-
Enduku Tho Modalu
₹399.00ఉపోద్ఘాతం
‘ఎందుకు’ లో దాగి ఉన్న శక్తి
నా జీవితంలో అవసరమైన సమయంలో సరిగ్గా ఈ ‘ఎందుకు’ ఎదురయింది. అది అధ్యయనంలోనో మానసిక క్షేత్రంలోనో జరిగిన పరిశోధన కాదు. నేను చేస్తున్న పనిమీద నాకు ఆసక్తి నశించింది. నా చుట్టూ చీకటి అలుముకున్నది. నేను చేసే పనిలోనూ, నా ఉద్యోగంలోనూ ఏ లోపమూ లేదు. ఆ పనిచేయటంలో ఆనందాన్ని కోల్పోయాను. బయటికి కనిపించే పరిస్థితులు చూస్తే నేను ఆనందంగానే ఉన్నానని చెప్పాలి. నా జీతం బాగున్నది. నా ఖాతాదారులందరూ చాలా మంచివాళ్ళు. కానీ అందులో నాకు ఆనందము. తృప్తి కలగటంలేదు. ఒక మంచి ఉద్యోగం చేస్తున్న సంతృప్తి, అనుభూతి నాకు కలగటం లేదు. పనిపట్ల అనురక్తి, పాశము నాలో మరొకసారి కళ్ళు తెరవాలి.
ఈ ఎందుకు కనుక్కున్న తర్వాత ఈ ప్రపంచం పట్ల నా దృక్పధం పూర్తిగా మారిపోయింది. ‘ఎందుకు’ కనుక్కున్న తర్వాత నా అనురక్తి. పాశము ఎప్పటికంటే ఎన్నోరెట్లు పెరిగాయి. అది అతి సరళం, శక్తివంతం, ఆచరణాత్మకం కూడా. కనుకనే వెంటనే నా స్నేహితులందరికీ చెప్పేశాను. అంతేగదా మరి! విలువైన విషయం ఏదైనా తెలియగానే మన సన్నిహితులతో చెప్పుకుంటాం. ఆ ఉత్తేజంతో నా మిత్రుల జీవితాలే మారిపోసాగాయి, ఆ కారణంగా నా మిత్రులందరూ వచ్చి ఆ రహస్యాన్ని తమ సన్నిహితులందరికీ చెప్పమని అడిగారు. అలా ఆ భావన విస్తరించసాగింది………….
-
Adugaduguna Tirugubatu
₹499.00నేనీ పుస్తకాన్ని ఎందుకు రాయాల్సి వచ్చింది?
నన్ను నేను పరామర్శించుకుంటూ.. పరిసర ప్రపంచంతో నాకున్న సంబంధాలేమిటి, అందులో నా స్థానం ఎక్కడని ప్రశ్నించుకుంటూ చేసిన అన్వేషణ ఫలితమే ఈ పుస్తకం. నేను కేరళ మూలాలున్న ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. అయితే యాభై ఏళ్లకు పైగా నా కార్యక్షేత్రమంతా హైదరాబాద్ నగరమూ, కొండలూ గుట్టలతో నిండిన ఆ చుట్టుపక్కల ప్రాంతాలే. పాశ్చాత్య దేశాల్లో ‘బ్రా’లను తగలబెట్టడాన్ని ఓ ర్యాడికల్ చర్యగా పరిగణిస్తుంటే – పధ్నాలుగేళ్ల వయసులో బ్రా ధరించినందుకు మా కుటుంబమే నన్నో నీతిమాలినదానిగా చూసింది. నా యవ్వనపు రోజులన్నీ చిన్న చిన్న తిరుగుబాట్లతో, గణితం మీద వ్యామోహంతో గడిచిపోయాయి. 