-
-
-
-
Hamsa Vimshati Vignana Sarvasvamu By Dr Gunji Venkataratnam
₹500.00హంసవింశతి: కావ్యము- కవి
కథా కావ్యము
సంస్కృత, ప్రాకృత వాఙ్మయ చరిత్రను పరిశీలిస్తే దాదాపు రెండు వేల సంవత్సరాలకు పూర్వమే కథా కావ్యాలు వెలిసియున్నట్లు తెలుస్తున్నది. గుణాఢ్యుడు పైశాచీ ప్రాకృతంలో రచించిన బృహత్కథ రెండు వేల సంవత్సరాల నాటిదని పండితుల అభిప్రాయం. బృహత్కథ ఆధారంగా సోమదేవుడు కథా సరిత్సాగరాన్ని, క్షేమేంద్రుడు బృహత్కథా మంజరిని రచించి యున్నారు. ఇవి గాక పంచతంత్ర హితోపదేశాలు, బుద్ధుని జాతక కథలు, కాదంబరి, దశకుమార చరిత్ర మొదలైన కథా కావ్యాలెన్నో, ఏనాడో సంస్కృత ప్రాకృతాలందు వెలసి యున్నవి. ‘కొన్ని పద్యకథా కావ్యాలు కాగా, మరికొన్ని వచన రచనలు.
కానీ ప్రాచీన కాలమున తెలుగులో వచన కథా కావ్యాలు కనిపించుట లేదు. దండి దశకుమార చరిత్రను సంస్కృత వచనంలో వ్రాసి యుండగ, దానినాంధ్రీకరించిన కేతన తెలుగులో పద్య కథా కావ్యంగా తీర్చి దిద్దారు. తిక్కన ఉత్తర రామాయణాన్ని నిర్వచనంగా వ్రాశాడు. కథాకావ్యాలే గాక వ్యాకరణాలు, నిఘంటువులు, శాస్త్ర గ్రంథాలు మొదలైనవన్నీ ఆ కాలంలో పద్య రూపంలోనే రచించుట గమనించ దగ్గ విషయం. ఇది కారణంగా మన ప్రాచీన కథాకావ్యాలన్ని పద్య రూపంలోనే వెలువడి ఉన్నాయి.
తెలుగు సాహిత్యం దాదాపు వెయ్యేండ్లుగా సాగుతూ వస్తున్నది. ఇందులో ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు, ప్రబంధాలు, నాటకాలు మొదలైన సాహిత్య ప్రక్రియలెన్నో వెలసి ఉన్నాయి. వాటిలో కథా కావ్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ కథా కావ్యాల్లో కొన్ని అనువాదాలు, అనుకరణలు కాగా మరికొన్ని స్వతంత్ర రచనలై ఉన్నాయి.
కేతన కృతమగు దశకుమార చరిత్ర, వేంకటనాథుడు రచించిన పంచతంత్రం (దీనినే నారాయణకవి, భావయ కవి వేర్వేరుగా రచించి యున్నారు). కొఱవి గోపరాజు నిర్మించిన సింహాసన ద్వాత్రింశిక, మంచన వ్రాసిన కేయూర బాహు చరిత్ర, వెన్నెలకంటి అన్నయామాత్యుని షోడశకుమార చరిత్ర, జక్కన కృతమగు విక్రమార్కు చరిత్ర, అనంతామాత్యుని భోజరాజీయము, కూచిరాజు ఎఱ్ఱన విరచించిన సకల కథా నిధానము, పుత్తేటి రామభద్రుని కథాసార సంగ్రహము, చింతలపూడి ఎల్లనార్యుని (రాధా మాధవకవి) విష్ణుమాయా నాటకము, పాలవేకరి కదిరీపతి రచించిన శుకసప్తతి, అయ్యలరాజు నారాయణా మాత్యుని హంస వింశతి మొదలైనవి తెలుగు పద్య కథా కావ్యాల్లో పేర్కొనదగినవి. అందులోను శుకసప్తతి, హంస వింశతి జారశృంగార కథలు వస్తువుగా ఒకే కోవకు చెందిన శృంగార ప్రబంధాలుగా వన్నెకెక్కినవి. శుక సప్తతి, నాటి సమాజానికి నిలువుటద్దము నెత్తగా, హంసవింశతి. నాటి సమాజంలోని శాస్త్రాద్యనేక విషయాలు ప్రస్తావించి విజ్ఞాన సర్వస్వ లక్షణాలు గల కథా ప్రబంధంగా పరిగణింపబడుచున్నది………………
-
-
Sathavasamthala Ghantasala
₹500.00శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్ర మాధుర్యం యావదాంధ్రలోకాన్నీ ఆనంద డోలికల్లో ఓలలాడించింది. వేంకటేశ్వరరావు గారి గానసుధా మాధుర్యాన్ని “కర్ణపుటంబులారగ్రోలిన” అశేషాంద్రజనానీకంలో ఒకణ్నిగా నా హృదయానందాన్ని వారి కళావైదుష్యానికి నివాళిగా సమర్పిస్తున్నాను.
