-
-
Komuram Bheemu
₹250.00ప్రపంచ చరిత్రలో మొదటి నుంచి ఇప్పటిదాక శత్రువుతో సాయుధపోరాటం చేసిన, చేస్తున్న చరిత్ర ఆదివాసులది మాత్రమే. వాళ్ల జీవితాల్లో మార్కెట్టు లేదు. వ్యక్తిగత ఆస్తిభావన లేదు. మన కాలంలో మన కళ్ల ముందు కొమురం భీము ఆకారం చూస్తూ ఉండగానే ఆకాశమంత ఎత్తుకెదుగుతున్నది. ఏకకాలంలో విప్లవోద్యమానికి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి, ఆదివాసీపోరాటాలకి ప్రేరణ కాగలిగిన వ్యక్తిత్వాన్ని వ్యక్తం చేస్తున్నది. భీము అడవి కడుపున విత్తనమయ్యాడు. ‘విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది’ కొమురం భీము నవల ‘దండకారణ్య పర్స్పెక్టివ్’లో వచ్చింది. జగిత్యాల జైత్రయాత్రకి కొనసాగింపుగా వచ్చింది. ఇంద్రవెల్లి సంఘటన లేకపోతే, కొమురం భీము నవల లేదు. ఈ నవల రాసి సాహు, రాజయ్యలు కొమురం భీము పోరాటానికి, ఇంద్రవెల్లి పోరాటానికి ఒక గత వర్తమనాల చారిత్రక వారధిని నిర్మించే కృషి చేశారు. అందుకే ఈ నవల వర్తమానంతో జరుపుతున్న సంభాషణ. – వరవరరావు
-
-
-
-
-
-
-
-
-
Kathalela Rastaru? ? By Sarvari
₹300.00కాబోయే కథకులకి పనికొచ్చే చిట్కాలు
– ఆరుద్ర
“మనం చదివే చాలా కథలకన్నా మనం రాసే కథలే మనకి బాగుంటున్నాయి, అయినా మనం పంపించే కథలు ఈ పత్రిక వాళ్ళు ప్రచురించరేం?” అని మీ రెప్పుడైనా బాధపడ్డారా? ఇప్పుడు పడుతున్నారా? పడకండి ధైర్యం చేతబట్టుకొని, కాళ్ళు నిలదొక్కుకోండి.
మీరు పంపించే కథలు మీ కొక్కరికే బాగుంటే చాలదు. అందరికీ బాగుండాలి.. అప్పుడే సంపాదకులు వాటిని ప్రచురిస్తారు. బాగున్న కథల్ని పత్రికలవాళ్ళు కళ్ళకద్దుకుని మరీ ప్రచురిస్తారు. వేసినవాటికి తృణమో, పణమో పారితోషికం కూడా ఇస్తారు. (పూర్వం రమారమి తృణమే ఇచ్చేవారు, ఇప్పుడు పణం ఇస్తున్నారు.)
బాగా వుండేటట్టు కథ రాయాలంటే దానికి అనుభవం కావాలి.
“చాల్లేవయ్యా! ఆపాటి అనుభవం మాకూవుంది. ఊఁ కొట్టడం వచ్చిన దగ్గర్నుంచి కథలు వింటున్నాం. కూడబలుక్కొని చదవడం మొదలెట్టిన దగ్గర్నుంచీ కథలు చదివేస్తున్నాం. కాంపోజిషన్లు రాయడం మొదలెట్టిన మర్నాటి నుంచి కథలూ రాస్తున్నాం, ఇంతకన్నా ఇంకేం కావాలి?” అని మీలో ఏ ఒక్కరైనా అనగలిగితే మీకు అనుభవ ముందని తప్పకుండా ఒప్పుకుంటాను. చిన్నప్పటినుంచి కథలు వినాలనీ, చదవాలనీ, వ్రాయాలని తహ తహ వున్నవాళ్ళు మంచి కథకులవడానికి అవకాశాలున్నాయి.
