-
Maranam By Sadhguru
₹300.00మరీ అంత గంభీరంగా ఉండకండి! జీవస్థితి అంటే
కొద్ది కాలం మెరిసే మెరుపు, కానీ మరణ సితి
మాతం చాలా కాలం కొనసాగే వ్యవహారం.చాలా సమాజాలలో మరణం అనేది (చర్చలకు) నిషిద్ధ విషయం .
మరణం గురించి మన అవగాహన అంతా తప్పుడు అవగాహనే
అనుకోండి, అప్పుడేమవుతుంది? మరణమనేది మనమనుకొన్నట్లు
ఘోరవిప్పత్తేమీ కాదనుకోండి. అది కూడా జీవితంలో ముఖ్యభాగమే
అనుకోండి… అంతేకాదు, మరణమనే ప్రక్రియలో మనం ఈ
ప్రాపంచిక చక్రభ్రమణానికి అతీతులమయ్యేందుకు అవలంబించదగిన
కిటుకులెన్నో ఉన్నాయి అనుకోండి, అప్పుడేమవుతుంది?
మొట్టమొదటిసారిగా, ఒకాయన సరిగ్గా ఈ మాటే చెప్తున్నారు!అసదృశమైన ఈ శాస్త్ర తుల్యమైన పుస్తకంలో, సద్గురు మరణం
గురించి సాధారణంగా ఎవరూ మాట్లాడని లోతైన అంశాల గురించి
విడమర్చి చెప్తున్నారు. ఆ వివరణలలో ఆయన తన ఆధ్యాత్మిక
అనుభవాలను కూడా విస్తృతంగా ఉటంకిస్తున్నారు. ఒక వ్యక్తి తన
మృత్యువు కోసం తనే చేసుకోగల సన్నాహాలను గురించీ, ఒక వ్యక్తి
మరణ ఘడియలలో అతడికి మనం చేయగల సహాయం గురించీ,
మరణించిన వాళ్ళకు వాళ్ళ మరణానంతర ప్రస్థానంలో కూడా
మనం అందించగల తోడ్పాటు గురించి ఆయన ఆచరణీయమైన
విషయాలనెన్నింటినో విశద పరుస్తున్నారు.ఆస్తికులు గానీ నాస్తికులు గానీ, భక్తులుగానీ అజేయులు గానీ,
పరిణతి చెందిన సాధకులు గానీ బహు సామాన్యులు గానీ ఒక్క
మాటలో చెప్పాలంటే చావును తప్పించుకోలేని వారందరూ
చదవవలసిన పుస్తకం ఇది, -
-
-
-
-
-
Oke Okkati
₹299.001 ఒకే ఒకటి
1991 జూన్ 7 వ తేదీన భూమి 112 నిమిషాలపాటు అదిరింది. నిజంగా కాదు, అలా అనిపించింది అంతే.
నేను ప్రఖ్యాత హాస్య చిత్రం ‘సిటీ స్లిక్కర్స్’ చూస్తున్నాను. ప్రేక్షకుల నవ్వులతో హాలు దద్దరిల్లి పోయింది. ఇంతవరకు వచ్చిన వాటిలో అది అత్యంత హాస్యచిత్రంగా పేరు పొందింది. అందులో అనూహ్యమైన జ్ఞానగుళికలు, అంతర్ దృష్టి డోసులు
కూడా ఉన్నాయి. మరుపురాని ఒక దృశ్యంలో పట్టువదలని కౌ బాయ్ కర్లీ (కీర్తిశేషులు జాక్ పాలన్స్ నటించారు), సిటీ స్లిక్కర్ మిచ్ (బిల్లీ క్రిస్టల్ ఆ పాత్రలో) తప్పిపోయిన పశువులను వెతకటానికి బయలుదేరుతారు. ఆ సినిమాలో ఆద్యంతమూ దాదాపు వారు ఇద్దరూ పోట్లాడుకుంటూనే ఉంటారు. పక్కపక్కనే సవారి చేస్తూ చివరికి ఇద్దరూ జీవితాన్ని గురించి ఒక సంభాషణలో కలుస్తారు. ఉన్నట్టుండి కర్లీ తన గుర్రాన్ని ఆపి మిచ్ వైపు తిరుగుతాడు.
కర్రీ : నీకు జీవిత రహస్యం తెలుసా?
మిచ్ : తెలీదు. ఏమిటి?
కరీ : ఇది. [ఒక వేలు పైకి ఎత్తుతాడు]
మిచ్ : నీ వేలా?
