Best Seller Items

  • Viswa Darshanam

    1 ఉపోద్ఘాతం

    శ్రీ రాముడు నూనూగు మీసాల నూత్న యౌవనంలో వున్నప్పటి ఆయన విద్యాభ్యాసం పూర్తి అయింది. దేశాలన్నీ తిరిగి, పుణ్యక్షేత్రాలన్నీ సేవించుకుని అయోధ్యకు మరలి వచ్చాడు.

    మరలి వచ్చిన నాటి నుంచి శ్రీరాముని మనస్సు ఎందుకో చింతాక్రాం తమైపోయింది. ఏ సుఖాలమీదికి మనస్సు పోవడంలేదు. ఏవేవో ఆలోచనలు ముసురుతున్నాయి. ఏదో అశాంతి, అసంతృప్తి ఆయనను నిలవనీయడంలేదు.

    రాముడి దిగులు చూసి, తండ్రి దశరథుడికి దిగులు పట్టుకుంది. “ఏమిటి నాయనా! ఎందుకిలా దిగులుగా వున్నావు?” అని అడిగాడు. రాముడు “ఏమీలేదు నాన్నగారూ!” అనడం తప్ప, ఎన్నిసారులు అడిగినా తన చింతా కారణం చెప్పలేదు. దశరథుడికి భయం వేసింది. కులగురువైన వశిష్ఠుడికి కబురు పెట్టాడు. ఆయన వచ్చి రాముడిని సంగతేమిటో చెప్పమని గుచ్చి గుచ్చి……………….

    249.00
  • Enduku Tho Modalu

    ఉపోద్ఘాతం

    ‘ఎందుకు’ లో దాగి ఉన్న శక్తి

    నా జీవితంలో అవసరమైన సమయంలో సరిగ్గా ఈ ‘ఎందుకు’ ఎదురయింది. అది అధ్యయనంలోనో మానసిక క్షేత్రంలోనో జరిగిన పరిశోధన కాదు. నేను చేస్తున్న పనిమీద నాకు ఆసక్తి నశించింది. నా చుట్టూ చీకటి అలుముకున్నది. నేను చేసే పనిలోనూ, నా ఉద్యోగంలోనూ ఏ లోపమూ లేదు. ఆ పనిచేయటంలో ఆనందాన్ని కోల్పోయాను. బయటికి కనిపించే పరిస్థితులు చూస్తే నేను ఆనందంగానే ఉన్నానని చెప్పాలి. నా జీతం బాగున్నది. నా ఖాతాదారులందరూ చాలా మంచివాళ్ళు. కానీ అందులో నాకు ఆనందము. తృప్తి కలగటంలేదు. ఒక మంచి ఉద్యోగం చేస్తున్న సంతృప్తి, అనుభూతి నాకు కలగటం లేదు. పనిపట్ల అనురక్తి, పాశము నాలో మరొకసారి కళ్ళు తెరవాలి.

    ఈ ఎందుకు కనుక్కున్న తర్వాత ఈ ప్రపంచం పట్ల నా దృక్పధం పూర్తిగా మారిపోయింది. ‘ఎందుకు’ కనుక్కున్న తర్వాత నా అనురక్తి. పాశము ఎప్పటికంటే ఎన్నోరెట్లు పెరిగాయి. అది అతి సరళం, శక్తివంతం, ఆచరణాత్మకం కూడా. కనుకనే వెంటనే నా స్నేహితులందరికీ చెప్పేశాను. అంతేగదా మరి! విలువైన విషయం ఏదైనా తెలియగానే మన సన్నిహితులతో చెప్పుకుంటాం. ఆ ఉత్తేజంతో నా మిత్రుల జీవితాలే మారిపోసాగాయి, ఆ కారణంగా నా మిత్రులందరూ వచ్చి ఆ రహస్యాన్ని తమ సన్నిహితులందరికీ చెప్పమని అడిగారు. అలా ఆ భావన విస్తరించసాగింది………….

    399.00
  • Evariki Cheppaka

    280.00
  • Visalandhramu

    250.00
  • VELPULA KATHA|వేల్పుల కథ

    వేల్పుల కథ- రాంభట్ల కృష్ణమూర్తి

    150.00
  • తేరే బినా జిందగీ

    తేరే బినా జిందగీ

    120.00
  • రోబో బుద్ధ

    రాణి శివశంకరశర్మ కథలు
    ఉద్యమాలు సరసమైన ధరలకు అమ్మబడును.
    నాకు అర్జెంటుగా అవార్డు కావాలి. కవితల్రాయలా, కథల్రాయలా, విమర్శ రాయాలా, అన్నీ కలిపి కొట్టాలా? ఏది దారి మహాకవి?
    క్షుద్రక్రిమి లాంటి మనిషి ఎంత? వాడి బుర్ర ఎంత?
    మల్లెపూవులా సుదూరంగా కొండపై మెరుస్తున్న నక్షత్రం. అదీ, అది ప్రేమ. ప్రేమంటే ఆమె.
    ప్రేమ, ధర్మం, న్యాయం, వివేకం, ఆనందం, సౌందర్యం… ఇలాంటి చిలక పలుకులు నేర్చుకొనడానికి తీరుబడి, అవకాశం ఉండాలి.
    జీతానికీ, జీవితానికీ ఒకే అక్షరం తేడా.
    శ్మశానం పక్కన నివాసం ఉంటూ శవ దుర్గంధం నుంచి తప్పించుకోలేం.
    అదే అధర్మం అని గర్జించాడు చార్వాకుడు… ఈ ప్రపంచం ఎంత క్రూరమైనది అంటూ విలపించింది ద్రౌపది.
    మఠం అంటే రాతికట్టడం కాదు, పవిత్రమైన తలకిందులు చెట్టు మన పీఠం.
    ఇష్టానికీ, సర్దుబాటుకీ తేడా ఎందరికి తెలుసు?
    మనిషి యంత్రం ద్వారానే అభివృద్ధి చెందాడు కానీ యంత్రాన్ని ప్రేమించేస్థాయికి ఎదగలేదు.

    140.00
  • ఫూల్ ఔర్ కాంటే

    మట్టి మనుషుల మహాసంగ్రామం

    120.00
  • NUDI-NANUDI | నుడి-నానుడి

    సంపాదకులు: జయధీర్ తిరుమల రావు

    మతభావన ఆధిపత్య భవనాలే తప్ప భాషకి తత్వ శాస్త్రం ఉంటుందనే ఆలోచన చాలామందికి లేదు. మనకి విద్యాత్మక బాషా పండితులు. బాషా శాస్త్రవేత్తలు ఉన్నారే తప్ప బాషా తాత్వికులు లేరు. ఆ కొరత తెలుగా ఆంధ్రమా? రచయిత వాగరి వాగరి పేరు పెట్టుకున్న బి. స. బంగారయ్య గారు తీర్చారు.

    ఇంటి పోకడ బడి పోకడ సమాజం పోకడలని బాషా దృక్పథంతో లోతుగా అర్థం చేసుకున్న ఏకైక రచయిత బంగారయ్య.

    భార్యకు బదులు పెళ్ళాం భర్తకు బదులు మొగుడు రక్తము బదులు నెత్తురు స్తనం బదులు చన్ను అనే తెలుగు మాటలు వాడలేమా? సంస్కృత పదాలు వాడీ వాడీ అసలు సిసలు తెలుగు మాటలను మనం మరిచిపోతున్నాం. తెలుగు మాటలను నేటికీ చదువురాని గ్రామసీమల ప్రజలే వాడుతున్నారు. అలాంటి తెలుగు పలుకులు పండితులకి పామరులకు అనేకమందికి అర్ధమవుతుంటే దానిని పక్కన పెట్టడం ఎందుకు? ఇంత చిన్న విషయం గురించి పెద్ద పెద్ద పండితులు ఎందుకు ఆలోచించరు. ఇది ఈ పుస్తకంలో రచయిత ఆవేదన.