భాగవతం రాసిన బమ్మెర పోతరాజుగారు మాత్రం ఎలా రాశారు? విభుదవరుల ఎల్ల విన్నంత, కన్నంత తెలియవచ్చినంత తేటపరిచారు. ఆహా! దొరికింది కిలకం. ఇది మంచి కథలు రాయడానికి సూత్రం! కథ రాసేవాడు ముందు బోలెడంత వినాలి. లాకాయి,………
-
Prapanchaniki Kotha Rupam Edham Kadalirandi
₹300.00ఉపోద్ఘాతం
“ఈ భూగోళం మనిషికి మాత్రమే) చెందినది కాదు. మనిషే ఈ
భూగోళానికి చెందుతాడు. ఒక కుటుంబాన్ని కలిపి ఉంచే ఒకే రక్తం
లాగా ఈ భూగోళం తనకు చెందిన చరాచరాలకు మధ్య సంబంధాన్ని
కలిపే ఉంచుతుంది.”– అమెరికాలోని దువామిష్ తెగ నాయకుడి మాట
ఈ పుస్తకాన్ని వ్రాయటానికి నేను కలమూ, కాగితమూ చేత పట్టుకుని కూర్చున్నప్పుడు, నేను నా ఓక్ బ్రూక్ టెర్రేస్ టవర్లోని పద్దెనిమిదవ అంతస్తులోని గవాక్షం ద్వారా పరికిస్తే, చుట్టూరా చికాగో నగర వినువీధుల్లోని ఆకాశ హర్మ్యాలెన్నో కనిపించాయి. నిజానికి ఈ దృశ్యం గత ఏభై అయిదు సంవత్సరాలుగా నేను చూస్తుండగానే పెరుగుతూ, ఆకాశపు తెల్లమబ్బులను అందుకుంటూ, ఈ ప్రపంచంలో మానవుడు సాధించిన, సాధిస్తున్న ఎన్నో విజయాలనూ, వాటిని సాకారం చేసిన ఎన్నో సాంకేతిక అద్భుతాలనూ ప్రస్తావిస్తున్నాయి. గత డెబ్బది అయిదు సంవత్సరాలలో మన ప్రపంచం ఎన్నో రకాలుగా మార్పు చెందింది. ప్రజాస్వామ్యం వేళ్ళూనుకొంది. జనాభా నాలుగు రెట్లయింది. ఆర్థికంగా అభివృద్ధి చెందాము. ప్రపంచంలో శాంతి చాలావరకు నెలకొని ఉంది. ఈ సమయంలోనే మౌలిక సదుపాయాలూ పెరిగాయి.
పేదరికం తగ్గు ముఖం పట్టింది. విద్య అనేది అందరికీ అందుబాటుగా విస్తరించింది. సాంకేతిక విజ్ఞానం పరివ్యాప్తమయింది. ఇంకా మనమందరమూ అనుసంధానించ బడ్డాం.
-
Viswa Karma
₹300.00ప్రవేశిక
ప్రాయ ఇతి శబ్దేన దోషసంపాదనం చిత్త మితి |
శాస్త్ర ప్రతిషేధః తస్మా తాయ శ్చిత్తమిత్యాచ్యతే ॥
భావం: అంటే దోషసంపాదనమని, చిత్తం అంటే దాన్ని నివారించుకోవడమని అర్థం. ప్రాయశ్చిత్తమంటే దోషాన్ని నివారించుకోడానికి చేసే కార్యక్రమమని అర్థం.
* * *
అదో నాలుగు నిట్రాళ్ళ ఇల్లు. బయట ‘వరదానం, ఆయుర్వేదాచారి’ అనే బోర్డుంది. ఆ ఇంట్లోని వెనక పెద్ద గది వంటగది. ఓవైపు నేల మీద పొయ్యి. మరోవైపు ధాన్యం బస్తాలు. మధ్య గదిలో ఓవైపు ఉయ్యాలబల్ల. మరోవైపు అతిధులు వస్తే పరచటానికి నాలుగు చాపలు. ఆ ఇంట్లో మరో రెండు గదులున్నాయి. వాటిలో ఒకదాన్నిండా ఆయుర్వేద మందులు, చిన్న మేజా బల్ల, కుర్చీ, వచ్చిన రోగులు కూర్చోడానికో బల్ల ఉన్నాయి. ఇంకో గది ఎత్తైన పందిరిపట్టెమంచం గల పడకగది.