-
-
పుల్లంపేట జరీచీర
Original price was: ₹300.00.₹290.00Current price is: ₹290.00.“శ్రీపాదవారి కధలు విని వుండకపొతే తెలుగుల వునికి అయోమయం. చదువరులకు చదువు చెప్పగలిగినది ఆయన రచన. తీయందనపు తీయందనము చవులిచ్చినదాయన శైలి. ఆయన రచనలు మరో భాషకు లొంగవు. జాను తెనుగు నేర్చినవారికే, తెలుగు వారైన వారికే శ్రీ శాస్త్రిగారి కధలు చదివి ఆనందించే అదృష్టం.”
– మల్లాది రామకృష్ణ శాస్త్రి.
“అచ్చమైన వ్యావహారికాంద్రం వ్రాసిన వారిలో ప్రధమ గణ్యులు శ్రీపాద వారు”
– పిలకా గణపతి శాస్త్రి.
“సర్వదా తమరీనాటి యాంధ్ర వ్యావహారిక భాషా నిర్మాత్రుగణ ప్రధమ గణనీయులు”
– విశ్వనాధ సత్యనారాయణ.
“ఫ్యూడల్ సంస్కృతి నుంచి వచ్చిన శాస్త్రిగారు, ఆ సంస్కృతి పాత్రల చేత ఫ్యూడల్ సంస్కృతి భాషను మాట్లాడించినట్లు మరెవరూ మాట్లాడించలేరు.”
– కొడవటిగంటి కుటుంబరావు.
“శ్రీపాదవారు యదార్ధముగా ఆయన చూపులకు కనిపించిన వస్తువు, ఆయన చెవులకు వినిపించిన మాటలు మాటగట్టుకొని కధలలో బెట్టి కళ కట్టించును.”
– మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి.
“భాషా విషయకంగా ఎంత వ్యవహార వాదియో, భావవిషయంలో అంత తెలుగువాడు – సుబ్రహ్మణ్యశాస్త్రి. ఏ సహ్రుదయున్నైనా తెలుగు బాషలో తెలుగు కధ రాసిన ఖ్యాతి ఎవరికీ దక్కుతుందని అడిగితే నిర్మొహమాటంగా ‘వడ్లగింజలు’ రాసిన సుబ్రహ్మణ్యశాస్త్రి గారిదే ఆ ఖ్యాతి అని చెప్పి తీరుతారు.”
– ఉషశ్రీ.
వీరు తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురం తాలూకా పొలమూరులో జన్మించారు. వేదం, జ్యోతిషం, ధర్మశాస్త్రాలను అభ్యసించారు.
శ్రీపాదవారు తమ కధలను వారు చిన్న కధలని పిలిచినా అవన్నీ ఓరకంగా నవలికలనే అనవచ్చు. వస్తువు రీత్యా ప్రణయం, సంఘసంస్కారం, ప్రబోధం, కుటుంబ జీవితం, అపరాధ పరిశోధనం, భాషా వివాదాత్మకం, చరిత్రాత్మకం, అవహేళనాత్మకం అంటూ స్థూలంగా విభజించుకోవచ్చు. శ్రీపాదవారు ఇవే కాక పద్యరచనలు, నాటకాలు, రూపికలు, రేడియో నాటికలు, నవలలు, అనేక వచన – రచనలు, అనువాదాలు, వైద్యగ్రంధాలు కూడా రాశారు.
వీరు వాచస్పతి, తార్కికుడు, వసంతుడు, కుమార కవి సింహుడు, భటాచార్యుడు, కౌశికుడు అనే మారు పేర్లతో శతాధిక వ్యాసాలు రాశారు. ‘ప్రబుద్దాంద్ర పత్రిక’ను చాలాకాలం నిర్వహించారు.
వ్యావహారిక భాషావాదిగా గిడుగు ఉద్యమానికి అండదండలందించారు. గాంధీ – ఖద్దరు – హిందీ ఈ మూడింటిని వ్యతిరేకించిన వ్యక్తీ.
తెలుగు కధకులలో కనకాభిషేక గౌరవం (1956)లో అందుకున్న ప్రధములు.
-
Dakkali Jaambapuraanam (Telugu)
₹280.00భారతీయ సమాజంలో మూలవాసీ సంస్కృతిని వెలికి తీయడానికీ , జాతుల సమస్యలోని వివిధ కోణాల్ని అధ్యయనం చేసి లోతుపాతుల్ని గ్రహించడానికీ ,
తరతరాలుగా మరుగున పడివున్న ఉత్పత్తి కులాలకు చెందిన ప్రజాశ్రేణుల చరిత్ర అవగాహనకీ , వారి మధ్య నెలకొన్న సాంస్కృతిక అగాథాల్ని పూడ్చి ఐక్యత సాధించడానికీ
మౌఖికంగా భిన్న రూపాల్లో లభ్యమౌతున్న జాంబ పురాణాలు ఎంతగానో దోహదం చేస్తాయి.
