయారయింది.
నవ్య కవిత్వాన్ని ‘వైతాళికులు’గా సంకలనం చెయ్యటానికి ముద్దుకృష్ణకు ఎన్నాళ్లు పట్టిందో తెలీదు. ఇవాళ ఈ శతాబ్దపు పూర్వార్ధ భాగంలో తెలుగు కవిత్వంలో జరిగిన మార్పుల్ని గ్రహించటానికీ, అనుభవించటానికి ఆధారభూతమైన ఏకైక కవితా సంపుటి “వైతాళికులు”, అనాటి అనేక కవుల కవితా సంపుటులు ఈనాడు దొరకటం లేదు. చాలామంది కవితా ఖండికలు సంపుటాలుగా సంకలితం కానేలేదు. అయినా ‘వైతాళికులు తిరగేస్తుంటే ఆనాటి కవితా ధోరణులు మన అంతరంగాల్లో ఆహ్లాద తరంగాలను కదిలిస్తాయి.
ఆ రోజుల్లో కూడా ఇప్పటిలాగే నవ్య కవిత్వాన్ని మనసారా ఆహ్వానించిన వాళ్ళతోపాటు వ్యతిరేకించినవాళ్లు కూడా గణనీయమైన సంఖ్యలో వుంటారు. ఒక తేడా వుంది. అప్పుడు వ్యతిరేకించినవారు దిగ్ధంతులైన పండితులు, అక్కిరాజు ఉమా కాంతంగారు, జయంతి రామయ్యగారు, అనంత పంతుల రామలింగస్వామి గారు ఇట్లాంటి గొప్ప గొప్ప పండితులు నవ్య కవిత్వ ధోరణులను నిరసించారు. తమ తర్క శక్తితో ఎదుర్కొన్నారు. అధిక్షేప కావ్యాలు రచించి హేళన చేశారు. ఎన్ని చేసినా కాలప్రవాహంలో అవి మరుగున పడిపోయాయి. దొరుకుతున్న కావ్య సంపుటాల ద్వారా దొరకని వారిని ‘వైతాళికులు’ సంకలనం ద్వారా ఈనాటికీ మనకు ఆనాటి
-
Oka Hijra Atma Katha
₹130.00ఈ పుస్తకాన్ని పాఠకులను పట్టి చదివించే శక్తి, వాళ్ళ ఆలోచనను ప్రేరేపించే శక్తి వున్నది. అట్లాగే విస్మయ భీతిని కూడా కలిగిస్తుంది. పుస్తకం అంతటా రేవతి తను ఎదుర్కొన్న భయానక సంఘటనల గురించి చెబుతుంది కానీ ఎవరి సానుభూతిని కోరదు. ఆమె అడిగేదోక్కటే. హిజ్రాలను అందరి మానవుల వలె కోరికలూ ఆశలూ వున్న తోటి మనుషులుగా చూడమని. ఒక హిజ్రాగా తన వ్యక్తిగత విషయాలను నిర్భయంగా నిస్సంకోచంగా చెప్పిన తీరు అభినందనీయమేకాక హృదయానికి హత్తుకునే విధంగా కూడా వుంది.
తన లింగ మార్పిడి శస్త్రచికిత్స గురించైనా, పోలీసులు పెట్టిన హింస గురించైనా, తన క్లయింట్స్ గురించైనా! జెందర్ గురించీ, పురుషాధిక్యత గురించి ఆమె చేసిన విమర్శలు, వ్యాఖ్యలు చాలా స్పష్టంగా శక్తివంతంగా వుండి స్త్రీ పురుషులతో పాటు మూడవ లింగాన్ని కూడా మనం మానవీయంగా అర్థం చేసుకునే విధంగా కృషి చెయ్యాలనే అవగాహనను కలిగిస్తుంది.
-యోగిందర్ సికండ్,కౌంటర్ కరెంట్స్
-
Panchadara Jivana Saili Vyadhulannitiki Mulam
₹400.0018 , 19 శతాబ్దాల్లో పలువురు వైద్యులు పంచదార వల్ల బరువు పెరుగుతున్నట్లు స్పష్టంగా గుర్తించారు. ఒక దశలో మహిళలు లావు అవుతామన్న భయంతో పంచదారను పక్కన పెట్టారు. 1825 “ఫిజియాలజి అఫ్ టెస్ట్” పుస్తకం రాసిన సావరిన్ పిండితో చేసిన పదార్ధాలు, బ్రేడ్ ల వల్లనే ఊబకాయం వస్తున్నట్లు రాశాడు.