1970లలో నేను నక్సలైట్ ఉద్యమంవైపు మొగ్గాను, ఎమర్జెన్సీ కాలంలో అజ్ఞాతంలోకి వెళ్లాను. ఇదంతా చూసి, నాకెవరో ‘బ్రెయిన్ వాష్’ చేశారని అనుకున్నారు నా తల్లిదండ్రులు. నన్ను బలవంతంగా మద్రాసుకు తరలించి, ఆ బ్రెయిన్ వాష్న ‘రివర్స్’ చేయించటం కోసం నాకు కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇప్పించారు. దానివల్ల నా జ్ఞాపకశక్తి చెదిరి పోయింది. ఎంతగా అంటే- స్నేహితులు నానా కష్టాలూ పడి నన్ను మద్రాసు నుంచి తప్పించి, హైదరాబాద్కు తీసుకువచ్చిన తర్వాత.. నేను ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తినే గుర్తుపట్టలేకపోయాను. మానసికంగా అంతా అయోమయమైపోయింది. ఎమర్జెన్సీ కాలంలో అరెస్టులను తప్పించుకోడానికి నేనూ, నా భర్త సిరిల్ రెడ్డి ఉత్తర భారతదేశానికి వెళ్లిపోయి, ఘజియాబాద్లో బాల్మీకీల మధ్య జీవించటం ఆరంభించాం. అక్కడ వాళ్లకి ఇంగ్లిష్ నేర్పించటం వంటి రకరకాల పనులు చేశాం. ఆ కాలంలో నాకు తరచూ ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుండేది. 1980లో మేం హైదరాబాద్కు తిరిగి వచ్చాంగానీ ఇక్కడ మాకోసం ఎదురు చూసే కుటుంబంగానీ, పార్టీ గానీ ఏదీ లేదు. అయినప్పటికీ ఈ నగరమే మా ఇల్లు అయ్యింది. స్నేహితుల సహాయంతో మేం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ (హెచీబీటీ)ని నెలకొల్పాం. వామపక్షవాదులు, అంబేడ్కరిస్టులతో ఎక్కువగా కలసి పనిచేస్తూ, తక్కువ ధరలకే పుస్తకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రచురణ…………
-
Jeevana Laalasa
₹300.00విన్సెంట్ చనిపోలేదు. అతనికి మరణం లేదు. అతని ప్రేమా, ప్రజా, అతడు సృజించిన మహా
సౌందర్యమూ కలకాలం నిలిచిపోతాయి, ఈ ఈ లోకాన్ని సుసంపన్నం చేస్తాయి. అతని చిత్రాల్లో
నూత్న విశ్వాసం, బతుక్కి కొత్త అర్థం గోచరిస్తాయి. అతడు గొప్ప మానవుడు, గొప్ప వర్ణచిత్రకారుడు, గొప్ప తాత్వికుడు. ప్రేమించిన కళ కోసం ప్రాణాలు ధారపోసి అమరుడయ్యాడు.
విన్సెంట్ జీవితం, నిరాశలు వాస్తవమైనవాటికన్న ఎక్కువ కల్పనలా అనిపిస్తాయి. అతని మానవ సంబంధాలను, చిత్రలేఖనాలను, వర్ణసమ్మేళనాలను, ఆశనిరాశలను తన ఊహాశక్తితోనూ, కవితాత్మక సాంద్ర వ్యక్తీకరణలతోనూ అక్షరాల్లో పునర్జీవింపజేసే అవకాశాన్ని సంపూర్ణంగా వాడుకుని నవలగా మలిచాడు ఇర్వింగ్ స్టోన్.
ఈ అనువాదం కేవలం ఆసక్తి కొద్దీ సాగినది మాత్రమే కాక ఇర్వింగ్ స్టోన్ రచనలాగ అభిరుచితో హృదయమంతా రంగరించి సాగడం , తెలుగు పాఠకులకు దొరికిన గొప్ప రంగుల వెల్లువ….
ఎన్. వేణుగోపాల్
-
పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా
₹200.00“వివిధ పాత్రల మనోగతాల్ని ఆవిష్కరించే క్రమంలో వాటిని వారి వారి కథలుగా ‘చెప్పించడం’ ద్వారా నవల రాయడంలో ఒక నూతన మార్గాన్ని సూచించిన గోపీచంద్ సాహిత్య చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు.”