    200.00
  • నామిని ఇస్కూలు పుస్తకం

    ఇస్కోలు పిలకాయల కత పిల్లల భాషలో Algebra చదువులా? చావులా?? మా అమ్మ చెప్పిన కతలు పిల్లల్తో మాట్లాడాల్సిన మాటలు.

    ఈ పుస్తకం గురించి ఎంతచెప్పిన తక్కువే? ఎంతవ్రాసిన కొరతే. ఇస్కూలులో పాఠాలు చెప్పే ప్రతి లెక్కల అయ్యవార్లు కొని చదువవలసిన పుస్తకమిది. ఇస్కూలను నడిపే యాజమానులు తమ అయ్యవాళ్ళచే చదించవలసిన పుస్తకమిది. ఇస్కూలు కెల్లే పిల్లలున్న ప్రతి అమ్మ, నాయిన ఈ బుక్కును కొని మరీ చదవాలబ్బా!!. ఇస్కూల్లకెల్లి చదువుకునే పిల్లలున్న స్నేహితులకు, హితులకు, చుట్టాలకు, పక్కాలకు, ఇరుగుపొరుగు అమ్మలక్కలకు, అన్నయ్యలకు బహుమతిగా ఇవ్వతగ్గ పుస్తకం. లక్షలకు లక్షలు డొనేసన్ను ఇచ్చాం. వేలకు వేలు ఫీజులు కట్తున్నాం..”బాగా చదవాలి, మంచి ర్యాంకుల పంట పండించాలి. ఇంజనీరో, డాక్టరో అవ్వాలని” పిల్లలను సతపోరే అమ్మనాన్నలు, అయ్యవార్లు స్కూల్లో పిల్లలకు లెక్కలంటే, ఇంగ్లీసంటే భయంలేని విధంగా చెప్తున్నారా? లేదా గుత్తంగా బట్టి పెట్టిస్తున్నారో, గమనించడం లేదు. నామిని ఈ పుస్తకంలో చెప్పిన విషయాలు ఉహించి రాసినది కాదు. ఆయన అనుభవం నుండి, ఆలోచన నుండి, ఆచరణ నుండి పుట్టు కొచ్చినదీ పుస్తకము. తన అక్కకూతురు తులసి, – తన పిల్లలకు, కొన్నిరోజులు స్కూలు పిల్లలకు టిచరుగా పాఠాలు చెప్పిన అనుభవం నుండి, స్కూలుకెళ్ళె ప్రతి పిల్లాడికి లెక్కలన్నా, ఇంగ్లీసన్నా భయం పోవాలన్న తపనకు ప్రతిఫలమే ఈ పుస్తకము. ఈ మధ్య వార్తాపత్రికల్లో చూస్తున్నాం, చదువువత్తిడికి తట్టుకునే మానసికస్ధితి కోల్పొయి ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల గురించి. వాటికి సమాధానం ఈ పుస్తకంలోని “చదువులా? చావులా”

    200.00
  • Maa Badi

    బడిపై నాకలవడిన భక్తిరసమే ప్రధానంగా, విద్యార్థి జీవిత స్మృతులు నింపే ఆనందమే నిధానంగా, నాట్యకళాభిమానమే ఆసరాగా, నా అనుభూతులను నివేదించా. తదాశ్రమ దినాలుస్మృతిపథంలోకి వస్తే, తీగకు లేజిగురుదయించినట్టు, మనసు పునర్వికాసం చెందే, సౌరభ్యం సంస్కారవాసనలు ఉడుగని సహృదయ సంపన్నులు పఠీత్రులోకంలో గుప్పెడున్నా, వారే నాకు పదికోట్లు. వారివారి వృత్త్యుద్యోగవిహిత కృత్యనిర్వహణానంతర సమయాల్లో, వారికీ బాలవ్యాసాంగం, ఏ పదినిమిషాల పాటు, విశ్రామ సమయ పఠనోపయుక్తమైనా నాయీ కృషి సత్ప్రయోజనకారి అయినట్టే భావిస్తా. మరి విద్యాజగత్తులో, ఏ పదిమంది విద్యార్థులకీ రచన, క్రమనిష్టాభినివేశ చిత్తత, సోదర విద్యార్థుల పట్ల సహృద్భావం, ఆచార్యుల పట్ల సద్వినయ సౌశీల్యం, బడిపట్ల భక్తీప్రపత్తులు ఉద్భోధించగల్గిన నేను సార్థకజనుణ్ణి అయితినని సంతసిస్తా.

    220.00
  • Gupta 91 By Patanjali Sastri

    గుప్తా ’91

    గుప్తా తడిలేకుండా శుభ్రంగా తల తుడుచుకుని వచ్చి చంకల్లో కొంచం పౌడరు చల్లుకొని, తువ్వాలు అవతల పారేసి లోపలి లాగులో అద్దం ముందు కూచున్నాడు. వంటింట్లో గుప్తాకి లంచి బాక్సు పెట్టి, అతని సంచిలో పెట్టి గదిలోకి వచ్చింది పార్వతి. చేతిలో దువ్వెన పట్టుకొని అద్దంలో చూసుకుంటున్నా డతను. బ్రాహ్మీ నూనె సీసాలోంచి కొంచెం నూనె అరచేతిలోకి ఒంపుకుని రెండు చేతులకి రాసుకొని ఎదురుగా నుంచుని అతని నల్లటి వంకీల జుట్టుకి రాస్తోంది. ఆమె తెల్లటి పొట్ట అతనికి దగ్గరగా ఉండటంతో ముందుకు జరిగి పొట్టమీద ముద్దు పెట్టుకున్నాడు గుప్తా.

    “చాల్లెండి సంబడం. ఎదిగిన పిల్లలున్నారని తెలీదేటి?” |
    “ఆళ్లెదిగితే నేనేం జెయ్యనే? దానికి దీనికి సంబంధం ఉందాసల?”
    “ఇంక దువ్వుకోండి. మీ అమ్మగారికి టిఫిను పెట్టాలి.”
    “పూజ అవ్వలేదా?”
    “అత్తగారివాళ ఉషారుగా ఉన్నారు.”
    “అదేం?”

    “ఆవిడ ఫెండు మజ్ఞాన్నం ఒస్తాడట. కొంచెం టిఫిను ఎక్కువ చెయ్య | మన్నారు.”……………..

    175.00
  • Grahantaravasi

    భూమండలం బోరుకొడుతోంది – అని పైకే అనేశాడు. సుందరికి అర్ధం కాలేదు. ఈ మాట ఎందుకన్నట్లు? దీని అర్ధమేమిటి? యితడు పిచ్చివాడా – ఇలా అనేక ప్రశ్నలు సుందరిలో చెలరేగాయి.
    స్వాప్నికుడు కలల్లోనే శృంగార వుద్దీపనాన్నీ శృంగార తృప్తినీ పొందుతాడు. వాగ్గేయకారులు తమ స్వప్నాల్ని నేలమీదికి దించి సాకారం చేయడానికి ఇష్టపడలేదు. అందుకే దివ్య ప్రణయ తన్మయత్వంలో మైమరపించే గీతాలని ఆశువుగా పాడారు, ఆడారు. నిజమైన శృంగారం స్వప్నాల్లోనే ఉంది.
    శూన్యంలో భూమి వ్యర్థంగా తిరుగుతోంది. వాతావరణాన్ని దాటి రోదసిలోకి పలాయనం చిత్తగించిన వ్యోమగామిలా పట్టి ఉంచేదీ స్పందింపజేసేదీ ఏదీ లేకుండా, ఆకర్షణ శక్తిని కోల్పోయినట్లు నిరర్ధకంగా తిరుగుతోంది.
    ప్రతీదీ వ్యక్తీకరింపబడాలి. మనిషి వ్యక్తీకరించలేనిదీ బహిర్గతం చేయలేనిదీ అంటూ ఏదీలేదు. వ్యక్తీకరింపబడినది అతిక్రమించబడుతుంది. మనిషి ఆధీనంలోకి వస్తుంది. మనిషి సృజనాత్మక వ్యక్తీకరణ ద్వారా ప్రపంచాన్ని అధీనంలోకి తెచ్చుకుంటున్నాడు.

