• Mahabharatham By D Srinivasa Dikshitulu

    వేదవ్యాస మహర్షి

    మహాభారతమ్

    ఆదిపర్వం

    శౌనక మహర్షి నైమిశారణ్యంలో సత్ర యాగం చేస్తున్నాడు. ఆ యాగాన్ని చూడటానికి చాలామంది మహర్షులు వచ్చారు. సూత వంశానికి చెందిన ఉగ్రశ్రవుడు కూడా వచ్చాడు.

    పురాణ కథల్ని వీనుల విందుగా చెప్పటంలో సూతుడు దిట్ట. నైమిశంలోని మహర్షులు సూతునికి అతిథి సత్కారాలు చేశారు. దర్భలతో నేసిన చాపమీద సూతుడు కూర్చున్నాడు. శౌనకుడు మొదలైన మహర్షులు ఆయన చుట్టూ చేరారు. ఎక్కడి నుంచి వస్తున్నావని సూతుని అడిగారు.

    “మహర్షులారా ! పరీక్షిత్తు కుమారుడు జనమేజయ మహారాజు. ఆయన చేసిన సర్ప యాగానికి వెళ్ళి వస్తున్నాను. అక్కడ వ్యాసుడు రాసిన భారతంలోని కథల్ని వైశంపాయనుడు చెప్పగా విన్నాను” అన్నాడు సూత మహాముని.

    “అయితే… ఆ మహాభారత కథనే మాకూ వినిపించు” అన్నారు మహర్షులు…………………..

    126.00
  • Sri Devi Bhagavatam By D Srinivasa Dikshitulu

    వేదవ్యాస మహర్షి శ్రీ దేవీ భాగవతమ్

    ప్రథమ స్కంధం

    వినండి… చెబుతాను!

    బ్రహ్మదేవుని ఆదేశానుసారం నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులు యజ్ఞయాగాలు చేస్తూ కాలం గడుపుతున్నారు. ఒకనాడు వేదవ్యాసుని శిష్యుడు, సకల పురాణవేత్త అయిన సూత మహాముని ఆ పవిత్ర ప్రదేశానికి వచ్చాడు.

    మహర్షులందరూ ఆ మహాత్మునికి భక్తిశ్రద్ధలతో అతిథిసత్కారాలు చేశారు. సూతుడు దర్భలతో చేసిన చాప మీద కూర్చున్నాడు.

    “సూత మహామునీ ! నువ్వు పురాణాలన్నీ చదివి గురువు అనుగ్రహంతో వాటిలోని రహస్యాలన్నింటినీ చక్కగా ఆకళింపు చేసుకున్నావు. అందుకే నువ్వు చెప్పే పురాణకథల్ని వింటుంటే శ్రోతల రోమాలు నిక్కపొడుచుకుంటాయి. అందరూ నిన్ను ఆదరంగా ‘రోమహర్షణుడు’ అని పిలవటానికి కారణం అదే.

    మహాత్మా! ఇప్పుడు నువ్వు ఇక్కడికి రావటం మా పూర్వజన్మ పుణ్యఫలంగా భావిస్తున్నాం. కలియుగ కల్మషాలన్నింటినీ కడిగేసే శ్రీ దేవీ భాగవతాన్ని నువ్వు మాకు చెబితే వినాలని కుతూహలంగా ఉంది” అన్నారు శౌనకాది మహర్షులు……………….

    126.00
  • Sri Guru Charitamu

    450.00
  • Sri Vishnu Vidya

    (శ్రీ విష్ణు సహస్రనామ భాష్యము)
    “ఇది నామ విద్య. ఈ నామాలు అక్షరాల గుంపులు కావు. నారాయణుని శబ్దాకృతులు. మొత్తంగా ఈ సహస్రనామ స్తోత్రమే విష్ణుని శబ్దమయీమూర్తి, ఇవి వేదమందు ప్రతిపాదింపబడిన పరమాత్ముని శబ్దాలు. వీటి వ్యాఖ్యానం మన వైదిక విజ్ఞానాన్ని, పరమేశ్వర జ్ఞానాన్ని స్పష్టపరుస్తాయి. అందుకే ఇది ‘విష్ణువిద్య’. .. ప్రాచీన, అర్వాచీన భాష్యాల ననుసరించి, వైదిక శాస్త్రాల సంప్రదాయాధారంగా ఒకొక్క నామానికి ఉన్న ఔచితీమంతమైన క్రమబద్ధతనీ, నిర్దిష్టమైన వ్యాఖ్యానాన్ని అందించే సమన్వయ భాష్యమిది. ప్రతినామ వ్యాఖ్యానము పారాయణయోగ్యంగా, భావనాయోగంగా సమకూర్చిన విష్ణుతేజో విలసిత గ్రంథమిది”. —

    -సామవేదం షణ్ముఖ శర్మ

    800.00