-
Viswa Darshanam
₹249.001 ఉపోద్ఘాతం
శ్రీ రాముడు నూనూగు మీసాల నూత్న యౌవనంలో వున్నప్పటి ఆయన విద్యాభ్యాసం పూర్తి అయింది. దేశాలన్నీ తిరిగి, పుణ్యక్షేత్రాలన్నీ సేవించుకుని అయోధ్యకు మరలి వచ్చాడు.
మరలి వచ్చిన నాటి నుంచి శ్రీరాముని మనస్సు ఎందుకో చింతాక్రాం తమైపోయింది. ఏ సుఖాలమీదికి మనస్సు పోవడంలేదు. ఏవేవో ఆలోచనలు ముసురుతున్నాయి. ఏదో అశాంతి, అసంతృప్తి ఆయనను నిలవనీయడంలేదు.
రాముడి దిగులు చూసి, తండ్రి దశరథుడికి దిగులు పట్టుకుంది. “ఏమిటి నాయనా! ఎందుకిలా దిగులుగా వున్నావు?” అని అడిగాడు. రాముడు “ఏమీలేదు నాన్నగారూ!” అనడం తప్ప, ఎన్నిసారులు అడిగినా తన చింతా కారణం చెప్పలేదు. దశరథుడికి భయం వేసింది. కులగురువైన వశిష్ఠుడికి కబురు పెట్టాడు. ఆయన వచ్చి రాముడిని సంగతేమిటో చెప్పమని గుచ్చి గుచ్చి……………….
-
-