-శ్రీశ్రీ
అతడు కోట్ల తెలుగుల ఎద
అంచుల ఊగిన ఉయాల
తీయని గాంధర్వ హేల
గాయకమణి ఘంటసాల– డాక్టర్ సి. నారాయణ రెడ్డి
ఘంటసాలవారి కమనీయ కంఠాన
పలుకనట్టి రాగ భావమేది!
ఘంటసాలవారి గాన ధారలలోన
తడియనట్టి తెలుగు టెడద యేది!– దాశరధి
చలన చిత్ర శ్రీ విశాల ఫాలమ్ముపై
తళతళ మెరయు గంధర్వతార
తమిళ కర్ణాట కేరాళాంధ్రముల యందు
వేలకొలది గీతమ్ముల నాలపించి
ఖ్యాతి గన్నాడు చాల! సంగీతలక్ష్మి
కంఠకర్తారమాల! మా “ఘంటసాల!”– కరుణశ్రీ
-
-
-
Adugaduguna Tirugubatu
₹499.00నేనీ పుస్తకాన్ని ఎందుకు రాయాల్సి వచ్చింది?
నన్ను నేను పరామర్శించుకుంటూ.. పరిసర ప్రపంచంతో నాకున్న సంబంధాలేమిటి, అందులో నా స్థానం ఎక్కడని ప్రశ్నించుకుంటూ చేసిన అన్వేషణ ఫలితమే ఈ పుస్తకం. నేను కేరళ మూలాలున్న ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. అయితే యాభై ఏళ్లకు పైగా నా కార్యక్షేత్రమంతా హైదరాబాద్ నగరమూ, కొండలూ గుట్టలతో నిండిన ఆ చుట్టుపక్కల ప్రాంతాలే. పాశ్చాత్య దేశాల్లో ‘బ్రా’లను తగలబెట్టడాన్ని ఓ ర్యాడికల్ చర్యగా పరిగణిస్తుంటే – పధ్నాలుగేళ్ల వయసులో బ్రా ధరించినందుకు మా కుటుంబమే నన్నో నీతిమాలినదానిగా చూసింది. నా యవ్వనపు రోజులన్నీ చిన్న చిన్న తిరుగుబాట్లతో, గణితం మీద వ్యామోహంతో గడిచిపోయాయి. 1970లలో నేను నక్సలైట్ ఉద్యమంవైపు మొగ్గాను, ఎమర్జెన్సీ కాలంలో అజ్ఞాతంలోకి వెళ్లాను. ఇదంతా చూసి, నాకెవరో ‘బ్రెయిన్ వాష్’ చేశారని అనుకున్నారు నా తల్లిదండ్రులు. నన్ను బలవంతంగా మద్రాసుకు తరలించి, ఆ బ్రెయిన్ వాష్న ‘రివర్స్’ చేయించటం కోసం నాకు కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇప్పించారు. దానివల్ల నా జ్ఞాపకశక్తి చెదిరి పోయింది. ఎంతగా అంటే- స్నేహితులు నానా కష్టాలూ పడి నన్ను మద్రాసు నుంచి తప్పించి, హైదరాబాద్కు తీసుకువచ్చిన తర్వాత.. నేను ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తినే గుర్తుపట్టలేకపోయాను. మానసికంగా అంతా అయోమయమైపోయింది. ఎమర్జెన్సీ కాలంలో అరెస్టులను తప్పించుకోడానికి నేనూ, నా భర్త సిరిల్ రెడ్డి ఉత్తర భారతదేశానికి వెళ్లిపోయి, ఘజియాబాద్లో బాల్మీకీల మధ్య జీవించటం ఆరంభించాం. అక్కడ వాళ్లకి ఇంగ్లిష్ నేర్పించటం వంటి రకరకాల పనులు చేశాం. ఆ కాలంలో నాకు తరచూ ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుండేది. 