ఆ ఇంటి వెనకాల చాలా చెట్లున్నాయి. అవన్నీ ఔషధగుణాలు గల చెట్లే. నూతి గట్టు పక్కన స్నానానికి చుట్టూ దడి కట్టిన చిన్న పందిరి. దూరంగా వెనకో మరుగుదొడ్డి. ఆ ఇంటిముందో ఎడ్లబండి ఆగింది. అందులోంచి దిగిన ఇద్దరు ఓ రోగిని చేతులు పట్టుకుని కిందకి దించారు. ఆయన కడుపునొప్పితో బాధ పడుతున్నాడు. ఆ ఇంటి అరుగు మీద కళ్ళుమూసుకుని కూర్చున్న పండితయ్య ఆ రోగి వంక చూడలేదు. ఎనభై పైబడ్డ……………….
-
-
-
Nurella Telugu Kadhalu
₹349.00హిమాలయాలకు వెళ్ళి మంచుపూలను కోసుకొస్తారు కొందరు. రాత్రంతా వేచి ఉండి ఓపికగా పారిజాతాలను ఏరుతారు మరికొందరు. మల్లెల మాసం వచ్చేంత వరకూ ఆగి మొగ్గలను వొడుపుగా గుచ్చి మాల అల్లుతారు ఇంకొందరు. కాని- దారిన పోతూ పోతూ కింద రాలిన ఒక గన్నేరు పువ్వును అందుకొని దేవుని సమక్షాన పెట్టి అంతకు మించి వీలు కాదన్నట్టుగా కదిలిపోతారు మరికొందరు. ఇది అలాంటి ప్రయత్నం. తెలుగు కథ సమక్షంలో ఒక గన్నేరు పువ్వును పెట్టే ప్రయత్నం. వందేళ్ళలో వచ్చిన వంద సుప్రసిద్ధ కథలను ఏరి, వాటిని క్లుప్తంగా తిప్పి చెప్పిన ప్రయత్నం ఇది. కథను చదివే, కథ మొత్తాన్ని చదివే, కథను వెతుక్కుని చదివే వీలు లేని ఈ అడావిడి రోజుల్లో నూరేళ్ళ తెలుగు కథా సాహిత్యాన్ని అలుపు లేకుండా ముగించడానికి వీలుగా చేసిన ప్రయత్నం ఇది. కొండను అద్దంలో చూపించడం. దేశీయ కథా సాహిత్యంలో ఇలాంటి ప్రయత్నం బహుశా కొత్త. ఇది తెలుగు కథ ఘనత. తెలుగు కథకు ఒక కథకుడు ప్రకటించిన కృతజ్ఞత.
-
Nemaru By Dusanapudi Vanidevi
₹350.00బద్ధకిష్టుడు!
పెద్ద నాలుగయిదు రోజులకొచ్చేసింది.
తెల్లారుజాము నాలుగింటికే ఊరు ఊరంతా జూలు విదిలించింది.
పేడ కల్లాపులూ, ముగ్గులు, గొబ్బిళ్ల హడావిడి పుంజుకుంది.
నొక్కుల జుట్టూ పచ్చని చాయా – లావూ సన్నం కాకుండా కాస్త పొట్టిగా ఉన్న ముప్పయ్యేళ్ల యువతి-నిండు గర్భిణి!-ఇంటి ముందు రథం ముగ్గేస్తోంది. అయిదుగురు కొడుకులు తల్లి ఆమె! ఈసారయినా ఓ ఆడపిల్ల పుట్టి, ముందుముందు ముగ్గులూ, గొబ్బిళ్లూ, బొమ్మల కొలువుల హడావిడి నెత్తినేసుకోవాలన్నది ఆమె చిరుకోరిక.
అరుగుమీద కూర్చుని అక్క వేస్తున్న ముగ్గును చూస్తున్నాడో పదహారేళ్ల బక్కపలచని, చామనచాయ కుర్రాడు. పుష్యమాసపు చలికి గొంతుక్కూర్చుని, చేతులు రెండూ కాళ్లకి పెనవేశాడా కుర్రాడు. ముగ్గు పూర్తవుతూండగా, ఆమె కడుపులో ఏదో కదిలినట్టైంది. పళ్లబిగువున చేతిలో పని పూర్తిచేసింది. ముగ్గు బుట్ట అరుగుమీద పెట్టిన అక్క మొహంకేసి అనుమానంగా చూశాడా కుర్రాడు.