    100.00
  • మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే

    ప్రతి ఒక్కరూ చదవాల్సిన అసాధారణ రచన!

    పదండి చరిత్రలోతుల్లోకి… పదండి తోసుకు!

    మహాభారతమూ, అందులోని పాత్రలూ, అవి ఎదుర్కొన్న సమస్యలూ, సంక్షోభాలూ తమను కప్పిన మాంత్రికశైలిని ఛేదించుకుంటూ నేరుగా చారిత్రకవాస్తవికతలోకి ప్రవహిస్తే – ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుంది!

    ఆ అద్భుతత్వాన్ని ఈ పుస్తకంలోని అక్షరక్షరంలో మీరు ఆస్వాదించవచ్చు.

    మహాభారత మంత్రకవాటం తెరచి చూపించే పురాప్రపంచాన్ని అంతే ఆశ్చర్యావహంగా దర్శించవచ్చు. భారతీయ, ఇతర ప్రపంచపౌరాణికతల మధ్య సాదృశ్యాలనే కాదు; విశ్వాసాలు, ఆచారాలు, సంస్కృతీసంప్రదాయాల రూపంలో మనం ఊహించుకునే హద్దులు చెరిగిపోయి, ప్రపంచమంతా ఒకటిగా మారిపోయే విలక్షణ సన్నివేశాన్ని విప్పారిన చూపులతో వీక్షించవచ్చు.

    సాహిత్య విమర్శకుడిగా, పత్రికారచయితగా, రాజకీయ విశ్లేషకుడిగా, అనువాదకుడిగా, కాలమిస్టుగా, కథా రచయితగా తెలుగు పాఠకులకు పరిచితులైన కల్లూరి భాస్కరం విశిష్ట రచన ఇది.

    పురాచరిత్ర, సామాజికతలకు సంబంధించిన అనేకానేకమైన అదనపు కోణాల నుంచి మహాభారతాన్ని వ్యాఖ్యానించే ప్రణాళికలో పూర్వభాగం ఈ పుస్తకం.

    ధారావాహికగా వెలువడి అశేషపాఠకులను అలరించిన ఈ రచన, మరిన్ని చేర్పులతో మరింత లోతును సంతరించుకుని ఇప్పుడీ గ్రంథ రూపంలో మీ చేతుల్ని అలంకరిస్తోంది.

    మహాభారతంలోని మన చారిత్రక మూలాలను తవ్వి తీసే ఈ అసాధారణ రచన మలిభాగం రూపుదిద్దుకొంటోంది.

    650.00
  • KGH Kathalu

    కింగ్ జార్జి ఆసుపత్రి, కేజీహెచ్‌గా మనందరికీ పరిచయం. పదకొండేళ్ల వయసులో మొదటిసారి నన్ను విశాఖ సముద్ర తీరానికి తీసుకెళ్తూ మా మేనమామ ఈ ఆసుపత్రిని చూపించారు. ఆ మరుసటి ఏడాది మా నాన్నగారు మళ్ళీ ఈ ఆసుపత్రి చూపిస్తూ, ‘ఇక్కడ చదివిన మన ఊరివాళ్ళు గొప్ప వైద్యులయ్యారు, అలాగే నువ్వు కూడా ఇక్కడే చదువుకోవాలనుంది’ అని చెప్పారు.
    వందేళ్ళ చరిత్ర కలిగి ఉత్తరాంధ్ర ప్రాణదాయినిగా పేరుగాంచిన ఈ ఆసుపత్రిలో నేను తొలుత వైద్య విద్యార్థిగా, తరువాత వైద్యుడిగా, అంతేకాకుండా నేనూ ఒక రోగిగా, నా కుటుంబ సభ్యులు కొంతమంది ఇక్కడ రోగులుగా చికిత్స పొందుతున్నప్పుడు వాళ్ళకి సేవకుడిగా, చివరగా ఇదే ఆసుపత్రి ఎదురుగా ఒక క్లినిక్ పెట్టి ప్రైవేట్ ప్రాక్టీస్ చేసి ఎన్నో జ్ఞాపకాలను పదిలపరుచుకున్నాను. ఇవన్నీ కేజీహెచ్తో ఎనలేని బంధాన్ని నెలకొల్పితే, నేను రాసుకున్న కథల్లో అప్రయత్నంగానో లేక నేనెప్పుడూ ఈ పరిసర ప్రాంతాలు దాటి ఆలోచించకపోవటం వల్లనో ప్రతి కథలో కేజీహెచ్ ఒక నేపథ్యంగా మారింది. అందుకని నా ఈ మొదటి కథాసంపుటికి ‘కేజీహెచ్ కథలు’ అని పేరు పెట్టాను.

    150.00
  • MAHAAMANTRI | మహామంత్రి

    మహామంత్రి, భానుడి ‘ప్రతిజ్ఞా యౌగంధరాయణమ్’ నాటకానికి నవలారూపం

    50.00
  • పల్నాడు కథలు

    తెలుగునాట పల్నాడు సీమకు ఒక ప్రత్యేకత వుంది. తనదైన ఒక వీర చరిత్ర వుంది. పల్నాటి నేల పచ్చి వాసనను పట్టి చూపే ప్రయత్నంగా రచయిత్రి సుజాత వేల్పూరి రాసిన కథలే ఈ ‘పల్నాడు కథలు’ సంకలనం. చదివితే కచ్చితంగా పల్నాటి గడ్డపైన తిరుగాడిన అనుభవాన్ని ఇచ్చే కథలివి.

    225.00
  • Rafi

    టు విద్యా రంగంలో, ఇటు సాహిత్య రంగంలో విశేష కృషి సాగిస్తున్న కొద్దిమంది ఆధునిక తెలుగు రచయిత్రులలో సి. మృణాళిని స్థానం ప్రత్యేకం. పాత్రికేయురాలిగా, రేడియో వ్యాఖ్యాతగా, బుల్లితెర కార్యక్రమాల నిర్వాహకురాలిగా, విమర్శకురాలిగా, కథకురాలిగా, అనువాదకురాలిగా, తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యురాలిగా బహుముఖ ప్రతిభను చాటిన మృదుభాషి మృణాళిని. తన ప్రతిభను గౌరవిస్తూ ఇప్పటివరకు 23 పురస్కారాలను వివిధ సంస్థలు ఆమెకు అందజేశాయి.
    – సి. మృణాళిని

    225.00
  • Rayalaseemalo Aadhunika Saahityam

    విద్వాన్ విశ్వం గారన్నట్టు రాయలసీమ సాహిత్యంలో “శుకపిక శారికావ రుచుల్ వినిపించవు”. అందులో ఆత్మాశ్రయ వాదాలకూ, ఆత్మాన్వేషణా సిద్ధాంతాలకూ చోటు లేదు.రాయలసీమ సాహిత్యం రాయలసీమ బతుకు నీడ.రాయలసీమ సాహిత్యం అలా ఎందుకుందో అర్థం కావాలంటే రాయలసీమ జీవితం ఎందుకు అలా ఉందో తెలియాలి. దాని చలన సూత్రాలను వెదికి పట్టుకొని జీవితాన్ని, సాహిత్యాన్ని సమన్వయం చేయాలి. అలాంటి అరుదైన ప్రయత్నమే ఈ గ్రంథం. ఇది సుదీర్ఘ అధ్యయన ఫలితం.
    225.00
  • Oke Okkati

    1 ఒకే ఒకటి

    1991 జూన్ 7 వ తేదీన భూమి 112 నిమిషాలపాటు అదిరింది. నిజంగా కాదు, అలా అనిపించింది అంతే.