“ఏ నాటికీ నిలిచే నవల. మనిషి ఎలా ఉంటే సంపూర్ణ జీవితం గడపగలడో వివరించిన విశిష్ట నవల. ఆనాటి ప్రథమ తెలుగు నవల గుణగణాల్ని గుర్తుంచుకునేలా ఈనాటి పాఠకులకు అందజేసిన ప్రచురణకర్తలు అభినందనీయులు.”
“సాంఘిక జీవితం బ్రతుకుదెరువుకూ అనుభవాలకీ ఉపయోగపడుతుంది. ఒంటరితనం అనుభవాలను జీర్ణించుకోడానికి వ్యక్తిగతాభివృద్ధికీ ఉపయోగపడుతుంది అంటారు గోపీచంద్. కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన ఈ తొలి తెలుగు నవల (1963)ను పునర్ముద్రించి ‘అలకనంద’ మంచి పనే చేసింది.”
“తెలుగుదేశంలో రచయితల చుట్టూ అల్లుకున్న రాజకీయాలను ప్రతిభావంతంగా చిత్రీకరించిన నవల ‘గోపీచంద్’ రాసిన ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’. “
-
Raaga Saadhika
₹100.00స్వర్గ నరకముల ఛాయా దేహళి
చిన్నప్పుడు, ఏ తరగతి పుస్తకంలోనో గుర్తు లేదు కానీ గౌతమబుద్ధుని పాఠం ఉండేది. సిద్ధార్థుడు బుద్ధునిగా మారిన ప్రయాణం చాలా కలవరపెట్టింది. ముఖ్యంగా సిద్ధార్థుడు జర, రుజు, మరణాలను చూసి అశాంతికి లోనై, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం నా మనసు మీద చెరపలేని ముద్ర వేసింది.
చిన్నవయసులో ఇ అనేది పిల్లలకి సురక్షిత స్థలం. మేడ అయినా గుడిసె అయినా అది తమని పొదువుకునే చోటు, తమవారుండే చోటు.
ఒక యువకుడు, తల్లిదండ్రులను, భార్యాబిడ్డలను, సురక్షిత స్థలాన్ని వదిలి అసలు ఎందుకు వెళ్ళాడు, ఏమి సాధించాడన్నది నన్ను ఆకర్షించలేదు. ఎలా వెళ్ళగలిగాడన్నదే బాధించింది. అలా వెళ్ళిపోవడానికి కారణమైన వార్ధక్య, అనారోగ్య, మరణాలు సిద్ధార్థుడిని ఏమో గానీ నన్ను చాలా భయపెట్టాయి.
ఒక బొమ్మ వేస్తేనో, ఒక కవిత రాస్తేనో నలుగురికీ చూపడానికి సిగ్గుపడే రోజులవి. ఇక మనసులోని ఆలోచనలు, భయాలు, సంఘర్షణలని బైటకి చెప్పుకోవడానికి ఆస్కారమే లేదు. అసలు చెప్పుకోవచ్చని కూడా తెలీదు.
ముసలితనం వల్ల అనారోగ్యం వస్తుంది, అనారోగ్యం వల్ల చనిపోతారు. ఈ మూడింటికి మనిషి ఉనికి అతుక్కుని ఉంటుంది. ఈ గొలుసుకట్టులో ఎపుడు, ఎవరికి ఏది ఎదురైనా నాకు గుబులుగా ఉండేది.
మనుషులు చావు గురించి మా ఊళ్ళో ఒక వదంతి ఉండేది. ఒక శవం లేస్తే వెంటనే మరి మూడు శవాలు తోడు బోతాయని చెప్పుకునేవారు. పిల్లకాయలంతా శవం ఊరేగింపు చూడటానికి ఎగబడితే నేను లోపలి గదిలోకి పారిపోయేదాన్ని.