‘అక్క మొహం మామూలుగా లేదివాళ!’ అనుకుంటూండగానే ఆమె మెలికలు తిరిగిపోవడం ఆ కుర్రాడు గమనించాడు.
“అమ్మా! అక్కకేదో అయినట్టుందే….” అన్న ఆ కుర్రాడి కేక విని ఓ భారీ కాయురాలు – అంతంత అంగలతో-వీథిలోకి పరుగున వచ్చింది.
“చోద్యం చూస్తున్నావేమిట్రా, వెళ్లి రిక్షా కట్టించుకురా!” గర్భిణిని పట్టుకుంటూ కుర్రాణ్ణి గదమాయింది భారీకాయురాలు. “అలాగలాగే…. తిన్నగా ఆస్పత్రికేగా?” అని అడుగుతూనే రోడ్డుమీదికి దూకేశాడు ఆ కుర్రాడు………………
-
Maha Swetha Devi
₹350.00చోళీకే పీచే
అనువాదం: కలేకూరి ప్రసాద్
‘అక్కడేముంది?’ అన్నది ఆ సంవత్సరపు జాతీయ సమస్యగా మారింది. పంటలు పండకపోవడం, భూకంపాలు. ఎక్కడ చూసినా ఉగ్రవాదులకీ, ప్రభుత్వ యంత్రాంగానికీ మధ్య ఘర్షణలు – ఫలితంగా మరణాలు; కులాంతర వివాహం చేసుకున్న నేరానికి ఒక జంటను హర్యానాలో తలలు నరికి చంపడం; నర్మదా డామ్ విషయమై మేథా పాట్కర్ తదితరులు చేస్తున్న అర్థం లేని డిమాండ్లు. వందలాదిగా జరుగుతున్న మానభంగాలు – హత్యలు – లాకప్లో చిత్రహింసలు వగైరా… వగైరా అంశాలన్నీ ఈ సమస్య ముందు అప్రధానాలై పోయాయి. అవేవీ వార్తా పత్రికల్లో ప్రముఖస్థానాన్ని ఆక్రమించలేకపోయాయి. అన్నిటికీ మించిన ప్రాధాన్యతను సంతరించుకున్న ఒకే ఒక అంశం… చోళీకే పీఛే – రవికె మాటున….
జాతీయ జీవనంలో ప్రాధాన్యం లేని అంశాలను ప్రాధాన్యం గల అంశాలు అణచి పారేస్తాయి – అదే నియమం. అందుకనే అక్కడ.. రవికె మాటున ఏముంది? అన్నది అతి ముఖ్యమైన సమస్య అయిపోయింది. భారతజాతి ‘ఆత్మ’పెనునిద్దురలో మునిగిపోవడమే కాక అవసరమైనప్పుడు మేల్కొనగలదనడానికి ఇదే తార్కాణం.
ఈ విధంగా యావన్మంది ప్రజానీకమూ అక్కడేముందో తెలుసుకునే ప్రయత్నంలో మునిగి తేలుతున్నారు. జాతీయ ప్రసార సాధనాలు, సెన్సార్ బోర్డు, బ్రా వ్యతిరేక విముక్త మహిళలు, రాష్ట్రస్థాయి సంస్థలు, కేబుల్ టీవీ ఛానెల్స్ – కళ్ళమీద ఆకుపచ్చ షేడ్ వేసుకున్న మహిళా ఓటేరియన్ల సంస్థలు, అన్ని మతవర్గాలూ, ఇంకా రాజకీయ నాయకులు చాటుమాటుగా ‘ఖల్నాయక్ ‘ కాసెట్లు వేసుకుని చూడటం పరిపాటయిపోయింది……………..
