Pusthakamaala

డా . ఆశ్లేష ఈదల ,Ph.D.
డిజిటల్ మహీళ Pvt . Ltd . మరియు మిత్ర వాక్ సంస్థల స్థాపకురాలు
ఆమె ఒక కొన్సిలింగ్ సైకాలజిస్ట్ రచయిత్రి. మరియు డిజిటల్ ఎంపపవర్మెంట్ కోచ్ .
మహిళలకు ఆర్ధిక స్వేచ్ఛ మరియు డిజిటల్ నైపుణ్యాల మధ్య గ్యాప్ ను తగ్గించి .
వారి జీవితాలను మార్చడములో ఆమె చేస్తున్న కృషి ఎంతో విశేషం .
ఆమె రూపొందించిన కార్యక్రమములు చాల మంది మహిళలకు మల్లి కెరియర్ ప్రారంభించే అవకాశం ఇచ్చి ఆర్ధికంగా వారి కాళ్ళ మీద వారు నిలబడేలా చేసి ఆత్మ విశ్వాసాన్ని పెంచాయి. మరియు ” స్క్రీన్ టు సక్సెస్ అనే దారిని చూపించాయి.

నేహా దీక్షత్ దృఢ మనస్కురాలు . ధైర్యస్తురాలు . సహానుభూతి గలిగిన రచయిత్రి . మనసును హత్తుకు పోయి, పాఠకుడిని కుదిపేసే ఈ పుస్తకం ద్యారా ఆమె అదృశ్యంగా ఉండే సామాన్య భారతీయురాలు మీద వెలుగును ప్రసరించింది . సరళంగా వున్నా ప్రతిభావంతమైన శైలీలో – సామాన్య భారతీయుల జీవితాలను అదృశ్యపు చీకటి నుంచి వెలికి తీసింది . అంతేకాదు -వారిని అవహేళన పూరితమైన జాలి , కనికరంతో కూడిన కలం చెల్లిన కథనాల నుండి బయటపడవేసి -వారి స్యయం నిర్ణయాలకు గౌరవ్ స్తానం ఇస్తుంది. ఈ పుస్తకం , మనల్ని మనం ఏ రకంగా సమర్ధించుకోలేకుండా చేసి , ఈ పుస్తకం అంతర్లీనంగా గాయపరుస్తుంది.
-ప్రతాబ్ భాను మెహ్తా

ప్రపంచంలో మూడు వందల రామాయణాలు ఉన్నాయంటారు.

ప్రతి కథ ఓ కొత్త తీరం, ప్రతి తీరం ఓ కొత్త రూపం.

అది-

వాల్మీకి రామాయణంలో ధర్మానికి పునాది వేసింది,

ఆధ్యాత్మక రామాయణంలో భక్తికి ఊపిరి పోసింది.

ఆనంద రామాయణంలో మనం ఎరుగని కథల నిధిగా మారింది,

అద్భుత రామాయణంలో రావణుడిని సంహరించిన దేవతగా సీతను చూపింది.

తమిళ నేలపై కంబ రామాయణం ప్రేమకావ్యమైతే,

ఉత్తరాన తులసీదాసుడి రామచరితమానస్ భక్తి ఉద్యమమైంది,

తెలుగులో రంగనాథ రామాయణం కథాప్రవాహమైతే,

మొల్ల రామాయణం ఒక స్త్రీ గొంతులో తేనెలొలికింది,

బెంగాల్లో కృత్తివాసి రామాయణం అక్కడి సంస్కృతిలో భాగమైంది.

కొన్నిచోట్ల కథ దారి తప్పింది…

కాదు, కొత్త దారి తొక్కింది.

జైనుల పౌమచరియంలో రావణుడ్ని చంపింది లక్ష్మణుడైంది;

బౌద్ధుల దశరథ జాతక కథలో సీతాపహరణమే లేని

శాంతి పర్వమైంది.

ఈ ప్రవాహం సరిహద్దులు దాటినప్పుడు..

రామకియన్ గా థాయ్లాండ్ జాతీయ గాథగా మారింది, రియమ్కర్గా

కంబోడియా శిల్పమై నిలిచింది.