1980లో మేం హైదరాబాద్కు తిరిగి వచ్చాంగానీ ఇక్కడ మాకోసం ఎదురు చూసే కుటుంబంగానీ, పార్టీ గానీ ఏదీ లేదు. అయినప్పటికీ ఈ నగరమే మా ఇల్లు అయ్యింది. స్నేహితుల సహాయంతో మేం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ (హెచీబీటీ)ని నెలకొల్పాం. వామపక్షవాదులు, అంబేడ్కరిస్టులతో ఎక్కువగా కలసి పనిచేస్తూ, తక్కువ ధరలకే పుస్తకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రచురణ…………
-
Lanka Yuddam By Amish
₹499.00ఇందులోని పాత్రలు,
ముఖ్యమైన తెగల జాబితా
(అకారాది క్రమంలో)అకంపనుడు: ఒక అక్రమ రవాణా వ్యాపారి, రావణుని సన్నిహిత సహాయకుడు అరిష్టనేమి: మలయపుత్రుల సైన్యాధ్యక్షుడు, విశ్వామిత్రుని కుడిభుజం
అన్నపూర్ణా దేవి: మలయపుత్రుల రాజధానియైన అగస్యకూటంలో నివసించే ప్రసిద్ధ సంగీత విద్వాంసురాలు
అశ్వపతి: భరతఖండానికి నైరుతి సరిహద్దురాజ్యమైన కేకేయ రాజ్యానికి రాజు, కైకేయికి తండ్రి, దశరధునికి విశ్వాసపాత్రుడైన సహచరుడు
భరతుడు: రాముని సవతి సోదరుడు; దశరధుడు, కైకేయిల పుత్రుడు
దశరథుడు: కోశల చక్రవర్తి, సప్తసింధు సామ్రాజ్యాధినేత, రామలక్ష్మణ, భరత, శత్రుఘ్నుల
హనుమంతుడు: ఒక నాగా, వాయుపుత్ర తెగ సభ్యుడు
ఇంద్రజిత్తు: రావణుడు, మండోదరిల పుత్రుడు
జనకుడు: మిథిలకు రాజు, సీతకు తండ్రి
జటాయువు: మలయపుత్ర తెగలో ఒక దళపతి, సీతారాములు నాగా మిత్రుడు.
కైకసి: రుషి విశ్రావసుని మొదటి భార్య, రావణ కుంభకర్ణుల తల్లి
కన్యాకుమారి: కన్యారూపంలోని దేవత అని అర్థం. ప్రత్యేకంగా ఎంపిక చేసిన బాలికల శరీరంలో మాతృదేవత (అమ్మతల్లి) తాత్కాలికంగా నివసిస్తుందని విశ్వాసం. అలాంటి బాలికలను సజీవదేవతా మూర్తులుగా అర్చించేవారు
ఖర: లంకాసైన్యంలో ఒక దళపతి, సమీచి ప్రియుడు……………..
-
-
-
-
-
Ivee Mana Moolaalu
₹450.00సాహసం, కానీ ఎంతో అవసరం
కల్లూరి భాస్కరం ప్రసిద్ధ పాత్రికేయులని అందరికీ తెలుసు. కాని 1980 తర్వాత తెలుగు కవిత్వంలో వచ్చిన మార్పుని ముందే పసిగట్టిన కవి అని చాలామందికి తెలియకపోవచ్చు. ‘మౌనం నా సందేశం'(1980) పేరిట ఆయన వెలువరించిన కవితాసంపుటి సమకాలిక తెలుగు కవిత్వంలో ఒక వేకువ పాట.