    నేను ప్రఖ్యాత హాస్య చిత్రం ‘సిటీ స్లిక్కర్స్’ చూస్తున్నాను. ప్రేక్షకుల నవ్వులతో హాలు దద్దరిల్లి పోయింది. ఇంతవరకు వచ్చిన వాటిలో అది అత్యంత హాస్యచిత్రంగా పేరు పొందింది. అందులో అనూహ్యమైన జ్ఞానగుళికలు, అంతర్ దృష్టి డోసులు

    కూడా ఉన్నాయి. మరుపురాని ఒక దృశ్యంలో పట్టువదలని కౌ బాయ్ కర్లీ (కీర్తిశేషులు జాక్ పాలన్స్ నటించారు), సిటీ స్లిక్కర్ మిచ్ (బిల్లీ క్రిస్టల్ ఆ పాత్రలో) తప్పిపోయిన పశువులను వెతకటానికి బయలుదేరుతారు. ఆ సినిమాలో ఆద్యంతమూ దాదాపు వారు ఇద్దరూ పోట్లాడుకుంటూనే ఉంటారు. పక్కపక్కనే సవారి చేస్తూ చివరికి ఇద్దరూ జీవితాన్ని గురించి ఒక సంభాషణలో కలుస్తారు. ఉన్నట్టుండి కర్లీ తన గుర్రాన్ని ఆపి మిచ్ వైపు తిరుగుతాడు.

    కర్రీ : నీకు జీవిత రహస్యం తెలుసా?

    మిచ్ : తెలీదు. ఏమిటి?

    కరీ : ఇది. [ఒక వేలు పైకి ఎత్తుతాడు]

    మిచ్ : నీ వేలా?

    299.00
  • Banavathi

    ప్రవేశిక

    ఈ కాలంలో పీఠిక గాని, ప్రవేశిక గాని, మున్నుడి గాని ఏదో పేరుతో రెండు పేజీలు, మరీ గొప్ప పుస్తకం అయితే ఇంకా ఎక్కువ పేజీలు వ్రాస్తేగాని గ్రంథకర్తకైనా, ప్రకటన కర్తకైనా తృప్తి ఉండేటట్లు కనిపించటం లేదు. పాఠకుడికి కూడా ఇది అవసరమేమో తెలియటంలేదు. సినిమా తీస్తాడు. ప్రజలు దీనిని వాంఛిస్తున్నారు. అని అంటాడు. వాంచిస్తున్నారని నీకెట్లా తెలుసునయ్యా అంటే, వీడు తీసిన బొమ్మని వారు ఎగబడి చూడటమే వారు వాంఛిస్తున్నారన్న దానికి సాక్ష్యం. సినిమా వెట్టి పుట్టింది, దేన్నిపడితే దాన్నే చూస్తారు. సరదాకు అనేక వెల్లులు. నీవు ఆ తీసిన బొమ్మలో ఎన్ని వెఱ్ఱులు చూపిస్తే అంత ఎక్కువ డబ్బు వస్తుంది. అంత విరగబడి చూడటం జరుగుతుంది ! ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఉన్న వ్యవహారం అది. కల్లు తాగబోయించి, వాళ్ళకది అలవాటు చేసి, ‘త్రాగేవాళ్ళు మానేస్తే నేను కల్లు దుకాణం ఎత్తేస్తాను, వాళ్ళచేత తాగడం మానిపించండి’ అన్న వాదన ఉన్నది. ఇది అలాంటిది.

    అసలు ఒక పుస్తకానికి పీఠిక ఎందుకు?

    పీఠికతో బాటు కొన్ని పండితాభిప్రాయాలు కూడా ఉంటే మరీ లాభం. ఎందుచేత నంటే చదివేవాడు ఇవి రెండూ చదువుతాడు. పుస్తకాన్ని గురించి తెలిసిపోతుంది. ఇహ పుస్తకం చదవనక్కర్లేదు. అందుచేత ఈ పీఠికలూ పండితాభిప్రాయాలూ పుస్తకాన్ని చదవకుండా చేస్తున్నాయా? అన్నది ప్రశ్న అవుతున్నది. అది ఏమీ కాదు పుస్తకాన్ని ఎప్పుడూ చదవడు. ఇక ఈ పీఠికలు, పండితాభిప్రాయాలు ఏమి చేస్తున్నాయంటే కనీసం పుస్తకాన్ని గురించి కొంత తెలుసుకొనేటట్లైనా చేస్తున్నాయి. పుస్తకం చదివే ఓపిక ఎవరికి ఉన్నది ? తీరిక ఎవరికి ఉన్నది ? పుస్తకం చదవలేదని ఎవరినన్నా అనటమే తప్పు, బ్రతకటమెట్లాగా అన్నది ప్రశ్న అయినప్పుడు పుస్తకాలు చదవమనటం అంత న్యాయం కాదు పుస్తకం చదవటానికి ఒకటి తీరిక ఉండాలి. రెండవది చదివితే అర్థం చేసుకొనే శక్తి ఉండాలి. ఆ శక్తి ఎలా వస్తుందయ్యా అంటే అనేక విధాలుగా వస్తుంది. సరియైన ఏ విధము కూడా మనదేశంలో ఆచరణలో ఉన్నట్లులేదు. ఈ రోజుల్లో ఎవరైనా పుస్తకం చదివాడంటే తన భావాలు పుస్తకాలలో ఉన్నయా లేవా అనేదాని కోసం చదువుతాడు తప్ప వాడేమి వ్రాశాడని చదవడు. వాడు వ్రాసినభావాలు తనకు వ్యతి రేకంగా ఉంటే వాడ్ని తూర్పార పడతాడు.

    ఇది ప్రకృతి శాస్త్రయుగం. అంటే గణితశాస్త్ర యుగం. రెండూ రెండూ కలిపితే నాలుగు ఎట్లా అవుతుందో అంతా అల్లా టంచన్ గా అయితీరాలి. అందరూ ప్రత్యక్ష ప్రమాణవాదులు. ప్రత్యక్ష ప్రమాణులు కాదు. తత్పమాణ వాదులు. రెంటికీ భేదం……….

    250.00
  • Parikini

    100.00
  • Amarakosam

    600.00
  • Vidvamsam

    కులాన్ని అర్థం చేసుకోవడం ఎలా? · కోర్టు తీర్పులు – సామాజిక న్యాయం · అంతర్జాతీయం · అణచివేత – అణచివేత చట్టాలు · విజన్ – విధ్వంసం …

    550.00
  • Adugaduguna Tirugubatu

    నేనీ పుస్తకాన్ని ఎందుకు రాయాల్సి వచ్చింది?

