-
-
Avunu Nenu Gelavalanukuntunnanu Kani Ela?
₹120.00సంతోషంగా ఉండండి (Be Happy)
ఎప్పుడు సంతోషంగా ఉండడం మన హక్కు, సంతోషమే సగం బలం. కానీ, ఎక్కువ మంది ఈ విషయం గుర్తించక ఎప్పుడు ఏదో నిరాశతో, బాధతో బ్రతుకుతూ ఉంటారు. బాధపడటం అనేది Negative Energy. దీని వలన మనకు అన్ని Negative ఫలితాలు ఉంటాయి కానీ Postive ఫలితాలు ఉండవు. ‘మనం బాధతో ఉంటే దానిని బ్రతకడం అంటారు. సంతోషంగా ఉంటే దానిని జీవించడం అంటారు. సంతోషం మరియు నవ్వుతో యవ్వనం తిరిగి వస్తుంది. ”
–షేక్స్పియర్
ఆనందానికి FORMULA :-
ఆనందం = ఆరోగ్యం +సంపద+మంచి మానవ సంబంధాలు
ఆరోగ్యం = వ్యాయామం + మంచి తిండి + సరిపడ నిద్ర
సమస్యలు అందరికీ ఉంటాయి :-
ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏదో ఒక సమస్య తప్పకుండా ఉంటుంది. ఆఖరికి సంపన్నుడు ముఖేష్ అంబానీ కైనా ఏదో ఒక సమస్య ఉంటుంది. చిన్న వాళ్ళకు చిన్న సమస్యలు ఉంటాయి. పెద్దవాళ్ళకు పెద్ద సమస్యలు ఉంటాయి. కానీ, సమస్యలు అనేవి Common
సమీపంలో ఏదో భవనం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నేను ప్రతిరోజూ సాయంత్రం వాకింగ్ చేస్తూ అక్కడ కాసేపు కూర్చుంటాను. చాలా మంది పేదకార్మికులు అక్కడ తాత్కాలికంగా గుడిసెలు వేసుకుని నివసిస్తూ పనిచేస్తుంటారు. వారి పిల్లలు ఒకరి చొక్కా మరొకరు పట్టుకొని “రైలు బండి రైలు” అనే ఆట ఆడుతుంటారు. ఎవరైనా ఒకరు ఇంజన్ అవుతారు, మిగిలినవారు బోగీలు అవుతారు. ప్రతిరోజు ఈ పిల్లలు మలుపులు తిరుగుతూ కేరింతలు కొడుతూ ఆడుతూ ఉండే ఈ ఆటను చూడడం నాకు ఇష్టమైన దినచర్యగా మారిపోయింది.
0 చాలా రోజులు వాళ్ళ ఆటలు గమనిస్తున్నాను. ఇంజన్గా ఉన్న పిల్లవాడు మరో రోజు బోగిగా, బోగీగా ఉన్న పిల్లలు ఇంజన్ గా ఇలా మారుతూనే ఉన్నారు కానీ, ఒక చిన్న బాలుడు, సగం నిక్కరు మాత్రమే ధరించి తన చేతిలో ఒక చిన్న ఆకుపచ్చ వస్త్రాన్ని పట్టుకుని రోజువారీ గార్డుగానే ఉంటున్నాడు………….
-
-
Chivari Gudesa
₹120.00చివరి గుడిసె
యదార్ధమైన చేనులో ఎలుకల నుండి కాపాడటానికి మనణియానికి ఏ యానాది అవసరమయ్యాడో అదే యానాది బైరాగి ఆత్మిక క్షేత్రాన్ని కామక్రోధాలనే ఎలుకలు పది కొల్ల గొట్టటానికి కారణమయ్యాడు. వాస్తవ సన్నివేశము, ప్రతీకా ఇంత అద్బుతంగా కలగలిసిన రచనలు ఎంతో అరుదుగా కనిపిస్తాయి.
– వాడ్రేవు చినవీరభద్రుడు.
యానాది కులవృతి చేసుకుని బతికిన పాత తరానికి మన్నుగాడు చివరి ప్రతినిధి అయితే, పొట్టకూటికి మట్టి పని చేసుకొని బతికే కొత్త తరానికి చిన్నోడు మొదటి ప్రతినిధి అవుతాడు. అయితే కులం చిన్నోడిని అక్కడా వెంటాడుతుంది.
– అంబటి సురేంద్ర రాజు -
Kathala Godari
₹120.00వడ్డించిన విస్తరి మాదిరి జీవితాలను ఒడిదుడుకులకు అతీతంగా గడిపేవారు ఎప్పటికీ కథావస్తువులు కాజాలరు. సామాన్యుల మధ్యకి – అందునా – ఒడిదుడుకులెరిగిన వారి మధ్యకు, రచయిత వెళ్ళాలి. అప్పుడే మనుషుల జీవితాలను పరిపాలించే పలు అంశాలు బయటకు వస్తాయి. దాట్ల దేవదానం రాజు, గోదావరి నది మీద యానాం తీరానికి ప్రయాణిస్తూ రకరకాల మనుషుల్ని పలకరిస్తూ వారి అంతరంగాల్ని శోధిస్తూ వ్రాసిన జీవవంతమైన కథలివి.