ఒక తరం నుండి మరో తరానికి పంచదార లేదా తీపి పదార్ధాలు తినడం పెరిగే కొద్దీ తర్వాత తరాల వాళ్ళలో ఊబకాయం, మధుమేహ సమస్యలు వచ్చి ఆయుర్ధాయం తగ్గి, అర్ధాంతరంగా చనిపోతున్నట్లు అర్ధమైంది.
సిగరెట్లు, తాగుతూ “మానివేసి మనం జీవించగలుగుతామా” అని భయపడతారు. ఒకసారి మానేశాక “ఇంతకాలం ఎందుకు తాగామా” అని బాధపడడం మనకు తెలుసు. పంచదార విషయం కూడా ఇంతేనంటాడు గ్యారీటాబ్స్. ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటే ఈ పంచదార వ్యసనం నుండి బయటపడడం కష్టం కాదు.
-
Prachina Ayurveda Arogya Rahasyalu
₹400.00మన భారతదేశంలో అత్యంత పవిత్రమైనవి వేదాలు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అని ఇవి నాలుగు. వీటిలో చివరిదైన అధర్వణ వేదం మిగిలిన మూడు వేదాలకన్నా ఒక ప్రత్యేకతను విశిష్టతను సంతరించుకుంది. ఈ అధర్వణవేదంలో ఎన్నో రకాల ఔషధులు వాటి ఉపయోగాలు, వివిధ రకాల రోగాలను నివారించే మంత్ర, తంత్ర, మూలికల విజ్ఞానం పొందుపరచబడింది. ఆయుర్వేదం అనేది ఈ అధర్వణ వేదంలో అంతర్గతంగా చెప్పబడిందే. షడ్డర్శనాలైన సాఖ్యం, యోగం, న్యాయం, వైశేషికం, పుర్వమీమాంస, ఉత్తరమీమాంస మరియు జ్యోతిషం, వంటి శాస్త్ర గ్రంథాల మీద ఆయుర్వేదం ఆధారపడి వుందని పండితులు చెప్తారు. దేవవైద్యుడైన ధన్వంతరి ఆయుర్వేద విజ్ఞానానికి మూలపురుషుడుగా పూజించబడుతున్నాడు.
శరీరం, ఇంద్రియాలు, ఆత్మ కలసి ఉండటమే ఆయువు. ఈ ఆయువును పొందటం దీని గురించి తెలుసుకోవటం అనే దాన్నే ఆయుర్వేదం అంటారు. ఈ ఆయుర్వేదంలో శరీరతత్త్వాలు, ఋతుచర్యలు, రోగ నిర్ధారణా పద్ధతులు, రోగాలను నివారించే వివిధ రకాల మూలికా చికిత్సలు, శాస్త్ర చికిత్సలు వంటి ఎన్నో విశేషాలు పొందుపరచబడ్డాయి ఇంత గొప్పదైన ఆయుర్వేదాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకువచ్చిన మహా వైద్యులు ఎందరో వున్నారు.
– డా. జయంతి చక్రవర్తి
-
-
Russian Classics
₹225.00రష్యన్ విప్లవం జరిగిన వంద సంవత్సరాలు గడిపోయాయి. ఈ విప్లవానికి ముందే “జార్” రాజు పరిపాలించే రష్యాలో నూతన ఆలోచనా ధోరణుల పెల్లుబికాయి. పట్టణాలలో డిసెంబరీష్ట్ తిరుగుబాటు, గ్రామాలలో రాచరిక భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, బానిసల, అర్ధబానిస రైతులలో అసంతృప్తి జ్వాలలు పెల్లుబికాయి. వాటి ప్రభావం వల్ల మేధో, మధ్యతరగతి వర్గాలలో ఓ చైతన్యపూరితమైన కదలిక ప్రాభవం అయ్యింది. దీని ప్రబింబమే రష్యన్ మహారచయితల ఆవిర్భావం.
రష్యన్ ఆకాశం పై వెలిసిన వేగుచుక్కలు, పుష్కిన్ , గోగోల్, తుర్గెనోవ్,, కుప్రిస్, చేవోహ్, గోర్కీలు . వీరి రచనలు అనువాదాలు కొన్ని తెలుగులో వచ్చినప్పటికీ, రెండో ప్రపంచ యుద్ధం తరువాత అప్పటి సోవియట్ ప్రభుత్వం సాహిత్యాన్ని చాలా ప్రపంచ బాషలలో అనువదించి ప్రపంచమంతా పంచింది. 1945 నుంచి 1985 వరకు అనేక తెలుగు ప్రజలకు పరిచయం అయ్యాయి. సోవియట్ పతనం అనంతరం ఈ సాహితిధార ఆగిపోయింది.