    నన్ను నేను పరామర్శించుకుంటూ.. పరిసర ప్రపంచంతో నాకున్న సంబంధాలేమిటి, అందులో నా స్థానం ఎక్కడని ప్రశ్నించుకుంటూ చేసిన అన్వేషణ ఫలితమే ఈ పుస్తకం. నేను కేరళ మూలాలున్న ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. అయితే యాభై ఏళ్లకు పైగా నా కార్యక్షేత్రమంతా హైదరాబాద్ నగరమూ, కొండలూ గుట్టలతో నిండిన ఆ చుట్టుపక్కల ప్రాంతాలే. పాశ్చాత్య దేశాల్లో ‘బ్రా’లను తగలబెట్టడాన్ని ఓ ర్యాడికల్ చర్యగా పరిగణిస్తుంటే – పధ్నాలుగేళ్ల వయసులో బ్రా ధరించినందుకు మా కుటుంబమే నన్నో నీతిమాలినదానిగా చూసింది. నా యవ్వనపు రోజులన్నీ చిన్న చిన్న తిరుగుబాట్లతో, గణితం మీద వ్యామోహంతో గడిచిపోయాయి. 1970లలో నేను నక్సలైట్ ఉద్యమంవైపు మొగ్గాను, ఎమర్జెన్సీ కాలంలో అజ్ఞాతంలోకి వెళ్లాను. ఇదంతా చూసి, నాకెవరో ‘బ్రెయిన్ వాష్’ చేశారని అనుకున్నారు నా తల్లిదండ్రులు. నన్ను బలవంతంగా మద్రాసుకు తరలించి, ఆ బ్రెయిన్ వాష్న ‘రివర్స్’ చేయించటం కోసం నాకు కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇప్పించారు. దానివల్ల నా జ్ఞాపకశక్తి చెదిరి పోయింది. ఎంతగా అంటే- స్నేహితులు నానా కష్టాలూ పడి నన్ను మద్రాసు నుంచి తప్పించి, హైదరాబాద్కు తీసుకువచ్చిన తర్వాత.. నేను ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తినే గుర్తుపట్టలేకపోయాను. మానసికంగా అంతా అయోమయమైపోయింది. ఎమర్జెన్సీ కాలంలో అరెస్టులను తప్పించుకోడానికి నేనూ, నా భర్త సిరిల్ రెడ్డి ఉత్తర భారతదేశానికి వెళ్లిపోయి, ఘజియాబాద్లో బాల్మీకీల మధ్య జీవించటం ఆరంభించాం. అక్కడ వాళ్లకి ఇంగ్లిష్ నేర్పించటం వంటి రకరకాల పనులు చేశాం. ఆ కాలంలో నాకు తరచూ ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుండేది. 1980లో మేం హైదరాబాద్కు తిరిగి వచ్చాంగానీ ఇక్కడ మాకోసం ఎదురు చూసే కుటుంబంగానీ, పార్టీ గానీ ఏదీ లేదు. అయినప్పటికీ ఈ నగరమే మా ఇల్లు అయ్యింది. స్నేహితుల సహాయంతో మేం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ (హెచీబీటీ)ని నెలకొల్పాం. వామపక్షవాదులు, అంబేడ్కరిస్టులతో ఎక్కువగా కలసి పనిచేస్తూ, తక్కువ ధరలకే పుస్తకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రచురణ…………

    499.00
  • Bhramana Kaanksha

    పాదయాత్ర మనుషుల్ని దగ్గరకు చేరుస్తుంది. మనుషుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది. కొత్త పద్ధతిలో వాస్తవాల్ని చెప్పేందుకు అదొక సాధనం. ఆత్మవ్యక్తీకరణకు అపరిమితమైన అవకాశాల్ని కల్పించేది పాదయాత్ర. ఇది జీవితపు తాజాదనాన్ని అనుభవించటానికి ఎక్కువ అవకాశం ఇస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ఆలోచనల్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల భావవ్యక్తీకరణ పడునేక్కుతుంది. ప్రజల మధ్య సోదరభావం పెరుగుతుంది.

    ఈ ఆసక్తి నుంచే ఆదినారాయణ బయలుదేరి పాదయాత్రలు చేశారు. తన అనుభవాల్ని మూడు భిన్నమైన పేర్లతో, ఆకర్షణీయమైన ఉప శీర్షికలతో పుస్తకాలుగా రాశారు. అన్నిటినీ కలిపి అర్ధవంతంగా ‘భ్రమణ కాంక్ష’ అనే పేరు పెట్టారు. ఏ పాదయాత్ర ఏ ఉద్దేశంతో చేసిందీ, దానికి సంబంధించిన ముందుమాటలతో, ఆ యాత్రా మార్గాల చిత్రణలతో, ఆయా సందర్భాలకి సరిపోయే స్వీయ చిత్రాలతో ఉన్న ఈ పుస్తకం ఆదినారాయణ ఆసక్తిని, అభిరుచిని తెలియజేస్తుంది.

    – అత్తలూరి నరసింహరావు

    300.00
  • Jeevana Laalasa

    విన్సెంట్ చనిపోలేదు. అతనికి మరణం లేదు. అతని ప్రేమా, ప్రజా, అతడు సృజించిన మహా

    సౌందర్యమూ కలకాలం నిలిచిపోతాయి, ఈ ఈ లోకాన్ని సుసంపన్నం చేస్తాయి. అతని చిత్రాల్లో

    నూత్న విశ్వాసం, బతుక్కి కొత్త అర్థం గోచరిస్తాయి. అతడు గొప్ప మానవుడు, గొప్ప వర్ణచిత్రకారుడు, గొప్ప తాత్వికుడు. ప్రేమించిన కళ కోసం ప్రాణాలు ధారపోసి అమరుడయ్యాడు.

    విన్సెంట్ జీవితం, నిరాశలు వాస్తవమైనవాటికన్న ఎక్కువ కల్పనలా అనిపిస్తాయి. అతని మానవ సంబంధాలను, చిత్రలేఖనాలను, వర్ణసమ్మేళనాలను, ఆశనిరాశలను తన ఊహాశక్తితోనూ, కవితాత్మక సాంద్ర వ్యక్తీకరణలతోనూ అక్షరాల్లో పునర్జీవింపజేసే అవకాశాన్ని సంపూర్ణంగా వాడుకుని నవలగా మలిచాడు ఇర్వింగ్ స్టోన్.

    ఈ అనువాదం కేవలం ఆసక్తి కొద్దీ సాగినది మాత్రమే కాక ఇర్వింగ్ స్టోన్ రచనలాగ అభిరుచితో హృదయమంతా రంగరించి సాగడం , తెలుగు పాఠకులకు దొరికిన గొప్ప రంగుల వెల్లువ….

    ఎన్. వేణుగోపాల్

    300.00
  • Maha Swetha Devi

    చోళీకే పీచే

    అనువాదం: కలేకూరి ప్రసాద్

    ‘అక్కడేముంది?’ అన్నది ఆ సంవత్సరపు జాతీయ సమస్యగా మారింది. పంటలు పండకపోవడం, భూకంపాలు. ఎక్కడ చూసినా ఉగ్రవాదులకీ, ప్రభుత్వ యంత్రాంగానికీ మధ్య ఘర్షణలు – ఫలితంగా మరణాలు; కులాంతర వివాహం చేసుకున్న నేరానికి ఒక జంటను హర్యానాలో తలలు నరికి చంపడం; నర్మదా డామ్ విషయమై మేథా పాట్కర్ తదితరులు చేస్తున్న అర్థం లేని డిమాండ్లు. వందలాదిగా జరుగుతున్న మానభంగాలు – హత్యలు – లాకప్లో చిత్రహింసలు వగైరా… వగైరా అంశాలన్నీ ఈ సమస్య ముందు అప్రధానాలై పోయాయి. అవేవీ వార్తా పత్రికల్లో ప్రముఖస్థానాన్ని ఆక్రమించలేకపోయాయి. అన్నిటికీ మించిన ప్రాధాన్యతను సంతరించుకున్న ఒకే ఒక అంశం… చోళీకే పీఛే – రవికె మాటున….