ఈ గుచ్చంలో కథలన్నిటికి కాన్వాస్ గోదావరే. పొడుగు వెడల్పుతో బాటు ఎత్తు కలిగిన కాన్వాస్ గోదావరి. దాట్ల దేవదానం రాజు ఒక్కో అలని చుట్ట చుట్టకు ఇంటికి తీసుకెళ్ళి, మనసులో పరిచి ఆరబెట్టి దాని మీద రాసిన కథలివి. పైగా కథాశీర్షికల్ని మిత్రులు సూచించగా వాటితో ఇతివృత్తాలు అల్లుకున్నారు. చక్కని పూరణతో అందించి, సరికొత్త అవధానానికి అంటూ తొక్కారు. గోదారి గాలి పీలుస్తూ, గోదారి నీరు సేవిస్తూ, గోదాట్లో స్నానిస్తూ, గోదార్ని జపించే వారికి ఇదేమీ బ్రహ్మవిద్య కాదు. -
-
-
-
-
-
-
-
-
-
-
-
Sri Devi Bhagavatam By D Srinivasa Dikshitulu
₹126.00వేదవ్యాస మహర్షి శ్రీ దేవీ భాగవతమ్
ప్రథమ స్కంధం
వినండి… చెబుతాను!
బ్రహ్మదేవుని ఆదేశానుసారం నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులు యజ్ఞయాగాలు చేస్తూ కాలం గడుపుతున్నారు. ఒకనాడు వేదవ్యాసుని శిష్యుడు, సకల పురాణవేత్త అయిన సూత మహాముని ఆ పవిత్ర ప్రదేశానికి వచ్చాడు.
మహర్షులందరూ ఆ మహాత్మునికి భక్తిశ్రద్ధలతో అతిథిసత్కారాలు చేశారు. సూతుడు దర్భలతో చేసిన చాప మీద కూర్చున్నాడు.
“సూత మహామునీ ! నువ్వు పురాణాలన్నీ చదివి గురువు అనుగ్రహంతో వాటిలోని రహస్యాలన్నింటినీ చక్కగా ఆకళింపు చేసుకున్నావు. అందుకే నువ్వు చెప్పే పురాణకథల్ని వింటుంటే శ్రోతల రోమాలు నిక్కపొడుచుకుంటాయి. అందరూ నిన్ను ఆదరంగా ‘రోమహర్షణుడు’ అని పిలవటానికి కారణం అదే.
మహాత్మా! ఇప్పుడు నువ్వు ఇక్కడికి రావటం మా పూర్వజన్మ పుణ్యఫలంగా భావిస్తున్నాం. కలియుగ కల్మషాలన్నింటినీ కడిగేసే శ్రీ దేవీ భాగవతాన్ని నువ్వు మాకు చెబితే వినాలని కుతూహలంగా ఉంది” అన్నారు శౌనకాది మహర్షులు……………….
-
Mahabharatham By D Srinivasa Dikshitulu
₹126.00వేదవ్యాస మహర్షి
మహాభారతమ్
ఆదిపర్వం
శౌనక మహర్షి నైమిశారణ్యంలో సత్ర యాగం చేస్తున్నాడు. ఆ యాగాన్ని చూడటానికి చాలామంది మహర్షులు వచ్చారు. సూత వంశానికి చెందిన ఉగ్రశ్రవుడు కూడా వచ్చాడు.
పురాణ కథల్ని వీనుల విందుగా చెప్పటంలో సూతుడు దిట్ట. నైమిశంలోని మహర్షులు సూతునికి అతిథి సత్కారాలు చేశారు. దర్భలతో నేసిన చాపమీద సూతుడు కూర్చున్నాడు. శౌనకుడు మొదలైన మహర్షులు ఆయన చుట్టూ చేరారు. ఎక్కడి నుంచి వస్తున్నావని సూతుని అడిగారు.
“మహర్షులారా ! పరీక్షిత్తు కుమారుడు జనమేజయ మహారాజు. ఆయన చేసిన సర్ప యాగానికి వెళ్ళి వస్తున్నాను. అక్కడ వ్యాసుడు రాసిన భారతంలోని కథల్ని వైశంపాయనుడు చెప్పగా విన్నాను” అన్నాడు సూత మహాముని.
“అయితే… ఆ మహాభారత కథనే మాకూ వినిపించు” అన్నారు మహర్షులు…………………..
-
Oka Hijra Atma Katha
₹130.00ఈ పుస్తకాన్ని పాఠకులను పట్టి చదివించే శక్తి, వాళ్ళ ఆలోచనను ప్రేరేపించే శక్తి వున్నది. అట్లాగే విస్మయ భీతిని కూడా కలిగిస్తుంది. పుస్తకం అంతటా రేవతి తను ఎదుర్కొన్న భయానక సంఘటనల గురించి చెబుతుంది కానీ ఎవరి సానుభూతిని కోరదు. ఆమె అడిగేదోక్కటే. హిజ్రాలను అందరి మానవుల వలె కోరికలూ ఆశలూ వున్న తోటి మనుషులుగా చూడమని. ఒక హిజ్రాగా తన వ్యక్తిగత విషయాలను నిర్భయంగా నిస్సంకోచంగా చెప్పిన తీరు అభినందనీయమేకాక హృదయానికి హత్తుకునే విధంగా కూడా వుంది.
తన లింగ మార్పిడి శస్త్రచికిత్స గురించైనా, పోలీసులు పెట్టిన హింస గురించైనా, తన క్లయింట్స్ గురించైనా! జెందర్ గురించీ, పురుషాధిక్యత గురించి ఆమె చేసిన విమర్శలు, వ్యాఖ్యలు చాలా స్పష్టంగా శక్తివంతంగా వుండి స్త్రీ పురుషులతో పాటు మూడవ లింగాన్ని కూడా మనం మానవీయంగా అర్థం చేసుకునే విధంగా కృషి చెయ్యాలనే అవగాహనను కలిగిస్తుంది.
-యోగిందర్ సికండ్,కౌంటర్ కరెంట్స్

















