ఆయన చేయి తిరిగిన అనువాదకుడని కూడా కొందరికి తెలియకపోవచ్చు. పి.వి. నరసింహారావుగారి ‘ఇన్సైడర్’కు ‘లోపల మనిషి'(2002) పేరుతో ఆయన చేసిన తెలుగు అనువాదం ప్రశస్తమైన కృషి. అలాగే రామ్మోహన్ గాంధీ రచన ‘మోహన్ దాస్’కు చేసిన అనువాదం(2011) కూడా ప్రశంసనీయమైన పుస్తకం. ఆయన రాసిన ‘కౌంటర్ వ్యూ’ చదివినవాళ్ళకి ఆయన సిద్ధహస్తుడైన కాలమిస్టు అనీ, ‘వేయిపడగలు నేడు చదివితే’ చదివినవాళ్ళకి ఎంతో ప్రతిభ కలిగిన సాహిత్య విమర్శకుడనీ తెలుస్తుంది. తెలుగు కవిత్వంలో కాలికస్పృహ పేరిట ఆయన చేసిన ప్రతిపాదన ఎంతో మౌలికమైనదని చేరాలాంటి వాడే ప్రస్తుతించాడు. ఇక ‘మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే'(2019) పేరిట ఆయన వెలువరించిన ఉద్గ్రంథం ఆయన్ని సమకాలిక తెలుగు జిజ్ఞాసువుల్లో, పరిశోధకుల్లో అగ్రశ్రేణిలో నిలబెట్టింది.
ఈ బృహధ్రంథాలన్నీ ఒక ఎత్తూ, ఇప్పుడు ‘ఇవీ మన మూలాలు’ పేరిట మీ చేతుల్లో ఉన్న ఈ పుస్తకం ఒక ఎత్తు. ఇది ఒక మల్టి-డిసిప్లినరి అధ్యయనం.
—-ఇవీ మన మూలాలు 7
-
-
Tejo Tungabhadra By Vasudendra , Ranganadha Ramachandrarao
₹425.00అర్ధరాత్రి సమయంలో తేజోనది ప్రవాహించే సవ్వడి తప్ప ఇతర సవ్వడులు లిస్బన్ నగరంలో అంతగా వినిపించవు. కొంచెం చెవులు రిక్కించి వింటే దూరంలో సముద్రపు ఘోష మాత్రం అప్పుడప్పుడు వినిపిస్తుంది. మౌనసరోవరంలో రాయి విసిరినట్టు గంటకొకసారి తప్పనిసరిగా అంతఃపురం గంట సమయం సూచించటానికి చప్పుడు చేస్తుంది. వయసుదాటినవారు ఆ గంట చప్పుడుకు పక్కకు దొర్లుతారు. పిన్నవాళ్ళకు మెలకువ కూడా రాదు. సంవత్సరం నిండిన పసిబిడ్డలు ఒక్కోసారి ఆకలితో మేల్కొని ఏడుస్తారు. తల్లి స్తనం దొరకగానే మిన్నకుండిపోతారు. అంతఃపురంలోని కొన్ని కాగడాలు తప్ప వీధి దీపాలు ఎప్పుడో ఆరిపోయివుంటాయి.
అదొక వానాకాలపు రోజు. సాయంత్రమంతా వాన కురిసి, మొత్తం నగరాన్నంతా తడిపింది. ఆ వర్షానికి బయటికెక్కడికీ వెళ్ళలేని జనం భోజనం చేసి, పీకలదాకా వైన్ తాగి, తొందరగా నిద్రలోకి జారిపోయారు. అంతఃపురం గంట పన్నెండుసార్లు చప్పుడు చేసి ఇంకా పదిహేను నిముషాలు కూడా కాలేదు. ఆ సమయంలో అంతఃపురం వంటింటి కట్టడం వెనుక భాగం నుంచి, ముఖానికి ముసుగు వేసుకున్న ఒక ఆకారం పిల్లిలా అడుగులు వేస్తూ బయటికి వచ్చింది. ఆ ఆకారం అటూ ఇటూ చూస్తూ, ఎవరూ గమనించటం లేదని నిర్ధారించుకుంటూ అంతఃపురం ప్రహరీగోడవైపుకు నడవసాగింది. పొడవాటి గుడ్డలో ఏదో మూట కట్టుకుని, దాన్ని నడుముకు చుట్టుకుంది. అప్పుడప్పుడు దాన్ని ముట్టి చూసుకుంటూ………………..