-
Upavasam By Dr Jason Fung
₹100.00చాలామంది దృష్టిలో “ఉపవాసం” అనే మాట ఎదో మత ఆచారానికి సంబంధించిన వ్యవహారాం. అత్యధిక ప్రధాన మతాలు ఉపవాసాన్ని ఎదో ఒక సందర్భంలో ఆచారంగా ప్రబోధిస్తాయి. హిందువులు శివరాత్రి నాడు, క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ముందు రోజుల్లోనూ, మహ్మదీయులు రంజాన్ మాసంలోను ఉపవాసం ఉంటారు. బౌద్దులు, జైనులు, యాదులు కూడా ఉపవాసాన్ని ఆచరిస్తారు. ఉపవాసం కేవలం శరీరాన్నే కాకుండా మనసును కూడా శుద్ధి చేస్తుందని నమ్ముతారు.
ఉపవాసం ఆరోగ్యాన్ని మురుగుపరుస్తుందని, జీవన కాలాన్ని పెంచుతుందనే విషయం గత కొద్దీ కాలంగా వైద్య వర్గాల చర్చలకు కేంద్ర భిందువైంది. ఉపవాసం వలన రక్తపోటు, రక్తంలో చెక్కర స్థాయిలతో పాటు ఇతర జీవక్రియల ప్రమాణాలన్నీ మెరుగవుతాయని రుజువయింది. ఉపవాసానికి తక్కువ పిండి పదార్ధాలు, ఎక్కువ కొవ్వు పదార్ధాలు ఉండే ఆహారం తోడైతే అద్భుతమైన ఫలితాలనిస్తాయని కూడా నిర్ధారణ అయింది.
-
Geetha Saram Navajevana Vedam
₹260.00ఎక్కడ కృష్ణుడు (డాక్టరు), అర్జునుడు (పేషెంటు) ఉంటారో అక్కడ ఆరోగ్య భాగ్యమస్తు!
సంఘంలో ఒక్క డాక్టరుకు మాత్రమే ప్రతి వ్యక్తినీ కలిసే అవకాశం ఉంది. రోగం లేని జీవుడు లేడు. డాక్టర్ అవసరంలేని రోగి లేదు. రోజు గడచినకొద్దీ రోగం ముదురుతుంది. ఖర్చు పెరుగుతుంది. డాక్టరు, పేషెంటు ఇరువురు మధ్య కావలసిన పరస్పర అవగాహనను, నమ్మకాన్ని, విశ్వాసాన్ని డాక్టరు (కృష్ణుడు) హాస్పిటల్ (యుద్ధ రంగం) లో పేషెంట్ (అర్జునుడు) అడుగు పెట్టగానే “గీతా సారం, నవజీవనవేదం” తో ఆహ్వానిస్తాడు. పేషెంట్ (అర్జునుడు) డాక్టరుకు (కృష్ణుడికి) సర్వస్య శరణాగతుడై రోగ లక్షణాలను (శత్రువు) పూర్తిగా వివరిస్తాడు. కృష్ణుడు తొట్రుపాటు లేకుండా అనర్థకంగా అర్జునుడికి గీతాబోధచేస్తాడు (అంటే చేయవలసిన విధులు, విధానాలు, టైము, ఖర్చు, హాస్పిటల్లో చికిత్స పూర్తి అయిన తర్వాత మనసుకు ప్రశాంతత కూర్చేది భగవద్గీత an old-fashioned way. మానవ ప్రయత్నానికి పరమాత్మ సహాయం తప్పక ఉంటుంది. వైద్య వృత్తికి కొద్దిపాటి పెట్టుబడి. వైద్య సిబ్బంది కర్తవ్య పాలనమీద మనసు కేంద్రీకరిస్తారు. వైద్య వృత్తి సేవావృత్తి. సమాజాభివృద్ధిలో డాక్టర్ భాగస్వామ్యానికి విలువ ఎక్కువ. ఈ చిరుకానుక ద్వారా వైద్య సేవాశక్తికి రెక్కలొచ్చి ఒక్కొక్క కుటుంబాన్ని కొంతలో కొంత మారుస్తూ మొత్తం సమాజాన్నే మార్చే అవకాశం ఉంది ఒకనాటికి. కాబట్టి వారే సమాజాన్ని మార్చగలరు.