    జాతీయ జీవనంలో ప్రాధాన్యం లేని అంశాలను ప్రాధాన్యం గల అంశాలు అణచి పారేస్తాయి – అదే నియమం. అందుకనే అక్కడ.. రవికె మాటున ఏముంది? అన్నది అతి ముఖ్యమైన సమస్య అయిపోయింది. భారతజాతి ‘ఆత్మ’పెనునిద్దురలో మునిగిపోవడమే కాక అవసరమైనప్పుడు మేల్కొనగలదనడానికి ఇదే తార్కాణం.

    ఈ విధంగా యావన్మంది ప్రజానీకమూ అక్కడేముందో తెలుసుకునే ప్రయత్నంలో మునిగి తేలుతున్నారు. జాతీయ ప్రసార సాధనాలు, సెన్సార్ బోర్డు, బ్రా వ్యతిరేక విముక్త మహిళలు, రాష్ట్రస్థాయి సంస్థలు, కేబుల్ టీవీ ఛానెల్స్ – కళ్ళమీద ఆకుపచ్చ షేడ్ వేసుకున్న మహిళా ఓటేరియన్ల సంస్థలు, అన్ని మతవర్గాలూ, ఇంకా రాజకీయ నాయకులు చాటుమాటుగా ‘ఖల్నాయక్ ‘ కాసెట్లు వేసుకుని చూడటం పరిపాటయిపోయింది……………..

    350.00
  • పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా

    “వివిధ పాత్రల మనోగతాల్ని ఆవిష్కరించే క్రమంలో వాటిని వారి వారి కథలుగా ‘చెప్పించడం’ ద్వారా నవల రాయడంలో ఒక నూతన మార్గాన్ని సూచించిన గోపీచంద్ సాహిత్య చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు.”

    “ఏ నాటికీ నిలిచే నవల. మనిషి ఎలా ఉంటే సంపూర్ణ జీవితం గడపగలడో వివరించిన విశిష్ట నవల. ఆనాటి ప్రథమ తెలుగు నవల గుణగణాల్ని గుర్తుంచుకునేలా ఈనాటి పాఠకులకు అందజేసిన ప్రచురణకర్తలు అభినందనీయులు.”

    “సాంఘిక జీవితం బ్రతుకుదెరువుకూ అనుభవాలకీ ఉపయోగపడుతుంది. ఒంటరితనం అనుభవాలను జీర్ణించుకోడానికి వ్యక్తిగతాభివృద్ధికీ ఉపయోగపడుతుంది అంటారు గోపీచంద్. కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన ఈ తొలి తెలుగు నవల (1963)ను పునర్ముద్రించి ‘అలకనంద’ మంచి పనే చేసింది.”

    “తెలుగుదేశంలో రచయితల చుట్టూ అల్లుకున్న రాజకీయాలను ప్రతిభావంతంగా చిత్రీకరించిన నవల ‘గోపీచంద్’ రాసిన ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’. “

    200.00
  • Shikhandi

    క్వియర్లలో ఎన్ని రకాలున్నారో ముందు అర్థం చేసుకుందాం

    నాది పురుష శరీరం. ఆ శరీరాన్ని నేను ఆమోదిస్తున్నాను. దీన్ని నేను అందరికీ ఇస్తాను.
    నాది స్త్రీ శరీరం. ఆ శరీరాన్ని నేను ఆమోదిస్తున్నాను. దీన్ని నేను అందరికీ ఇస్తాను.

    నాది పురుష శరీరం. దాన్ని నేను తిరస్కరిస్తున్నాను. నాకు ఎవరి పట్లా వాంఛ లేదు.
    నాది స్త్రీ శరీరం. దాన్ని నేను తిరస్కరిస్తున్నాను. నాకు ఎవరి పట్లా వాంఛ లేదు.

    నా శరీరం స్త్రీదో, పురుషుడిదో నాకు తెలియదు. నన్ను నేను స్త్రీలా భావించుకుంటున్నాను.
    నా శరీరం పురుషుడిదో, స్త్రీదో నాకు తెలియదు. నన్ను నేను స్త్రీలా భావించుకుంటున్నాను.

    నాది పురుష శరీరం. స్త్రీదై ఉండాల్సింది. నాకు పురుషుల పట్లే వాంఛ కలుగుతుంది.
    నాది స్త్రీ శరీరం. పురుషుడిదై ఉండాల్సింది. నాకు స్త్రీల పట్లే వాంఛ కలుగుతుంది.

    నాది పురుష శరీరం. స్త్రీదై ఉండాల్సింది. నాకు స్త్రీల పట్లే వాంఛ కలుగుతుంది.
    నాది స్త్రీ శరీరం. పురుషుడిదై ఉండాల్సింది. నాకు పురుషుల పట్లే వాంఛ కలుగుతుంది.

    నాది పురుష శరీరం. స్త్రీలా బట్టలు వేసుకుంటాను. నా వాంఛ పురుషుల పట్లే.
    నాది స్త్రీ శరీరం. పురుషుడిలా బట్టలు వేసుకుంటాను. నా వాంఛ స్త్రీల పట్లే.

    నాది పురుష శరీరం. స్త్రీలా బట్టలు వేసుకుంటాను. నా వాంఛ స్త్రీల పట్లే.
    నాది స్త్రీ శరీరం. పురుషుడిలా బట్టలు వేసుకుంటాను. నా వాంఛ పురుషుల పట్లే.

    నాది పురుష శరీరం. పురుషుడిలానే బట్టలు వేసుకుంటాను. స్త్రీ పురుషులిద్దరి పట్లా నాకు వాంఛ ఉంది.
    నాది స్త్రీ శరీరం. స్త్రీలానే బట్టలు వేసుకుంటాను. స్త్రీ పురుషులిద్దరి పట్లా నాకు వాంఛ ఉంది.

    నాది పురుష శరీరం. పురుషుడిలానే బట్టలు వేసుకుంటాను. నా వాంఛ కూడా పురుషుడి పట్లే.
    నాది స్త్రీ శరీరం. స్త్రీలానే బట్టలు వేసుకుంటాను. నా వాంఛ కూడా స్త్రీల పట్లే.

    నాది పురుష శరీరం. పురుషుడిలానే బట్టలు వేసుకుంటాను. స్త్రీలను కోరుకుంటాను.
    నాది స్త్రీ శరీరం. స్త్రీలానే బట్టలు వేసుకుంటాను. నేను పురుషుల్ని కోరుకుంటాను……………..

    175.00
  • Zero Number One

    స్కూల్లో మధ్యాహ్నం భోజనం చేసే టైమైంది. పిల్లలందరూ ఒక పెద్ద హాల్లో కుచ్చోని తింటాన్నారు. అందరూ మాట్లాడుకుంట, జోకులేస్కుంట, నవ్వుకుంట తింటాన్నారు. భలే సందడిగా ఉంది హాలంతా. ఒక పిల్లోడు అందరికంటే లేటుగా ఆ హాల్లోకి వచ్చినాడు. అంతే, అందరూ సైలెంటైపోయినారు. అప్పటిదాకా ఉన్నే జోకులు, నవ్వులు యాటికి పోయినాయో! అందరూ చానా కోపంగా చూస్తాన్నారు ఆ పిల్లోని పక్క. ఉన్నెట్లుండి అందరూ గట్టిగట్టిగా అరిచేది మొదులు పెట్టినారు. ఆ పిల్లోనికి భయమైంది. ఒకతూరి వాల్లందరి తుక్కు చూసి వాళ్ళ మధ్యలో నుండే నడుచుకుంటా పోయి గోడ వార కుచ్చున్యాడు. వాళ్ళు అరిచేది మాత్రం ఆగల్యా. వాళ్ళందరూ ఏమని అరుస్తాన్నారో అర్థం కావడం లేదు గానీ, ఆ అరుపులు మాత్రం చానా ఎక్కువయినాయి. అవేం పట్టించుకోకుండా అన్నం తినేకి చూస్తాన్నాడు ఆ పిల్లోడు.