ఆ నలుగురు దాటిపోయేకాలంలో ‘అస్తి నాస్తి విచికిత్స’తో మనసు నిండిపోయేది. తచిన్నవయసుకి అన్ని బరువైన ఆలోచనలు ఎలా మోసానో ఇప్పటికీ ఆశ్చర్యమే.
మరణం పెద్ద ప్రశ్నలా చాలా జీవితాన్ని ఆక్రమించింది………………..
-
-
-
-
Robin Hood by Veturi
₹200.00చిలిపి చిన్నరి చికిలి పిట్టల
పలుకు జిలిబిలి పాటలో
అడవి గాలులు సుడిసి వచ్చే
వడులలో సవ్వడులలో
వినిపించు వీనులవిందుగా – రా
బినుల పాట పసందుగా
చోరుడైనా-వీరుడూ నగ
ధీరుడూ సముదారుడూ –
అయిన రాబిన్ అమరగాథలు
కదుపుల గిట్ట కుదుపుల
దుసికిలిన కెంధూళులూ.
-
Sagaram Eedatam Telikem Kadura
₹150.00సాగరం ఈదడం తేలికేం కాదురా
నాగ రచించిన సాగరం ఈదడం తేలికేం కాదురా తెలుగు సాహిత్యంలో ఒక స్పూర్తిదాయకమైన రచన. సాగరాన్ని ఈదటం తెలియకుండా అన్న శీర్షిక జీవితంలోని సవాల్లను, అనిశ్చితతలను, మరియు సాహసాన్ని సూచిస్తుంది. 133 పుటల ఈ చిన్న పుస్తకం పాఠకుని హృదయాన్ని లోతుల్లోకి లాగుతుంది.
- సాహసం మరియు సంఘర్షం: జీవితంలో అనిశ్చితతలను ఎదుర్కొనే విధానాన్ని స్పూర్తిదాయకంగా చిత్రించిన కధానికం.
- సంక్షిప్త రచన: 133 పుటలలో ప్రభావశాలిగా సాగే కధానికం — తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్ని అందిస్తుంది.
- ప్రేరణాత్మక సందేశం: సాగరాన్ని ఈదటం తెలియకుంటే ఏం చేస్తాం? అన్న ప్రశ్నకు సాహసంగా సమాధానం వెతికే కధానికం.
- ఆధునిక తెలుగు శైలి: నేటి పాఠకులకు స్పందించే సరళమైన, నేరుగా సాగే వాక్యనిర్మాణం.
-
Savaari-Kathalu సవారీ — కథలు
₹170.00సవారీ — కథలు
సంజయ్ ఖాన్ రచించిన సవారీ కథల సంకలనం, తెలుగు కథా సాహిత్యంలో ఒక విశిష్టమైన అధ్యాయం. ప్రయాణం అనేది కేవలం ఒక చోటు నుండి మరొక చోటుకు వెళ్ళటం మాత్రమే కాదు — అది మనస్సును, అనుభవాలను, జీవితాన్ని మార్చే ప్రయాణం అన్న సందేశాన్ని ఈ కథలు పాఠకుకు అందిస్తాయి.
గ్రంథ విశేషాలు
- వైవిధ్యమైన కథలు: ప్రయాణం అనే ప్రతీకాన్ని కేంద్రంగా చేసుకొని, విభిన్న పాత్రల జీవిత అనుభవాలను చిత్రించిన కధా సంకలనం.
- మానవ స్వభావం: ప్రతి కధలో మానవ స్వభావంలోని సూక్ష్మతలు, బలహీనతలు నిజాయితిగా అందించిన రచన.
- సంజయ్ ఖాన్ శైలి: సరళమైన, ప్రవాహంగా సాగే తెలుగు వాక్యనిర్మాణం పాఠకుని కధలోకి లాగుతుంది.
- సామాజిక అంశాలు: సమాజంలోని వివిధ వర్గాల జీవితాన్ని స్పృశించే కధానికాలు.
