Vaktha
పలుకే బంగారం
న్యూయార్క్ సిటీ… మేన్హట్టన్ ప్రాంతం.
ఆకాశాన్ని చుంబిస్తున్నట్టుండే ఈగల్ టవర్స్ లో అద్దాలతో నిర్మించిన ఆ మినీ కాన్ఫరెన్స్ హాలులో తపస్య, చైతన్య వున్నారు. వారితోపాటు హాలులో కంపెనీకి చెందిన మరో ఎనిమిది మంది కీలక వ్యక్తులు కాన్ఫరెన్స్ టేబుల్ చుట్టూ కూర్చుని ఉత్కంఠతో తపస్య వైపు చూస్తున్నారు.
బిజినెస్ గ్రోత్పై చర్చించేందుకు కంపెనీలోని పెద్ద తలకాయలన్నీ అక్కడ చేరాయి. అది ‘మేధ’ ఈ-బుక్ స్టార్టప్. తమ కలల ప్రపంచాన్ని వెతుక్కుంటూ అమెరికాకు వచ్చి హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుకున్న ఇద్దరు ఇండియన్స్ ఈ కంపెనీని ప్రారంభించారు. ఇద్దరిలో ఒకరు చంద్రకాంత్ తమిళియన్ అయితే మరొకరు విజయన్ మలయాళీ. ఒకరు కంపెనీ ఎండీ కాగా మరొకరు సి.ఇ.ఒ.గా కంపెనీని ముందుకు తీసుకెళ్లేందుకు ఐదేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలనుంచి వచ్చి మేధలో పనిచేస్తున్న తపస్య, చైతన్య అంటే వీళ్లకి ఒకరకమైన అభిమానం. ఆ అభిమానం వీరిద్దరూ తమలాగే ఇండియా……………







Reviews
There are no reviews yet.