-
-
Dargamitta Kathalu & Poleramma Banda Kathalu
₹390.00చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని, గొప్ప గొప్పవాళ్ళని, ముక్కూ ముఖం ఎరగని చాలా మందిని ఆత్మీయులుగా నాకు చేరువ చేసిన కథల పుస్తకాలివి. ఏ పూట ఏ మూలకు వెళ్ళినా ఆదరించి అన్నం పెట్టే కల్లాకపటం ఎరగని ఎన్నో కుటుంబాల నిచ్చిన పుస్తకాలు. ఒక రకంగా నా ఆస్తిపాస్తులు. వీటిని చదివి, చదువుతూ, ఇది రాస్తున్న ఈ క్షణాన కూడా ఏదో ఒక మూల ఎవరో ఒకరు చదువుతూ నన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు. వారి ముఖాన నవ్వు… కంట కన్నీరు… గుండెల్నిండా ఈ కథల పట్ల ప్రేమ… ఇంకా ఏం కావాలి నాకు?
‘దర్గామిట్ట కథలు’ చదివిన పాఠకులు కొందరికి ‘పోలేరమ్మ బండ కథలు’ తెలియవు. ‘పోలేరమ్మ బండ కథలు’ చదివిన కొందరికి ‘దర్గామిట్ట కథలు’ ఉన్నట్టుగానే తెలియవు. ఆశ్చర్యం ఏమిటంటే మొదట ఎవరు ఏది చదివితే అదే ఇంకొకదాని కంటే బాగుందని వాదనకు దిగడం. ఈ తకరారు ఎందుకు? రెండు కలిపి చదువుకుంటే బాగుంటుంది అని ఇలా. నాకెంతో ఇష్టమైన కథలు ఇంకా ఇష్టంగా మీ చేతుల్లో పెడుతున్నాను.
– మహమ్మద్ ఖదీర్ బాబు
-
-
-
-
-
Aadhunika Mahabharatham
“ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు… కలలు ఖనిజాలతో చేసిన యువత, మన దేశ భవిష్యత్తుకు సేవకులు”, అన్న ‘మహాకవి శేషేంద్ర గారి మాటలు ఆయన్నంత అమితంగా ఇష్టపడేలా చేసినాయి. ‘నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా?’ అన్న ఆయన వేసిన ప్రశ్న నాకు ‘మహావాక్యం’ అయింది. నీకు అత్యంత ప్రీతిపాత్రమయిన ‘ఆధునిక మహాభారతం’ అనే ఈ మహాగ్రంథాన్ని దేశ, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపనపడే వారికోసం అందుబాటులో ఉండాలన్న నీ ఆకాంక్ష. ఈ మహాగ్రంథాన్ని ఇంకోసారిలా మీ ముందుకు తీసుకొచ్చింది. నాకీ అవకాశాన్ని కల్పించిన ‘మహాకవి’ శేషేంద్ర గారి అబ్బాయి, కవి అయిన ‘సాత్యకి’ గారికి నాకు ఈ ‘మహాకవిని’ పరిచయం చేసిన నా మిత్రుడు ‘త్రివిక్రమ్ శ్రీనివాస్’ గారికి నా కృతఙ్ఞతలు…
– పవన్ కళ్యాణ్
₹550.00Original price was: ₹550.00.₹450.00Current price is: ₹450.00. -
ఆశ్లేషభరితం, Dhanika Digital Mahila Professional Development and Financial Independence for Women
₹499.00Original price was: ₹499.00.₹469.00Current price is: ₹469.00. -
Sachin Tendulkar- Playing It My Way
₹495.00సచిన్ టెండూల్కర్
ప్లేయింగ్ ఇట్ మై వే – నా ఆత్మ కధ
ఏ ఆత్మ కధా కూడా రచయిత జీవితంలో ప్రతీ వివరాన్ని ముందుంచలేదని నాకు అనిపించింది. అది సాధ్యం కాదు. ఎదో ఒక కారణం వల్ల రాయటానికి వీల్లేని వ్యక్తిగతమైన లేదా బహుశా సున్నితమైన అంశాలు ఉంటాయి. అయినా ఇప్పటి వరకు నేను నా కెరియర్ ని ఒక పూర్తి కధకు దగ్గరగా ఉండేలా చేయటానికి నేను శాయశక్తులా ప్రయత్నించాను. నేను వర్ణించిన చాలా సంఘటనలు క్రికెట్ అభిమానులకు తెలిసినవే కానీ నేను ఇది వరకు అందరి ముందు చెప్పని ఎన్నో విషయాల గురించి కూడా మాట్లాడడానికి నేను ప్రయత్నించాను. వాటిల్లో కొన్ని ఇబ్బంది కలిగించేవి కూడా ఉన్నాయి, పాటకులకు ఆసక్తి కలిగించేవి ఎన్నో దొరుకుతాయని నేను ఆశిస్తున్నాను.