    అయినా చేతకావడం ల్యా. వాళ్ళ అరుపులు చెవుల్లో నుండి లోపలికి పోయి డబులు, త్రిబులు సౌండు చేస్తాన్నాయి. రెండు చేతులు చెవులకి అడ్డం పెట్టుకున్యాడు. అప్పటికే లోపలికి పొయినే అరుపులు లోపలంతా తిరుగుతున్నాయి. తలకాయి పేలిపోతాదేమో అన్నంత నొప్పి మొదలయింది. ఇంగ ఇట్ల కాదని క్యారీ బాక్సు ఆడే వదిలేసి లేసి ఒకసారి గట్టిగా అరిచి పరిగెత్తినాడు. పక్కన ఎవరున్నారు, దారిలో………………..

    150.00
  • Vayuputra Sapadam

    చెడు విజ్ర్రంభించింది

    ఇక దేవుడే నిలువరించాలి దాన్ని!

    శివ తన బలగాన్ని సమీకరించాడు. నాగా రాజధాని పంచవటీ చేరుకున్నాడు. చివరికి అసలు చెడు బయటబడింది. ఏ పేరు వింటే యోధానుయోధులు సైతం గడగడ వణుకుతారో…. ఆ నీలకంఠ… తన అసలు శత్రువుపై ధర్మయుద్ధానికి సిద్దమయ్యాడు!

    ఒకటి తర్వాత ఒకటిగా జరిగిన యుద్ద పరంపరలు భారతదేశాన్ని చిగురుటాకులా వణికించాయి. ఈ యుద్ధాలు భారత దేశాన్ని హస్తగతం చేసుకునేందుకు జరిగిన కుట్రలు! ఈ యుద్దాల్లో లక్షలాదిమంది మరణించారు. కానీ శివ వైఫల్యం చెందకూడదు! నిరశావహమైన పరిస్థితుల్లో ఉన్న శివ ఎంతో దైర్య సాహసాలతో, ఇప్పటిదాకా తనకు ఎలాంటి సహాయమూ అందించనివారి దగ్గరకు వెళ్తాడు: వారే వాయుపుత్రులు!

    మరి శివ విజయం సాధిస్తాడా? చెడుతో పోరాటం చేస్తున్న క్రమంలో శివగానీ, భారతదేశంగానీ, శివ అత్మగానీ ఎంతటి భారీమూల్యాలు చెల్లించుకోవలసిన వచ్చింది?

    ఆసక్తికరంగా అన్వేషిస్తున్న మీ ప్రశ్నలకి బెస్ట్ సెల్లింగ్ శివ త్రయం ముగింపు భాగమైన ఈ మూడవ పుస్తకంలో సమాధానాలు దొరుకుతాయి!

    ‘అమిష్, తూర్పు పాలో కోయిలో ఆయే మార్గంలోనే పయనిస్తున్నాడు’ – బిజినెస్ వరల్డ్

    ‘అద్బుతమైన వర్ణనాత్మక శైలి’ – శశి ధరూర్

    ‘భయంకరమైన యాక్షన్ ప్రతి పేజీని ఉత్కంఠభరితంగా చదివేలా చేస్తుంది’ – అనిల్ ధర్కర్

    325.00
  • Sita Mithila Yodha

    ఆమె మనకు అవసరమైన యోధురాలు,

    మనం నిరీక్షించిన దేవత,

    ఆమె ధర్మాన్ని కాపాడుతుంది, మనల్ని రక్షిస్తుంది,

    భారతదేశం, 3400 బి.సి.

    భారతదేశం విభేదాలు, విద్వేషం, పేదరికంతో అల్లాడుతోంది ప్రజలు పాలకులను ద్వేషిస్తున్నారు. స్వార్థపరులైన, అవినీతిపరులైన ఉన్నతవర్గాల వారిని అసహ్యించుకుంటున్నారు. చిన్న చిదుగు అంటుకుంటే సంక్షోభమే. విదేశీయులు ఈ విభేదాలను ఉపయోగించుకుంటున్నారు. లంక రాక్షసరాజు రావణుడు రోజురోజుకీ శక్తిమంతుడవుతూ దురదృష్టవంతమైన సప్తసింధులో తన కోరలను లోతుగా దింపుతున్నాడు.

    పవిత్ర భారతభూమికి రక్షకులుగా ఉన్న రెండు శక్తివంతమైన తెగలు ఇంక ఉపేక్షించి చాలు అనుకున్నాయి. రక్షకుడు అవసరం అని భావించాయి. అవి అన్వేషణ ఆరంభించాయి. ఎవరో పసిబిడ్డను పొలంలో అనాథగా వదిలి వేశారు. తోడేళ్ళ బారు నుంచి ఒక రాబందు ఆమెను కాపాడింది. అందరూ విస్మరించిన, శక్తిహీనమైన మిథిల రాజ్యపాలకుడు ఆమెను దత్తత తీసుకున్నాడు. ఈ బిడ్డ ఏదో సాధిస్తుందని ఎవరూ అనుకోలేదు. కాని వాళ్ళు పొరపాటు పడ్డారు. ఆమె సామాన్య బాలిక కాదు. ఆమె సీత.

    అమీష్ తాజా నవలతో మీ పౌరాణిక యాత్రను కొనసాగించండి: దత్తత తీసుకున్న అమ్మాయి చేసే ఉత్కంఠభరిత సాహసాలు చూడండి. ప్రధానమంత్రి అయింది. తరువాత దేవత అయింది. రామచంద్ర గ్రంథమాలలో ఇది రెండో పుస్తకం. మిమ్మల్ని వెనక్కి తీసుకెళుతుంది. ఎంత వెనక్కి అంటే ఆరంభానికి ముందేం జరిగిందో తెలుసుకొనేటంతగా. అమీష్ పౌరాణిక కల్పన గతాన్ని శోధించి భవిష్యతు అవకాశాలను ఒడిసిపడుతుంది.

    – దీపక్ చోప్రా

    350.00
  • Suputrika Praptirastu

    సుపుత్రికా ప్రాప్తిరస్తు

    “తిరుమల ఎందుకండీ”

    అతడేమీ మాట్లాలేదు. ఆమెవైపు తిరిగి నవ్వి వార్డ్ రోబ్ తెరచి ఆమె చీరలు రెండు, నాలుగు చుడీదార్ లు తీసి బెడ్ పై ఉంచాడు. అప్పటికే అక్కడ అతని కొన్ని బట్టలు ఉన్నాయి.

    “దేవుడు ఉండేచోటు కదండీ…” మాటలు పూర్తికాకముందే ఆమెను గాఢంగా కౌగిలించుకుంటూ పెదవుల్ని గట్టిగా చుంబించాడు. “అప్పుడే మొదలెట్టారా” అంది.

    “ఇందుగలడందులేడని సందేహము వలదు. లేనిచోటు వెదకదలచిన ముల్లోకములందూ దొరకదు” అన్నాడు పొయెటిగ్గా.

    మళ్లీ తనే “పాపం ఎలా అవుతుందోయ్. ముందు తయారవు. డ్రెస్ మార్చుకో. దీనికోసం దేవుడు లేని చోటు వెతికి పట్టుకోవాలంటే ఈ జన్మకు అది సాధ్యంకాదు” అన్నాడు.