-
-
-
-
-
Geetha Saram Navajevana Vedam
₹260.00ఎక్కడ కృష్ణుడు (డాక్టరు), అర్జునుడు (పేషెంటు) ఉంటారో అక్కడ ఆరోగ్య భాగ్యమస్తు!
సంఘంలో ఒక్క డాక్టరుకు మాత్రమే ప్రతి వ్యక్తినీ కలిసే అవకాశం ఉంది. రోగం లేని జీవుడు లేడు. డాక్టర్ అవసరంలేని రోగి లేదు. రోజు గడచినకొద్దీ రోగం ముదురుతుంది. ఖర్చు పెరుగుతుంది. డాక్టరు, పేషెంటు ఇరువురు మధ్య కావలసిన పరస్పర అవగాహనను, నమ్మకాన్ని, విశ్వాసాన్ని డాక్టరు (కృష్ణుడు) హాస్పిటల్ (యుద్ధ రంగం) లో పేషెంట్ (అర్జునుడు) అడుగు పెట్టగానే “గీతా సారం, నవజీవనవేదం” తో ఆహ్వానిస్తాడు. పేషెంట్ (అర్జునుడు) డాక్టరుకు (కృష్ణుడికి) సర్వస్య శరణాగతుడై రోగ లక్షణాలను (శత్రువు) పూర్తిగా వివరిస్తాడు. కృష్ణుడు తొట్రుపాటు లేకుండా అనర్థకంగా అర్జునుడికి గీతాబోధచేస్తాడు (అంటే చేయవలసిన విధులు, విధానాలు, టైము, ఖర్చు, హాస్పిటల్లో చికిత్స పూర్తి అయిన తర్వాత మనసుకు ప్రశాంతత కూర్చేది భగవద్గీత an old-fashioned way. మానవ ప్రయత్నానికి పరమాత్మ సహాయం తప్పక ఉంటుంది. వైద్య వృత్తికి కొద్దిపాటి పెట్టుబడి. వైద్య సిబ్బంది కర్తవ్య పాలనమీద మనసు కేంద్రీకరిస్తారు. వైద్య వృత్తి సేవావృత్తి. సమాజాభివృద్ధిలో డాక్టర్ భాగస్వామ్యానికి విలువ ఎక్కువ. ఈ చిరుకానుక ద్వారా వైద్య సేవాశక్తికి రెక్కలొచ్చి ఒక్కొక్క కుటుంబాన్ని కొంతలో కొంత మారుస్తూ మొత్తం సమాజాన్నే మార్చే అవకాశం ఉంది ఒకనాటికి. కాబట్టి వారే సమాజాన్ని మార్చగలరు.
ధ్యానము, ప్రాణాయామం, యోగా, అభ్యాసము వలన ఉపయోగాలను చక్కగా చెప్పింది “గీతాసారం”. ధృఢ సంకల్పం, కర్తృత్వ భావనలేని కర్తవ్య నిర్వహణ, స్వార్థంలోనే పరమార్ధంగా నేటి దైనందిన జీవితంలో కొందరు ఎలా చేస్తున్నారో ఉదాహరణలున్నాయ్ “గీతాసారం”లో. ఏకాగ్రత, బుద్ధి కుశలత, పట్టుదల, సహనం, సంయమనం, అలవరచుకొని కొంతమంది కోపాన్ని ఎలానియంత్రించుకుంటున్నారో “గీతాసారం”లో ప్రస్తావించడం అయినది. అధ్యాయాలుగా ఉన్న భగవద్గీత జ్ఞానభాండాగారం, మనకు కావలసినది ఎక్కడ ఉందో వెదికి దానిని అర్థం చేసుకొని మనకు అన్వయించుకొని ఆచరించడం సామాన్యులకు అయ్యే పనికాదు. అందువల్లనే “గీతాసారం” వివిధ విషయాలుగా వర్ణించడము అయింది. ఏ విషయం కావాలన్నా ఎవరైనా ఎప్పుడైనా చదువుకొని ఆచరణలో పెట్టడానికి రోజువారీ భాషలో “గీతాసారం” అందిస్తోంది………….
-
-
-
-
-
-
-
-
-

































































