– సచిన్ టెండూల్కర్
ముంబయిలో పుట్టిన సచిన్ టెండూల్కర్ 1989 లో 16 ఏళ్ల వయస్సులో పాకిస్థాన్ లో తొలిసారిగా తన టెస్ట్ ప్రారంభించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఆడిన అత్యంత అపురూపమైన, మనోరంజనం కలిగించే బ్యాట్స్ మన్ లలో ఒకరు, టెస్టులు మరియు అంతర్జాతీయ వన్డేలు రెండింటిలో కూడా వేరే ఇతర క్రీడాకారుడి కంటే ఆయన ఎక్కువ పరుగులు మరియు ఎక్కువ సెంచరీలు చేసి విజయం సాధించారు. ఆయన తన 17వ ఏట తోలి టెస్ట్ సెంచరీ చేశారు. 36వ ఏట ఆయన వన్డే డబుల్ సెంచరీ చేసిన తోలి క్రీడాకారుడుగా మారారు. 2012 లో తన 100వ అంతర్జాతీయ సెంచరీనీ సాధించారు. 2009 లో ఆయన భారత్ తో ప్రపంచ టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఉన్నత స్థానానికి చేరుకొని 2011 లో ప్రపంచ కప్పు గెలుచుకున్నారు. 2013 లో తన స్వస్థలం ముంబయి ప్రజల ముందు తన 200వ మరియు చివరి టెస్ట్ ఆడిన తర్వాత క్రికెట్ నుంచి నిష్క్రమించారు.
-
Vaidyudu Lenichota (Telugu)
₹600.00వైద్యుడు లేని చోట
వైద్యుడు లేని చోట కేవలం ప్రథమ చికిత్సకు సంబంధించిన పుస్తకం కాదు.
అంతకంటే ఎంతో విస్తృతమైన గ్రంథం.
సామాన్యల ఆరోగ్యంపై ప్రభావం చూపే అనేక అంశాలను ఇది తడిమింది.
నీళ్ల విరేచనాలు మొదలుకుని క్షయ వ్యాధి వరకు అన్ని వ్యాధుల్ని విశ్లేషించింది.
సహాయపడే/హానిచేసే రకరకాల గృహ వైద్యాలు మొదలుకొని కొన్ని ఆధునిక మందుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల వరకు అనేక అంశాల గురించి చర్చించింది.
పరిశుభ్రత, పౌష్టిక ఆహారం, వ్యాధి నిరోధక టీకాలు మొదలైన అంశాలకు ఈ పుస్తకంలో ప్రత్యేక ప్రాధాన్యత యివ్వడం జరిగింది.ఇందులో బిడ్డల పుట్టుక, కుటుంబ నియంత్రణ గురించిన సమాచారం కూడా వుంది.
పాఠకులు తమ శ్రేయస్సు కోసం ఏం చేయాలో సూచించడమే కాకుండా ఏ సమస్యలను అనుభవజ్ఞులైన ఆరోగ్య కార్యకర్తచే పరిష్కరింపజేసుకోవాలో వారికి అవగాహనను కలిగిస్తుందీ పుస్తకం.సవరించబడిన ఈ సరికొత్త ముద్రణలో ఎయిడ్స్, గర్భస్రావం, మాదకద్రవ్యాల వ్యసనం వంటి అనేక ఆరోగ్య సమస్యలపై అదనపు సమాచారాన్ని చేర్చడం జరిగింది. అదేవిధంగా వివిధ అంశాలపై మొదటి ప్రచురణలో యిచ్చిన సూచనలని ప్రస్తు పరిస్థితులకు అనుగుణంగా సవరించడం కూడా జరిగింది.
-
-
-
-

















































