“పంచమవేదం”గా పిలువబడే భారతంలో ఎన్నో కధలు, నీతులు, ధర్మసుక్ష్మాలు…. ఎన్నో ఎన్నెన్నో కలిసి మెలిసి వున్నాయి. కధ – కధలో దుర్మార్గం, ఆవేశకావేశాలు ఎన్నో చదువుతున్న కొద్ది దర్శనమిస్తాయి.
భీష్ముల వారు, విదురుడు – దర్మస్వరూపాలుగా కనబడితే, ‘ధర్మం’ మూర్తీభవించిన ‘ధర్మరాజు’ కనిపిస్తాడు.
కృప, ద్రోణులు, అశ్వధామలు – పరిపూర్ణ బ్రాహ్మణులుగా, స్వామి భక్తి పరయాణులుగా దర్శనమిస్తారు.
ఇందులో లెక్కకు మించిన కుత్సితాలు, అన్యాయాలు, ఆక్రందనలు, అంబలు, శిఖండులు అందరు కనిపిస్తారు.
మహర్షుల దర్శనం, మహనీయుల ధర్మపధం, చెప్పే మహనీయులు, వినే జ్ఞాన – వివేకులు అన్నీ…. అందరితో…
వ్యాసుడు – ఒక ‘ధర్మ’బద్దంగా, పధంగా ఈ భారతాన్ని భారతానికి అందిస్తాడు. పంచమవేదమని ప్రకటిస్తాడు.
ఇందులో లేనిది మరెక్కడా లేదని, ఇందులో వున్నది, మరెక్కడా వుండదని లేదా కనపడదని గూడా స్పష్టంగా
చెబుతాడు.
ఇందులోమహాభారతం లోని 116 మంది వ్యక్తులు, వారి కధలు వివరించండం జరిగింది.