-
Tyagaraju Atmavicharam
₹300.00త్యాగరాజు ఆత్మవిచారం
భమిడిపాటి కామేశ్వరరావు రచించిన ఈ అపూర్వమైన గ్రంథం, మహాభక్తుడు త్యాగరాజు స్వామి కీర్తనలను గద్యరూపంలో అందించే ఒక అద్వితీయమైన సాహిత్య కృషి. సంగీత సాహిత్యంలో అజరామరమైన స్థానం పొందిన త్యాగరాజు కీర్తనల భావగాంభీర్యాన్ని, భక్తి తత్త్వాన్ని సామాన్య పాఠకులకు సైతం సులభంగా అర్థమయ్యే విధంగా గద్యంలో రూపొందించడం ఈ రచన యొక్క విశేషత.
గ్రంథంలో ఉన్న విభాగాలు
- ఆత్మవిచారం (కీర్తనల గద్య రూపాంతరం): త్యాగరాజు స్వామి కీర్తనలలోని ఆధ్యాత్మిక సారాన్ని, భక్తి భావాన్ని గద్యంలో వివరించిన విభాగం.
- ప్రహ్లాద భక్త విజయము: భక్త ప్రహ్లాదుని అచంచల భక్తి, దైవ సంరక్షణ, మరియు సత్యం యొక్క విజయాన్ని చిత్రించే కావ్యం యొక్క గద్య రూపాంతరం.
- నౌకాచరిత్రము: త్యాగరాజు స్వామి రచించిన నౌకాచరిత్రం — శ్రీరాముని లీలలను వర్ణించే ఈ రచన యొక్క గద్య అనువాదం.
-
Nee Premalo Munigaka
₹210.00అహంకారం . ఈ ఒక్క ఎక్కడి అహంకారం మనిషిని ఎక్కడి వరకైనా తెసుకువెళ్ళగలదు. ఎదుటి వాడి మీద గెలవాలి అనే అహంకారం, మనిషిని విచక్షణ కోల్పోయేలా చేసి, పిచ్చోడిలా మార్చగలదు. నేను చేసేదే కరెక్ట్, నేను మాత్రమే తెలివిగలవాడిని, అందరి మీదా నేనే గెలవాలి అనే అహంకారం ఉన్న మనిషి ఎప్పటికి గెలవలేడు, ప్రశాంతంగా బ్రతకలేడు.
వర్షాకాలం కనుక ఏకదాటిగా వర్షం కురుస్తూ ఉంది. సమయం ఉదయం ఆరవుతున్నా చలి వలన కలిగిన బద్దకంతో అనుకుంట హైదరాబాద్ నగరం అంతా నిద్ర మత్తులోనే ఉంది. కొందరు ఆఫీస్కి టైమ్ అవుతుందని తప్పక దుప్పటి తీసి బలవంతంగా లేస్తున్నారు. కొందరు ఇంకాసేపు ఆగి గుద్దాంలే అని, తమకి తామే సర్దిచెప్పుకుంటూ మళ్ళీ నిద్రలోకి జారుకుంటున్నారు. శుక్రవారం అందునా శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం కూడా కావడంతో, కొందరు ఆడవాళ్ళు మాత్రం ఈ వర్షం, చలిని లెక్కచేయకుండా పూజలు చేసి, లక్ష్మీదేవిని ఇంప్రెస్ చేయాల్సిందే, అని పట్టు వదలకుండా లేచి తల స్నానాలు మొదలు పెట్టారు. ఇలా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు.
జూబ్లీహిల్స్ పక్కన ఉన్న బస్తీలో ఒక చిన్న మూడు అంతస్తుల భవనం ఉంది. చెప్పుకోవడానికి మూడంతస్తుల భవనమే, కాని ఒక్కో అంతస్తులో ఇరికించి కట్టిన సింగల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది. దాని గోడలు పెచ్చులు ఊడిపోయి ఉన్నాయి. రాత్రి నుండి కురుస్తున్న వర్షం వలన ఆ మూడవ అంతస్తు పైన ఉన్న స్లాబ్ మధ్యలో ఉన్న సన్నని రంధ్రం గుండా కారుతున్న వర్షం నీరు, ఇంటి హాల్ నడి మధ్యలో పెట్టి ఉన్న పాత గిన్నెలో పడుతూ ఉంది. ఆ గిన్నెలో కారే ఒకో చినుకు టక్టాక్ మంటూ…..