ధ్యానము, ప్రాణాయామం, యోగా, అభ్యాసము వలన ఉపయోగాలను చక్కగా చెప్పింది “గీతాసారం”. ధృఢ సంకల్పం, కర్తృత్వ భావనలేని కర్తవ్య నిర్వహణ, స్వార్థంలోనే పరమార్ధంగా నేటి దైనందిన జీవితంలో కొందరు ఎలా చేస్తున్నారో ఉదాహరణలున్నాయ్ “గీతాసారం”లో. ఏకాగ్రత, బుద్ధి కుశలత, పట్టుదల, సహనం, సంయమనం, అలవరచుకొని కొంతమంది కోపాన్ని ఎలానియంత్రించుకుంటున్నారో “గీతాసారం”లో ప్రస్తావించడం అయినది. అధ్యాయాలుగా ఉన్న భగవద్గీత జ్ఞానభాండాగారం, మనకు కావలసినది ఎక్కడ ఉందో వెదికి దానిని అర్థం చేసుకొని మనకు అన్వయించుకొని ఆచరించడం సామాన్యులకు అయ్యే పనికాదు. అందువల్లనే “గీతాసారం” వివిధ విషయాలుగా వర్ణించడము అయింది. ఏ విషయం కావాలన్నా ఎవరైనా ఎప్పుడైనా చదువుకొని ఆచరణలో పెట్టడానికి రోజువారీ భాషలో “గీతాసారం” అందిస్తోంది………….
-
Madi Vippina Charitra
₹250.00గురువుగా ద్రోణాచార్యుని ప్రతిభా కౌశలం గురించి, మంత్రిగా కౌటిల్యుని సామర్థ్యం గురించి
చరిత్ర పుస్తకాలలో చదివే పిల్లలకు, ఆ ఇద్దరూ వాస్తవానికి ఏ నిర్వచనం ప్రకారం చూసినా మహా కపటులన్న విషయం తెలియజెప్పాలి.సత్యవర్తన, న్యాయం, సర్వజనుల సమానత్వ భావనలకు ప్రాతినిధ్యం వహించే హిందూమతం ఈ దేశపు ప్రత్యేకత అని చెప్పే సమయంలో అది కులం, పితృస్వామ్య వ్యవస్థలతో దళిత బహుజనులను, స్త్రీలను ఏవిధంగా అణచివేసిందో కూడా వివరించాలి.గాంధీ జీవిత చరిత్రను శ్లాఘించే రచనలు చేసినప్పుడు ఆయన కులవ్యవస్థను, బ్రాహ్మణతత్వాన్ని బలపరిచాడన్న వాస్తవాలను విస్మరించకూడదు. -
Maranam By Sadhguru
₹300.00మరీ అంత గంభీరంగా ఉండకండి! జీవస్థితి అంటే
కొద్ది కాలం మెరిసే మెరుపు, కానీ మరణ సితి
మాతం చాలా కాలం కొనసాగే వ్యవహారం.చాలా సమాజాలలో మరణం అనేది (చర్చలకు) నిషిద్ధ విషయం .
మరణం గురించి మన అవగాహన అంతా తప్పుడు అవగాహనే
అనుకోండి, అప్పుడేమవుతుంది? మరణమనేది మనమనుకొన్నట్లు
ఘోరవిప్పత్తేమీ కాదనుకోండి. అది కూడా జీవితంలో ముఖ్యభాగమే
అనుకోండి… అంతేకాదు, మరణమనే ప్రక్రియలో మనం ఈ
ప్రాపంచిక చక్రభ్రమణానికి అతీతులమయ్యేందుకు అవలంబించదగిన
కిటుకులెన్నో ఉన్నాయి అనుకోండి, అప్పుడేమవుతుంది?