    “మొండిఘటం…”అని సణుగుతూ, టవల్ భుజంపై వేసుకుని బాత్రూంలోదూరింది

    మొహం కడిగేందుకు బాత్రూంలోకి వెళ్లింది కానీ, చల్లటి నీళ్లు తగిలేసరికి స్నానం చేయాలని అనిపించింది. లో దుస్తులు మాత్రం ఉంచుకుని షవర్ ఆన్ చేసింది. స్నానం కాగానే టవలు తీసుకుంటూ కెవ్వున అరవబోయి, అంతలోనే తమాయించుకుని “ఏమిటిది?” అంది.

    భయపడుతున్నట్ల ఆమె భంగిమచూసి “అలవాటు కావాలి డార్లింగ్. బాత్రూంలో ఎంటరయినందుకే అలా అయితే ఎలా…” అని బుగ్గన ఓ చిటికెవేసి, మొహం కడుక్కుని బయటికెళ్లిపోయాడు.

    తను టవల్ చుట్టుకుని బాత్రూంలోంచి బయటకు వచ్చేసరికి అతను గదిలోలేడు. డ్రెస్ మార్చుకుంది. బెడ్ పై ఉంచిన బట్టల్ని లెదర్ బ్యాగ్ లో సర్దసాగింది. లోపలికొచ్చి అతనితో “బ్యాగు చాలడం లేదండీ” అంది……..

    200.00
  • Sachin Tendulkar- Playing It My Way

    సచిన్ టెండూల్కర్

    ప్లేయింగ్ ఇట్ మై వే – నా ఆత్మ కధ

    ఏ ఆత్మ కధా కూడా రచయిత జీవితంలో ప్రతీ వివరాన్ని ముందుంచలేదని నాకు అనిపించింది. అది సాధ్యం కాదు. ఎదో ఒక కారణం వల్ల రాయటానికి వీల్లేని వ్యక్తిగతమైన లేదా బహుశా సున్నితమైన అంశాలు ఉంటాయి. అయినా ఇప్పటి వరకు నేను నా కెరియర్ ని ఒక పూర్తి కధకు దగ్గరగా ఉండేలా చేయటానికి నేను శాయశక్తులా ప్రయత్నించాను. నేను వర్ణించిన చాలా సంఘటనలు క్రికెట్ అభిమానులకు తెలిసినవే కానీ నేను ఇది వరకు అందరి ముందు చెప్పని ఎన్నో విషయాల గురించి కూడా మాట్లాడడానికి నేను ప్రయత్నించాను. వాటిల్లో కొన్ని ఇబ్బంది కలిగించేవి కూడా ఉన్నాయి, పాటకులకు ఆసక్తి కలిగించేవి ఎన్నో దొరుకుతాయని నేను ఆశిస్తున్నాను.

    – సచిన్ టెండూల్కర్

    ముంబయిలో పుట్టిన సచిన్ టెండూల్కర్ 1989 లో 16 ఏళ్ల వయస్సులో పాకిస్థాన్ లో తొలిసారిగా తన టెస్ట్ ప్రారంభించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఆడిన అత్యంత అపురూపమైన, మనోరంజనం కలిగించే బ్యాట్స్ మన్ లలో ఒకరు, టెస్టులు మరియు అంతర్జాతీయ వన్డేలు రెండింటిలో కూడా వేరే ఇతర క్రీడాకారుడి కంటే ఆయన ఎక్కువ పరుగులు మరియు ఎక్కువ సెంచరీలు చేసి విజయం సాధించారు. ఆయన తన 17వ ఏట తోలి టెస్ట్ సెంచరీ చేశారు. 36వ ఏట ఆయన వన్డే డబుల్ సెంచరీ చేసిన తోలి క్రీడాకారుడుగా మారారు. 2012 లో తన 100వ అంతర్జాతీయ సెంచరీనీ సాధించారు. 2009 లో ఆయన భారత్ తో ప్రపంచ టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఉన్నత స్థానానికి చేరుకొని 2011 లో ప్రపంచ కప్పు గెలుచుకున్నారు. 2013 లో తన స్వస్థలం ముంబయి ప్రజల ముందు తన 200వ మరియు చివరి టెస్ట్ ఆడిన తర్వాత క్రికెట్ నుంచి నిష్క్రమించారు.

    495.00
  • Rathi Tayaree

    200.00
  • Rameshwaram Kaakulu By Patanjali Sastri

    పర్యావరణ వేత్త, కథకుడు తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారి పేరు లేకుండా ఉత్తమ తెలుగు సాహిత్యం ఎప్పుడు పూర్తి కాదు. ఈ పుస్తకం లోని కథల్లో శాస్త్రి గారు తన సమాంతర వాస్తవికత దృక్పథానికి ఒక తాత్విక కోణాన్ని జత చేసారు. ఈ తాత్విక కోణం అనేది ఇదివరకటి కథల్లో లీలగా ఉన్నా కూడా ఈ సంకలనం లోని కథల్లో అది మరింత స్పష్టంగా మనకు కనబడుతుంది. ఆ కారణం చేత ఇందులో కథలన్నీ ఓ మెట్టు పైనే ఉండడమే కాకుండా శాస్త్రిగారి భావజాలం లో వచ్చిన స్పష్టతకి అద్దం పడతాయి. అందుకే ఈ కథలు అన్ని ప్రపంచ ప్రఖ్యతి పొందిన కథల పక్కన పీఠం వేసుకుని కూర్చుంటాయి. In one word his stories are creative puzzles

    – తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి

    175.00
  • Lanka Yuddam By Amish

    ఇందులోని పాత్రలు,
    ముఖ్యమైన తెగల జాబితా
    (అకారాది క్రమంలో)

    అకంపనుడు: ఒక అక్రమ రవాణా వ్యాపారి, రావణుని సన్నిహిత సహాయకుడు అరిష్టనేమి: మలయపుత్రుల సైన్యాధ్యక్షుడు, విశ్వామిత్రుని కుడిభుజం

    అన్నపూర్ణా దేవి: మలయపుత్రుల రాజధానియైన అగస్యకూటంలో నివసించే ప్రసిద్ధ సంగీత విద్వాంసురాలు

    అశ్వపతి: భరతఖండానికి నైరుతి సరిహద్దురాజ్యమైన కేకేయ రాజ్యానికి రాజు, కైకేయికి తండ్రి, దశరధునికి విశ్వాసపాత్రుడైన సహచరుడు

    భరతుడు: రాముని సవతి సోదరుడు; దశరధుడు, కైకేయిల పుత్రుడు

    దశరథుడు: కోశల చక్రవర్తి, సప్తసింధు సామ్రాజ్యాధినేత, రామలక్ష్మణ, భరత, శత్రుఘ్నుల

    హనుమంతుడు: ఒక నాగా, వాయుపుత్ర తెగ సభ్యుడు

    ఇంద్రజిత్తు: రావణుడు, మండోదరిల పుత్రుడు

    జనకుడు: మిథిలకు రాజు, సీతకు తండ్రి

    జటాయువు: మలయపుత్ర తెగలో ఒక దళపతి, సీతారాములు నాగా మిత్రుడు.

    కైకసి: రుషి విశ్రావసుని మొదటి భార్య, రావణ కుంభకర్ణుల తల్లి

    కన్యాకుమారి: కన్యారూపంలోని దేవత అని అర్థం. ప్రత్యేకంగా ఎంపిక చేసిన బాలికల శరీరంలో మాతృదేవత (అమ్మతల్లి) తాత్కాలికంగా నివసిస్తుందని విశ్వాసం. అలాంటి బాలికలను సజీవదేవతా మూర్తులుగా అర్చించేవారు

    ఖర: లంకాసైన్యంలో ఒక దళపతి, సమీచి ప్రియుడు……………..

    499.00