-
Panchadara Jivana Saili Vyadhulannitiki Mulam
₹400.0018 , 19 శతాబ్దాల్లో పలువురు వైద్యులు పంచదార వల్ల బరువు పెరుగుతున్నట్లు స్పష్టంగా గుర్తించారు. ఒక దశలో మహిళలు లావు అవుతామన్న భయంతో పంచదారను పక్కన పెట్టారు. 1825 “ఫిజియాలజి అఫ్ టెస్ట్” పుస్తకం రాసిన సావరిన్ పిండితో చేసిన పదార్ధాలు, బ్రేడ్ ల వల్లనే ఊబకాయం వస్తున్నట్లు రాశాడు.
ఒక తరం నుండి మరో తరానికి పంచదార లేదా తీపి పదార్ధాలు తినడం పెరిగే కొద్దీ తర్వాత తరాల వాళ్ళలో ఊబకాయం, మధుమేహ సమస్యలు వచ్చి ఆయుర్ధాయం తగ్గి, అర్ధాంతరంగా చనిపోతున్నట్లు అర్ధమైంది.
సిగరెట్లు, తాగుతూ “మానివేసి మనం జీవించగలుగుతామా” అని భయపడతారు. ఒకసారి మానేశాక “ఇంతకాలం ఎందుకు తాగామా” అని బాధపడడం మనకు తెలుసు. పంచదార విషయం కూడా ఇంతేనంటాడు గ్యారీటాబ్స్. ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటే ఈ పంచదార వ్యసనం నుండి బయటపడడం కష్టం కాదు.
-
Prachina Ayurveda Arogya Rahasyalu
₹400.00మన భారతదేశంలో అత్యంత పవిత్రమైనవి వేదాలు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అని ఇవి నాలుగు. వీటిలో చివరిదైన అధర్వణ వేదం మిగిలిన మూడు వేదాలకన్నా ఒక ప్రత్యేకతను విశిష్టతను సంతరించుకుంది. ఈ అధర్వణవేదంలో ఎన్నో రకాల ఔషధులు వాటి ఉపయోగాలు, వివిధ రకాల రోగాలను నివారించే మంత్ర, తంత్ర, మూలికల విజ్ఞానం పొందుపరచబడింది. ఆయుర్వేదం అనేది ఈ అధర్వణ వేదంలో అంతర్గతంగా చెప్పబడిందే. షడ్డర్శనాలైన సాఖ్యం, యోగం, న్యాయం, వైశేషికం, పుర్వమీమాంస, ఉత్తరమీమాంస మరియు జ్యోతిషం, వంటి శాస్త్ర గ్రంథాల మీద ఆయుర్వేదం ఆధారపడి వుందని పండితులు చెప్తారు. దేవవైద్యుడైన ధన్వంతరి ఆయుర్వేద విజ్ఞానానికి మూలపురుషుడుగా పూజించబడుతున్నాడు.
శరీరం, ఇంద్రియాలు, ఆత్మ కలసి ఉండటమే ఆయువు. ఈ ఆయువును పొందటం దీని గురించి తెలుసుకోవటం అనే దాన్నే ఆయుర్వేదం అంటారు. ఈ ఆయుర్వేదంలో శరీరతత్త్వాలు, ఋతుచర్యలు, రోగ నిర్ధారణా పద్ధతులు, రోగాలను నివారించే వివిధ రకాల మూలికా చికిత్సలు, శాస్త్ర చికిత్సలు వంటి ఎన్నో విశేషాలు పొందుపరచబడ్డాయి ఇంత గొప్పదైన ఆయుర్వేదాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకువచ్చిన మహా వైద్యులు ఎందరో వున్నారు.
– డా. జయంతి చక్రవర్తి
-
-
















