మొట్టమొదటిసారిగా, ఒకాయన సరిగ్గా ఈ మాటే చెప్తున్నారు!అసదృశమైన ఈ శాస్త్ర తుల్యమైన పుస్తకంలో, సద్గురు మరణం
గురించి సాధారణంగా ఎవరూ మాట్లాడని లోతైన అంశాల గురించి
విడమర్చి చెప్తున్నారు. ఆ వివరణలలో ఆయన తన ఆధ్యాత్మిక
అనుభవాలను కూడా విస్తృతంగా ఉటంకిస్తున్నారు. ఒక వ్యక్తి తన
మృత్యువు కోసం తనే చేసుకోగల సన్నాహాలను గురించీ, ఒక వ్యక్తి
మరణ ఘడియలలో అతడికి మనం చేయగల సహాయం గురించీ,
మరణించిన వాళ్ళకు వాళ్ళ మరణానంతర ప్రస్థానంలో కూడా
మనం అందించగల తోడ్పాటు గురించి ఆయన ఆచరణీయమైన
విషయాలనెన్నింటినో విశద పరుస్తున్నారు.ఆస్తికులు గానీ నాస్తికులు గానీ, భక్తులుగానీ అజేయులు గానీ,
పరిణతి చెందిన సాధకులు గానీ బహు సామాన్యులు గానీ ఒక్క
మాటలో చెప్పాలంటే చావును తప్పించుకోలేని వారందరూ
చదవవలసిన పుస్తకం ఇది, -
-
Memu Kuda Charitra Nirmincham By B Anuradha
₹350.00అవును… చరిత్రనే సృష్టించారు
ఇంగ్లిష్ అనువాదానికి ముందుమాట –వందనా సోనాల్కర్
“ఆడవాళ్ళు బట్టలు ఉతుక్కోవడానికి మా ఊరి నది దగ్గర కున్బీలకు, మహార్లకు వేరు వేరు బండలు ఉన్నాయి. అయినా నేను కావాలనే కున్బీల బండ దగ్గరకెళ్ళి నా బట్టలు ఉతికాను. మరుక్షణం నలుగురు కున్బీ ఆడవాళ్ళు పరుగెత్తుకుంటూ వచ్చి ‘ఏయ్ మహార్నీ నీకు కళ్ళేమైనా దొబ్బాయా? ఇది మా బండ అని తెలియదా నీకు?’ అని అరిచారు.
‘ఎవర్నే మహార్నీ అంటున్నారు? ఏం…నా బట్టలు ఇక్కడ ఉతికితే ఏమవుతుంది? కావాలంటే మీ బండ మీద నీళ్ళు పోసి శుద్ధి చేసుకోండి’ అన్నాను. వాళ్ళు వెంటనే ‘ఎంత పనికిమాలిన ఆడదానివి నువ్వు’ అనేసరికి నేను కోపం పట్టలేక పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళల్లో ఒకామె జుట్టు పట్టుకున్నాను. నన్ను మహార్నీ అని ఎవరైనా పిలిస్తే నాకు మహా కోపం వస్తుంది. అలా పిలిపించుకోవడం నాకు చెడ్డ అసహ్యం. పెద్ద గొడవయ్యింది. వాళ్ళు నలుగురు ఉన్నారు. నేను ఒక్కతిని. అయితేనేం నేను ఒక్కదాన్ని చాలదా వాళ్ళకు జవాబు చెప్పడానికి. ఇంతలో మా మామగారు జోక్యం చేసుకుని గొడవ ఆపారు.”
“నా మొదటి గీతం నేను భీమ్ కోసం పాడతాను
నేను సత్యాగ్రహంలో పాల్గొని, ఆయన్ని దగ్గరనుండి చూస్తాను.
నా రెండవ గీతం అతనికే
మాకు నీరు తోడుకొనే హక్కు ఎవరు ఇచ్చారో
ఆయన కారణంగానే, బాయి, మేము ఈ వ్యాన్లో సంతోషంగా ఉన్నాము. నా మూడవ గీతం,
ప్రజలందరినీ ఆనంద వధువులా చేసిన
రమా ఆయి స్వామికి”,
మొదటి పేరాలో ఉటంకించిన సంఘటన ఈ పుస్తకం రెండవ భాగంలో ఉన్న దళిత మహిళల ఇంటర్వ్యూల నుండి తీసుకున్నది. ఒక మహార్ మహిళ అటువంటి పని చేస్తే ఈ రోజైనా అలాంటి ప్రతిస్పందనే ఎదురవ్వొచ్చు. భారత గ్రామీణ జీవిత వాస్తవికత……………
-
-
Pravahinche Uttejam Che Guevara By Katyayani
₹200.00“చేగెవేరాని ” క్యూబా విప్లవానికో, బొలివియా పోరాటానికో పరిమితం చేసి చూడలేము. తను విప్లవ స్వప్నాల్ని ప్రపంచరీకరించిన భావుకుడు, విప్లవకారుడు. గెరిల్ల యోధుడు, అరుదైన నాయకుడు.. జీవన్మరణాలు రెంటికి సార్ధకత ఉండాలని తపించిన మనిషి.. అతని జీవితం లోని సమకాలీన ప్రాధాన్యతను మళ్లీ మన ముందుకు తెచ్చేదే ఈ రచన.