-
Tholi Gayam
₹189.00బస్ స్టాప్ పిల్లలంటే ఎంత ప్రేమో! వాళ్ళని స్కూల్ బస్ ఎక్కించి
అందరూ వెళ్ళిపోతారు. కానీ వాళ్లు మళ్ళీ తిరిగి స్కూల్ నుండి వచ్చే వరకు బస్ స్టాప్ మాత్రం అక్కడే ఒంటరిగా, వాళ్ళ కోసం ఎదురుచూస్తుంది. అది వాళ్లతో మాట్లాడటానికి ఏరోజూ ప్రయత్నించదు, కానీ వాళ్ల మాటలు మాత్రం ఎంతో ఓపికగా, ప్రేమగా వింటుంది. ఆ ముద్దుముద్దు మాటలకు, వాళ్లకి వినపడకుండా నవ్వుతుంది కూడా. పాపం… సాయంత్రం బస్ తిరిగి వచ్చాక అయినా వాళ్లతో కొంతసేపు గడపాలని, రోజంతా ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ పిల్లలు బస్ దిగాక, ఒక్క నిమిషం కూడా అక్కడ నిలబడనివ్వకుండా, చెయ్యి పట్టుకుని తీసుకెళ్లిపోతారు. ఏదేమైనా, ఎన్నిసార్లైనా… మరో రోజుకోసం ఎదురు చూడటమే తనకి తెలిసిన ప్రేమ.
బస్ స్టాప్ ఎప్పటిలాగే, ఈరోజూ కూడా పిల్లల మాటలు వినాలని రోడ్ వైపు చూస్తూ ఎదురుచూస్తుంది. పిల్లల్ని తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులు మాత్రం, బస్ వచ్చేవరకు పక్కవారితో తమ పిల్లలకు ఎంత విలాసవంతమైన జీవితం ఇస్తున్నామో అనే పోటీల్లో నిమగ్నమయ్యి, అప్పుడప్పుడు రోడ్ వైపు బస్ కోసం చూస్తున్నారు. అలా చూసినప్పుడే, రావలసిన సమయానికి బస్ రాలేదని చిరాకుపడుతూ, మళ్లీ తమ పోటీల్లో మునిగిపోతున్నారు.
-
యామం (Yaamam)
₹375.00తమిళ సాహిత్యంలో చారిత్రక మైలురాయిగా నిలిచిన యామం — జాతీయ స్థాయి రాగూర్ సాహిత్య అవార్డు (₹1,00,000) విజేత — ఇప్పుడు తెలుగు అనువాద నవలగా మీ చేతుల్లో ఉంది. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత ఎస్. రామకృష్ణన్ రాసిన ఈ తెలుగు చారిత్రక నవలను, కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం పొందిన జిల్లేళ్ళ బాలాజీ సజీవంగా తెలుగులోకి తీసుకొచ్చారు.
పద్దెనిమిదవ శతాబ్దపు వలస భారతదేశం నేపథ్యంలో, ఒకే రాత్రి అంతటా సమాంతరంగా సాగే అయిదు జీవితకథలు ఒక మహానాగరికతను కళ్ళముందు నిలబెడతాయి. మేజిక్ రియలిజం శైలిలో రాసిన ఈ దక్షిణ భారత సాహిత్యం లో మేటి రచన, తమిళ-తెలుగు అనువాద సాహిత్యంలో అరుదైన మణిపూస.
-
-
-
-
-

















































