అదొక మహోజ్వల మహాయుగం.
నేటికి రెండు వేల సంవత్సరాల నాటి ఆంధ్రుల పరాక్రమ గాధ
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే క్రీస్తుశకం 78వ సంవత్సరం.
శక కర్త, శక హర్త అయిన శాలివాహన యుగపురుషుడు
గౌతమీపుత్ర శాతకర్ణి మొత్తం భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలమది.
నేటి గుంటూరు జిల్లాలోని అమరావతి వారి రాజధాని.
ఆనాటి ఆంధ్రుల సాహిత్యానికి సంస్కృతీకి.
నాగరికతకు అద్దం పట్టిన నవల శ్రావణి.
ఇదొక గద్య ప్రబంధం.
షడ్రసోపేతమైన విందు భోజనం.
నవరసభరితమైన వచన మహాకావ్యం.