• -10%

    Vaktha (Telugu Edition)

    Original price was: ₹200.00.Current price is: ₹180.00.

    మీరూ కావచ్చు ‘వక్త’
    వేదిక ఎక్కి ఉపన్యాసం ఇవ్వమంటే వణికిపోయే వారందరికీ ఉపయోగపడే పుస్తకమిది. చైతన్య, తపస్య అనే ఇద్దరు మిత్రుల మధ్య సంభాషణల రూపంలో ‘ఆర్ట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ స్పీకింగ్‌’ లో మెలకువలన్నీ వివరించి చెప్పారు రచయిత. పుట్టుకతోనే ఎవరూ ‘వక్త’ లు కారనీ, అది నేర్చుకుంటే వచ్చే నైపుణ్యమనీ చెబుతారు. పరాజయభీతి, విమర్శల భయం, ఆత్మన్యూనత… లాంటి అంతర్గత శత్రువులతో మొదలుపెట్టి, కండిషనింగ్‌ మనని ఎలా వెనక్కి లాగుతుందో వివరించారు. వేదిక ఎక్కగానే గొంతు పెగలకపోవడానికి కారణాలేమిటీ, ఒత్తిడిని ఎలా అధిగమించవచ్చూ, ఉపన్యాపం ఇచ్చేటప్పుడు బాడీ లాంగ్వేజ్‌కున్న ప్రాధాన్యమేమిటీ, గొంతును ఎలా మలచుకోవాలీ, భాష ఎలా ఉండాలీ… ఇలాంటి ఎన్నో కీలకాంశాలను సందర్భానికి తగిన ఉదాహరణలతో, స్ఫూర్తినిచ్చే కథలతో ఆసాంతం చదివించి ఆలోచింపజేసేలా రాసిన పుస్తకమిది.

    Buy Now
  • -8%

    Vaidyudu Lenichota (Telugu)

    Original price was: ₹300.00.Current price is: ₹276.00.
    వైద్యుడు లేని చోట
    వైద్యుడు లేని చోట కేవలం ప్రథమ చికిత్సకు సంబంధించిన పుస్తకం కాదు.
    అంతకంటే ఎంతో విస్తృతమైన గ్రంథం.
    సామాన్యల ఆరోగ్యంపై ప్రభావం చూపే అనేక అంశాలను ఇది తడిమింది.
    నీళ్ల విరేచనాలు మొదలుకుని క్షయ వ్యాధి వరకు అన్ని వ్యాధుల్ని విశ్లేషించింది.
    సహాయపడే/హానిచేసే రకరకాల గృహ వైద్యాలు మొదలుకొని కొన్ని ఆధునిక మందుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల వరకు అనేక అంశాల గురించి చర్చించింది.
    పరిశుభ్రత, పౌష్టిక ఆహారం, వ్యాధి నిరోధక టీకాలు మొదలైన అంశాలకు ఈ పుస్తకంలో ప్రత్యేక ప్రాధాన్యత యివ్వడం జరిగింది.
    ఇందులో బిడ్డల పుట్టుక, కుటుంబ నియంత్రణ గురించిన సమాచారం కూడా వుంది.
    పాఠకులు తమ శ్రేయస్సు కోసం ఏం చేయాలో సూచించడమే కాకుండా ఏ సమస్యలను అనుభవజ్ఞులైన ఆరోగ్య కార్యకర్తచే పరిష్కరింపజేసుకోవాలో వారికి అవగాహనను కలిగిస్తుందీ పుస్తకం.
    సవరించబడిన ఈ సరికొత్త ముద్రణలో ఎయిడ్స్‌, గర్భస్రావం, మాదకద్రవ్యాల వ్యసనం వంటి అనేక ఆరోగ్య సమస్యలపై అదనపు సమాచారాన్ని చేర్చడం జరిగింది. అదేవిధంగా వివిధ అంశాలపై మొదటి ప్రచురణలో యిచ్చిన సూచనలని ప్రస్తు పరిస్థితులకు అనుగుణంగా సవరించడం కూడా జరిగింది.
    Buy Now
  • Amarakosam

    600.00
    Buy Now
  • Viswa Darshanam

    249.00

    1 ఉపోద్ఘాతం

    శ్రీ రాముడు నూనూగు మీసాల నూత్న యౌవనంలో వున్నప్పటి ఆయన విద్యాభ్యాసం పూర్తి అయింది. దేశాలన్నీ తిరిగి, పుణ్యక్షేత్రాలన్నీ సేవించుకుని అయోధ్యకు మరలి వచ్చాడు.

    మరలి వచ్చిన నాటి నుంచి శ్రీరాముని మనస్సు ఎందుకో చింతాక్రాం తమైపోయింది. ఏ సుఖాలమీదికి మనస్సు పోవడంలేదు. ఏవేవో ఆలోచనలు ముసురుతున్నాయి. ఏదో అశాంతి, అసంతృప్తి ఆయనను నిలవనీయడంలేదు.

    రాముడి దిగులు చూసి, తండ్రి దశరథుడికి దిగులు పట్టుకుంది. “ఏమిటి నాయనా! ఎందుకిలా దిగులుగా వున్నావు?” అని అడిగాడు. రాముడు “ఏమీలేదు నాన్నగారూ!” అనడం తప్ప, ఎన్నిసారులు అడిగినా తన చింతా కారణం చెప్పలేదు. దశరథుడికి భయం వేసింది. కులగురువైన వశిష్ఠుడికి కబురు పెట్టాడు. ఆయన వచ్చి రాముడిని సంగతేమిటో చెప్పమని గుచ్చి గుచ్చి……………….

    Buy Now
  • Pradhana Upanishattulu

    300.00
    Buy Now
  • SPOKEN ENGLISH

    195.00
    Buy Now