Bhagavathamlo Manipusalu

100.00

In stock

SKU: BARANI001 Category: Tag:
Author: Oruganti Ramakrishna Prasad

“భాగవత” మంటే భగవత్తత్వాన్ని తెలియచేసేదని అర్ధం. ఈ భాగవత్తత్వాన్ని తెలియచేసేవారిని “భాగవతు”లంటారు. వాళ్ళు పరమ భగవతోత్తములై తాము దర్శించిన దానిని –

ఇతరులు ధన్యత చెందాలనే వుద్దేశంతో, తమలోని భక్తీ, ఆనందం, చైతన్యం, బ్రహ్మానందం కలిపి అందిస్తారు. అది విన్న, చదివిన వారలందరు భాగవతులై, భగవత్తత్వానందుకోవాలనే సత్సంకల్పమే వారి లక్ష్యం.

అటువంటి దివ్యలక్షణాని కనుగుణంగా ఇటు భక్తీ – వేదాంత ఆధ్యాత్మిక దృష్టి, అటు వ్యాపారదృష్టి అంటే సద్గ్రంధాలను, సర్వభక్త జనానీకానికి అందించాలనే సదాశయంతో – నాతో –

“స్వామీ! కొన్ని క్రొత్త ప్రచురణలు తిసుకోవద్డామనుకుంటున్నా” నని చెప్పి – నన్ను –

1. సంక్షిప్త భాగవతం

2. సంక్షిప్త భారతం

3. సంక్షిప్త శ్రీమద్రామాయణం

చిన్న చిన్న సంపుటాలుగా వ్రాయమని కోరారు. ఆ ఆలోచనా దివ్య సరళికి – ఈ గ్రంధమొక మచ్చుతునక. అనకూడదు కాని, ఈ కధలన్నీ చదివితే (కృష్ణ) భాగవతాన్ని చదివిన “తృప్తి” – తప్పక కల్గుతుంది. కారణం –

ఆ భగవంతుడు నాకిచ్చిన “ఆవేశ – ఆదేశాలలో కొన్ని కొన్ని సమయాలలో – ఆ పాత్రలలో పాత్రనై పోయాను. బ్రహ్మానందమను భవించాను. ఆ సందర్భాలు, సంఘటనలు తప్పక, పఠీతులను భక్తులను చేస్తాయి. భక్తులను భగవంతుని చేరువ చేస్తాయి.

                                                                                                                                                           – రామకృష్ణ ప్రసాద్

Author

Oruganti Ramakrishna Prasad

Format

Paperback